శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం (నెల్లూరు): కూర్పుల మధ్య తేడాలు

చి సవరణ
ట్యాగు: 2017 source edit
చి సవరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 8:
[[File:Sri Ranganathaswamy Temple, Galigopuram, Nellore (11).jpg|thumb|శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం, గాలిగోపురం]]
ప్రసిద్ధి చెందిన రంగనాధ స్వామి దేవాలయాల్లో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఒకటి.ఇచ్చట శ్రీరంగనాథ్ స్వామి ఆలయం దర్శించగలం. విశాలమైన ఆలయ ప్రాంగణముకు తూర్ప దిశ నందు ఏడు అంతస్ధుల రాజగోపురం కలదు. ఆలయ ప్రవేశం రాజగోపురం క్రింద నుంచి జరుగుతుంది. ప్రధానాలయం పశ్చిమాభి ముఖంగా ఉంటుంది. ఆలయం నకు పశ్చిమ వైపున పెన్నానది ప్రవాహించు చున్నది. దీనిని పినాకినీ నది అని కూడ పిలుస్తారు. భక్తులు నదీ స్నానం ఆచారించి దైవ దర్శనముకు బయులు దేరుతారు.ప్రధానాలయం ప్రవేశం దక్షిణ ద్వారం నుంచి జరుగుతుంది. ముఖమండపం, అంతరాళయం, గర్భాలయం ఉంటాయి. గర్భాలయం నందు శేషుతల్పం పై శయనముద్రలో శీ రంగనాథడు నయన మనోహరంగా దర్శనమిస్తాడు. స్వామి పాదాల వద్ద శ్రీదేవి - భూదేవిని దర్శించవచ్చును. గర్భాలయం చుటూ ప్రదక్షిణ గావించుటకు వీలుగా ముఖ మండపం నిర్మించారు. ప్రదక్షిణ మండపం నందు ఉత్తర భాగంలో శ్రీ రంగనాథుని పాదాలు, శ్రీ అనంత పద్మనాభ స్వామిని చూడగలము
మహాకవి తిక్కన ఈ దేవాలయంలోనే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు. 12వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం మొదట శ్రీ వైకుంఠంగా పిలవబడేది. 17వ శతాబ్దం తరువాత ఈ దేవాలయం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయానికి సంబంధించిన గాలి గోపురం 7 అంతస్థులుగా నిర్మితమై సుమారు 95 అడుగుల ఎత్తు ఉంటుంది.ఈ గాలి గోపురంపై భాగాన బంగారు పూత పూసిన 7 కలశములు ఉంటాయి.క్రీ.శ. 7,8 శతాబ్దాల్లో సింహపురి నేలిన పల్లవ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పబడుతోంది. 12 వ శతాబ్దం లోని రాజరాజనరేంద్రుడు, ఉభయ కుళోత్తుంగ ఛోళుడు గోదావరి, కావేరీ నదుల మధ్యభాగాన్ని పరిపాలించే సమయంలో ఈ ఆలయ గర్భగృహ, ప్రాకారాదులను నిర్మింపచేశారు.క్రీ.శ 1879 వ సంవత్సరం లో శ్రీ యెరగడిపాటి వెంకటాచలం పంతులుగారు ఈ ఆలయ తూర్పు రాజగోపురాన్ని నిర్మింపచేశారు. సుమారు 100 సంత్సరాలకు పూర్వం శ్రీమాన్ ముప్పిరాల నరసింహాచార్యుల వారు శ్రీ స్వామివారికి బంగారం తాపడం చేసిన గరుడ వాహనాన్ని, అద్దాలమండపాన్ని బహూకరించారు. ఈ గోపురంపై అనేక దేవతా విగ్రహాలను అందంగా తీర్చిదిద్దారు. గర్భగుడిలోకి ప్రవేశించే ఉత్తర ద్వారాన్ని ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే తెరచి వుంచుతారు. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామికి ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ దేవాలయంలోని అద్దాల మండపం ఇక్కడికి వచ్చే భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ అద్దాల మండపంలో సీలింగ్ కు చిత్రించిన శ్రీ కృష్ణుని తైల వర్ణ చిత్రం మనం ఎటువైపు నిలబడి చూసినా మనవైపే చూస్తున్నట్లుగా మనల్ని మంత్ర ముగ్ధులను చేస్తుంది.
=దర్సన సమయం=
ఆలయం దర్శనం ఉదయం 6:30 నుంచి 12 గంటలు తిరిగి సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8 గంటలు వరకు దొరుకుతుంది.
=రవాణా సౌకర్యం=
రైలు
పంక్తి 18:
=వసతిసౌకర్యములు=
గాంధీ బొమ్మ సెంటర్ లో యాత్రికులుకు వసతులు దొరుకుతాయి
=అడ్రస్సు=
: తల్పగిరి రంగనాథస్వామి ఆలయం, రంగనాయకులపేట, నెల్లూరు – 524001, ఫోన్: 0861 2331156
 
==గాలిగోపురం గ్యాలరీ==