బి. పద్మనాభం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 48:
===నటగాయకుడిగా===
వాళ్ళు తీసిన "[[పాదుకా పట్టాభిషేకం (1945 సినిమా)|పాదుకాపట్టాభిషేకం]]" సినిమాలో కోరస్ లో పాడే అవకాశం వచ్చింది. పద్మనాభం సినిమాల్లో చేరగానే తమ్ముడు ఇంటికి తిరిగివచ్చేశాడు. తర్వాత పద్మనాభం [[మాయలోకం]] సినిమాలో కోరస్ లో పాడడమేగాక ఒక పాత్ర కూడా వేశాడు. ఇది నటుడిగా ఆయన తొలి సినిమా. రెండవ సినిమా [[త్యాగయ్య]]. మూడవ సినిమా [[ముగ్గురు మరాఠీలు]]. ఇక ఆ తర్వాత [[నారద నారది]], [[యోగి వేమన]],...ఇలా అవకాశాలు వరసగా వచ్చాయి. [[రాధిక]](1947)లో కృష్ణ పాత్ర వెయ్యడమే గాక ఒక గోపబాలునికి ప్లేబ్యాక్ పాడాడు. తర్వాత [[భక్త శిరియాళ]]లో చిన్న చిరుతొండడి పాత్ర, [[వింధ్యరాణి]]లో ఇటు నటన-అటు గానం.
 
1948లో [[జెమినీ పిక్చర్స్|జెమిని]] వారి వీరకుమార్ చిత్రానికి ఒప్పుకుని కొంత అడ్వాన్స్ తీసుకున్నాడు. ఈలోగా యోగివేమన తీసిన [[కె.వి.రెడ్డి]] [[గుణసుందరి కథ]] తీస్తూండడంతో ఆయన్ను [[వాహినీ స్టుడియో]] లో కలవగా ఆయన పాట పాడించుకుని విని, గొంతు బాగాలేకపోయేసరికి చికాకు పడ్డాడు: "బాగా పాడేవాడివే! ఏమైంది? గొంతు ఇలా ఉంటే కప్పులు కడగడానికి కూడా పనికిరావు" అన్నాడు. దాంతో నిరాశపడ్డ పద్మనాభం సింహాద్రిపురం వెళ్ళిపోయాడు.
 
 
అప్పుడే తేలు కాటుతో తమ్ముడు ప్రభాకరం, జబ్బుచేసి చెల్లెలు రాజేశ్వరి మరణించడంతో విరక్తి కలిగి సినిమాలకు దూరంగా ఉన్నాడు. [[గుంతకల్]] దగ్గరున్న [[కొనకొండ్ల]]లో చిన్నాన్న శ్రీనివాసరావు దగ్గర కరణీకం నేర్చుకుంటూ ఉండగా వీరకుమార్ షూటింగుకు రమ్మని కబురు వచ్చింది. ఆ షూటింగు జరుగుతున్నరోజుల్లో [[విజయా పిక్చర్స్|విజయాసంస్థ]]తో ఏర్పడిన పరిచయం ఆయన కెరీర్ ను మలుపుతిప్పింది.
 
 
[[షావుకారు]]లో నౌకరు పోలయ్య వేషానికి ముందు [[బాలకృష్ణ]]<nowiki/>ను అనుకున్నారు. ఐతే చక్రపాణి "వీడు ముదురుగా ఉన్నాడు. ఇంకెవరూ లేరా?" అని అడగడంతో దర్శకుడు [[ఎల్.వి.ప్రసాద్]] వెంటనే "రాధికలో కృష్ణుడిగా వేసిన పద్మనాభం ఉన్నాడు." అని పిలిపించి వేషం ఇప్పించారు. [[పాతాళభైరవి]] స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నప్పుడు కె.వి.రెడ్డి తోటరాముడిగా [[రాజారెడ్డి]], మాంత్రికుడిగా [[ముక్కామల కృష్ణమూర్తి|ముక్కామల]] అనుకున్నాడు. షావుకారు రషెస్ చూసిన వెంటనే మనసు మార్చుకుని హీరోగా [[ఎన్.టి.ఆర్.]], మాంత్రికుడిగా [[ఎస్.వి. రంగారావు|ఎస్.వి.ఆర్.]], అంజిగా బాలకృష్ణ (పాతాళభైరవితో ఇతడి అసలు పేరు మరుగునపడిపోయి అంజి(గాడు)గానే ప్రసిద్ధి పొందాడు), సదాజపుడిగా పద్మనాభం లను ఖరారు చేసుకుని విజయావారి పర్మనెంటు ఆర్టిస్టులుగా మూడేళ్ళ అగ్రిమెంటు తీసుకున్నారు. [[తెలుగు సినిమా|తెలుగు]], [[తమిళ సినిమా|తమిళ]] భాషల్లో [[పాతాళ భైరవి|పాతాళభైరవి]]<nowiki/>తో బాటు విజయావారి తర్వాతి చిత్రాలైన పెళ్లిచేసిచూడు, [[చంద్రహారం]] లలో నటించాడు. అదే సమయంలో గుబ్బి ప్రొడక్షన్స్ శ్రీకాళహస్తి మహాత్మ్యం లో కాశి వేషం వేశాడు. 1954లో వచ్చిన సతి అనసూయతో మొదలుపెట్టి [[కృష్ణప్రేమ]],[[ సతీ సుకన్య]], [[కృష్ణలీలలు (1959)|కృష్ణలీలలు]], [[శ్రీరామకథ]], [[సతీ తులసి (1959 సినిమా)|సతీ తులసి]], [[ప్రమీలార్జునీయం]] లలో నారదుడిగా వేశాడు.
"https://te.wikipedia.org/wiki/బి._పద్మనాభం" నుండి వెలికితీశారు