పంబల వారు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
;సర్కారు ఆంధ్ర ప్రాంతంలో ఒకప్పుడు విరివిగా జరిగే దేవతల కొలువుల్లోనూ, జాతర్ల లోనూ [[పంబల]] వారి కథలు ఎక్కువగా జరుగుతూ వుండేవి. ఈ నాటికీ గ్రామ దేవతలను కొలిచే ప్రతి చోటా ఈ కథలు జరుగుతూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ కథలు కనుమరుగు ఔతున్నాయి. ప్రస్తుతము చిత్తూరు జిల్లాలో గ్రామ దేవతల పూజలలో ఈ వాయిద్యాన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇంటి వారు పూజకు ఇంటినుండి బయలు దేరి నప్పటినుండి దేవాలయము వరకు ముందు పంబల వారు పంబల వాయిస్తూ ముందు నడవాల్సిందే. (మొగరాల గ్రామంలో తీసిన చిత్రము చూడుము) ఈ వాయిద్యము వీరావేశాన్ని రేకెత్తిస్తుంది. ఈ సందర్భంగా కొందరికి పూనకం రావడం కూడా జరుగుతుంది.
 
పంబల వారు అయ్యగారి దర్శనానికి చెందిన హరిజనులనీ, వీరి వాయిద్యం ''పంబ జోడనీ, వీరు ఎక్కువగా '' [[అంకమ్మ]] '' కథలను పాదుతారనీ, వీరు కొలిచే అంకమ్మకు, ''మురాసపు అంకమ్మ '' అని పేరనీ వంతలు పంబ జోడును వాయిస్తూ [[శ్రుతి]] కి [[తిత్తి]] ఊదుతూ వుంటే కథకుడు రాజ కుమారునిలా వేషాన్ని ధరించి కుడి చేతితో పెద్ద కత్తినీ, ఏడమ చేతితో ''అమజాల '' అనే చిన్న కత్తిని పట్టుకుని వీరా వేశంతో [[చిందులు]] తొక్కుతూ కథను పాడుతారనీ, డా: [[తంగిరాల వెంకట సుబ్బారావు]] గారు జానపద కళోత్సవాల సంచికలో వివరించారు.
 
;పంబల వాయిద్యము జంటగా వుంటాయి. ఇవి తప్పనిసరిగా ఇత్తడి లోహంతో చేసినవై వుంటాయి. వీటిని వాయించడానికి రెండు పుల్లలు అవసరము. వీటి శబ్ధము మధురముగా వుండదు గాని వీరావేశాన్ని రేకెత్తించే విధముగా వుంటుంది. ఈ వాయిద్యము సంగీత కచ్చేరీలలో వాడరు. కేవలము పూజా సమయములలో, కర్మకాండల సమయంలలో మాత్రమే ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/wiki/పంబల_వారు" నుండి వెలికితీశారు