తరిమెల నాగిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
పాఠశాల రోజుల నుండే సమాజములోని అసమానతలకు వ్యతిరేకంగా తిరుగుబాటు లక్షణాలు కనబరిచాడు. [[మద్రాసు]]లోని లయోలా కళాశాలలో [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]] (10+2) చదివేరోజుల్లో తన జాతీయతా భావాల కారణంగా కళాశాల యాజామాన్యానికి, ఆచార్యులతో నాగిరెడ్డికి పొసగలేదు. లయోలా కళాశాల యాజమాన్యము నాగిరెడ్డికి [[జవహర్ లాల్ నెహ్రూ]] బహిరంగ ఉపన్యాసాలకు హాజరైనందుకూ, రామస్వామి ముదలియారుకు, సత్యమూర్తికి మధ్య జరిగిన ఎన్నికల ప్రచారములో పాల్గొన్నందుకు మరియు వ్యాసరచనా పోటీలలో మహమ్మద్ బిన్ తుగ్లక్‌ను ప్రశంసించినందుకు, అనేకసార్లు [[జరిమానా]] విధించింది.
 
నాగిరెడ్డి లయోలా కళాశాల తరువాత [[వారణాసి]], [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం]]లో విద్యనభ్యసించాడు. వారణాసిలో ఉన్న నాలుగేళ్ళలో నాగిరెడ్డి [[కమలాదేవి ఛటోపాధ్యాయ]], [[లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్|జయప్రకాశ్ నారాయణ్]],[అచ్యుత్ పట్వర్ధన్ వంటి వారిచే ప్రభావితుడయ్యాడు. కమ్యూనిజం మరియు మార్క్సిజంతో ఈయనకు వారణాసిలోనే పరిచయమయ్యింది. [[రష్యన్]] విప్లవము మరియు [[స్టాలిన్]] నాయకత్వము గురించి విస్తృతముగా చదివి, [[భారత దేశము|భారతదేశము]]<nowiki/>లో కూడా మార్క్సిజాన్ని అమలుచేయవచ్చని నమ్మటం ప్రారంభించాడు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఉపకులపతిని నిలదీశారు. [[మహాత్మా గాంధీ|మహాత్మాగాంధీ]]<nowiki/>కి అది తెలిసి తరిమెల నాగిరెడ్డి వైస్ ఛాన్సలర్‌కి క్షమాపణలు చెప్పాలని ఉత్తరం రాశారు. నాగిరెడ్డి అందుకు ఒప్పుకోలేదు. తిరస్కరించారు.
 
నాగిరెడ్డి తన ప్రభుత్వ వ్యతిరేక రాజకీయకలాపల వల్ల అనేకమార్లు [[జైలు]]కు వెళ్లాడు. 1940లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ''యుద్ధం మరియు ఆర్ధిక వ్యవస్థపై దాని ప్రభావం'' అన్న పుస్తకం వ్రాసి ప్రభుత్వము యొక్క ఆగ్రహానికి గురై జైలుకు వెళ్ళాడు. [[తిరుచిరాపల్లి]] జైలునుండి విడుదల కాగానే మరలా 1941లో భారతీయ రక్షణ చట్టము కింద అరెస్టయ్యాడు. 1946లో ప్రకాశం ఆర్డినెన్సు కింద అరెస్టయ్యి 1947లో విడుదల చేయబడ్డాడు.
"https://te.wikipedia.org/wiki/తరిమెల_నాగిరెడ్డి" నుండి వెలికితీశారు