రామాయణ విషవృక్షం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రామాయణం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[Image:Telugubookcover ranganayakamma1.JPG|right|thumb|250px|రామాయణ విషవృక్షం ముఖచిత్రం.]]
'''[[రామాయణ విషవృక్షం]]''' గ్రంథం [[రామాయణం]]పై మార్క్సిస్టు ధృక్పథంతో [[రంగనాయకమ్మ]] వ్రాసిన విమర్శనాత్మక గ్రంథం.<ref>http://www.ranganayakamma.org/reports_on_vishavruksham.htm</ref> రామాయణం భూస్వామ్య సంస్కృతికి ప్రతీక అని రచయిత్రి ఈ గ్రంథంలో నిరూపించే ప్రయత్నం చేసింది. ఈ గ్రంథం వామపక్ష, హేతువాద, మార్క్సిస్టు వర్గాలలో మంచి ఆదరణ పొందింది.
 
ఈ గ్రంథం వాల్మీకి రామాయణంపై ఆధారితమైనది. ఇది వాల్మీకి రామయణంలోని కాండాల వరుసక్రమాన్ని యధాతధంగా పాటిస్తుంది. [[బాలకాండ]], [[అయోధ్యకాండ]], [[అరణ్యకాండ]], కిష్కిందకాండ, [[యుద్ధకాండ]], [[సుందర కాండ|సుందరకాండ]] మరియు [[ఉత్తరకాండము|ఉత్తరకాండ]]. వాల్మీకి రామాయణం ఏడు అధ్యాయాలుగా వెలువడగా, విషవృక్షము మూడు భాగాలుగా వెలువడింది. ఒక్కొక్క భాగము దాదాపు 700 పేజీల [[పుస్తకము]]. అదే విధంగా వాల్మీకి రామాయణం 2,400 శ్లోకాలతో కూడుకున్నదైతే, రామయణ విషవృక్షం 16 పెద్ద కథలు, వాటికి అనుబంధంగా 11 వ్యాఖ్యానాలతో మరియు విమర్శకు మద్దతుగా సంస్కృత మూలాన్ని ఉదహరిస్తూ 600 పాదపీఠికలతో కూడిఉన్నది.
 
రంగనాయకమ్మ ఈ గ్రంథ రచనకై [[తెలుగు లిపిలోలిపి]]<nowiki/>లో ప్రచురితమైన రెండు సంస్కృత మూల గ్రంథాల యొక్క సహాయం తీసుకొన్నది. వీటిలో శ్లోకాలకు ప్రతిపదార్ధాలతో పాటు, తెలుగులో టీకాతాత్పర్యాలు ఇవ్వబడినవి. ఈ రెండు గ్రంథాలు 1900-1955ల మధ్య గట్టుపల్లి శేషాచార్యులు మరియు చదలవాడ సుందరరామశాస్త్రులచే రచించబడి శశిలేఖ ముద్రాక్షరశాల (చెన్నై) మరియు [[వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్]] వారిచే ప్రచురించబడినవి.
 
ముఖ్యపాఠ్యం కాకుండా రామాయణ విషవృక్షానికి 1, 2 భాగాలకు పొడువాటి ముందుమాటలునూ, మూడవ భాగానికి చివరలో పెద్ద ఉపసంహార పాఠ్యమున్నూ ఉన్నాయి. ఈ మూడు భాగాలు మూడు సంవత్సరాలు వరుసగా 1974, 75 మరియు 76లలో వెలువడ్డాయి. ఇవి అనేక మార్లు పునర్ముద్రించబడ్డాయి కూడా. 200 వరకు మొదటి భాగం ఏడుసార్లు, రెండవ భాగం ఆరుసార్లు, మూడవ భాగం నాలుగుసార్లు ముద్రించబడ్డాయి.<ref>http://ranganayakamma.org/summary_of_vishavruksham.htm</ref>
"https://te.wikipedia.org/wiki/రామాయణ_విషవృక్షం" నుండి వెలికితీశారు