కాకతీయులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 101:
"కాకతీయుల కులము" గురించి చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయమున్నవి. కొన్ని శాసనాల్లో సూర్యవంశ క్షత్రియులని, మరి కొన్ని పుస్తకాల్లో తెలుగు నాయక వంశాల మాదిరి "దుర్జయ వంశము"వారని చెప్పబడ్డారు. [[గుంటూరు]] తాలూకా [[మల్కాపురం]]లో కూలిపోయిన ఒక గుడియొద్ద ఉన్న నంది విగ్రహం మీద చెక్కిన శిలాశాసనం 395 (A. R. No. 94 of 1917.) కాకతీయులు సూర్యవంశపు క్షత్రియులని తెలుపుచున్నది <ref name="Andhra Historical Research Society pp. 147-64">Journal of the Andhra Historical Research Society, Vol. IV, pp. 147-64.</ref>. [[కర్నూలు]] జిల్లా [[త్రిపురాంతకం]]లో ఉన్న త్రిపురాంతకేశ్వర ఆలయంలో చెక్కబడిన శిలాశాసనం 371 (A. R. No. 196 of 1905.) ప్రకారం గణపతిదేవుడు సూర్యవంశ క్షత్రియుడని తెలుపుచున్నది <ref name="Andhra Historical Research Society pp. 147-64"/>. [[రుద్రమ దేవి]] భర్త వీరభద్రుడు కాస్యప గోత్రీకుడు కావున తర్వాత కాలంలో కాకతీయులు కాస్యపగోత్రపు క్షత్రియులుగా చెప్పుకున్నారని చరిత్రకారుల భావన <ref>Social and Economic Conditions in Eastern Deccan from $A.D. 1000 to A.D. 1250 By A. Vaidehi Krishnamoorthy</ref><ref>Ventakaramanayya, N. The Early Muslim Expansion in South India, 1942</ref> "శ్రీ మన్మహాపరిచ్చేదక వర్ణాట కోట కాకతీ వంశ పాటవముల వసిష్ట కౌండిన్య వర ధనంజయ కాస్యపాఖ్య గోత్రంబుల నతిశయిల్లు" అని శ్రీ మాన్ పరవస్తు వెంకటాచార్యులు వ్రాశారు. ఇందులో కాకతీయులు కాస్యప గోత్రీకులని తెలుస్తోంది.
 
చిలుకూరి వీరభద్రరావు తన ఆంధ్ర చరిత్రలో వడ్డమాని శాసనం, బూదవూరు శాసనం, త్రిపురాంతక శాసనం ఆధారంగా చేసుకొని కాకతీయులు శూద్రులుక్షత్రియులు అని చెప్పడానికి ప్రయత్నించారు. ఈ రచనను [[వెల్లాల సదాశివ శాస్త్రులు]], [[రుద్రరాజు నరసింహరాజు]], [[వంగూరి సుబ్బారావు]] వంటి పెక్కు మంది రచయితలు విమర్శించారు.
 
[[గూడూరు]] శాసనంలో దూర్జయాన్వ సంభూతుడైన ఎర్రన యు అతని భార్యయైన కమ్మసాని యు [[బేతరాజు]]ను కాకతి వల్లభు చేశారని వ్ర్రాయబడి ఉంది."గరవపాడుశాసనం" లో తమ కాకతీయ కుటుంబీకులకు దుర్జయుని కారణo గానే కీర్తి లభించిందని చెప్పుకున్నాడు....
"https://te.wikipedia.org/wiki/కాకతీయులు" నుండి వెలికితీశారు