బంకుపల్లె మల్లయ్యశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''[[బంకుపల్లె మల్లయ్యశాస్త్రి]]''' ప్రముఖ పండితుడు. [[సంఘసంస్కర్త]]. [[రచయిత]].
==జననం==
ఇతడు [[1876]]వ సంవత్సరం [[ఏప్రిల్ 29]]వ తేదీకి సరియైన [[ధాత]] నామ సంవత్సరం [[వైశాఖ శుద్ధ పంచమి]] నాడు [[పునర్వసు]]నక్షత్రము, తులాలగ్నములో [[గంజాం]] జిల్లా [[సింగుపురం (శ్రీకాకుళం మండలం)|సింగుపురం]] గ్రామంలో తన మాతామహుని[[మాతామహుడు|మాతామహు]]<nowiki/>ని ఇంటిలో జన్మించాడు<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=19798 కావ్యతీర్థ, పురాణవాచస్పతి బంకుపల్లె మల్లయ్యగారు - పట్నాల అన్నయ్యశాస్త్రి - భారతి మాసపత్రిక- సంపుటి 13, సంచిక 5 - 1936, మే - పేజీలు 561- 567]</ref>. ఇతని స్వగ్రామము [[శ్రీకాకుళం జిల్లా]], [[నరసన్నపేట]] మండలానికి చెందిన [[ఉర్లాం]] గ్రామము. ఇతని తల్లిదండ్రులు సూరమ్మ మరియు గంగన్న. ఇతనిది కృష్ణ యజుశ్శాఖ, ఆపస్తంబ సూత్రుడు మరియు భారద్వాజ గోత్రుడు.
 
==బాల్యం, విద్యాభ్యాసం==
పంక్తి 8:
 
==ఉద్యోగము==
ఇతడు తన 21వ యేట [[శ్రీకాకుళం]] హైస్కూలులో [[తెలుగు]] పండిత పదవికి 18మంది పండితులతో పోటీపడి ప్రథముడిగా నెగ్గి ఆ ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. అక్కడ రెండు [[సంవత్సరాలు]] పనిచేశాడు. తర్వాత కొంతకాలం [[లుకలాం]] గ్రామంలో కన్నేపల్లి రామావధాని కుమారులకు సంస్కృతం బోధించాడు. ఆ తర్వాత [[పర్లాకిమిడి]] రాజా వారి ఇంగ్లీషు కళాశాలలో తెలుగు పండితపదవిని చేపట్టాడు. [[బరంపురం]] సిటీ కాలేజీలో[[కాలేజీ]]<nowiki/>లో కూడా సంస్కృతాంధ్రపండితుడిగా కొంతకాలం పనిచేశాడు.
 
==కుటుంబము==
ఇతనికి ఇరువులుఇరువురు భార్యలు, ఏడుగురు [[కొడుకు|కుమారులు]], ఒక [[కూతురు|కుమార్తె]]<nowiki/> కలిగారు. ఇతని రెండవ భార్యపేరు వెంకటరత్నమ్మ. ఈమె పర్లాకిమిడి సంస్థాన సంగీత విద్వాంసుడైన పోకల నరసింహంగారి కుమార్తె. విదుషీమణి. ఈమె సంగ్రహ రామాయణము (ద్విపద), జానకీ విజయము, బాల భారతము వంటి రచనలు గావించింది. మల్లయ్య శాస్త్రి కుమార్తె పేరు కృష్ణవేణమ్మ. ఇతడు తన కుమార్తెకు శతావధాని [[వేదుల సత్యనారాయణశాస్త్రి]]కి ఇచ్చి పునర్వివాహం చేశాడు.
 
==రచనలు==
పంక్తి 27:
 
==సంఘసంస్కరణ==
సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన మల్లయ్యశాస్త్రి హైందవ సాంప్రదాయంలో ఉన్న మూఢాచారాలను వ్యతిరేకించాడు. తన రెండవభార్యవలన కలిగిన ప్రథమకుమారుని జనన సమయంలో వారి ఆచారం ప్రకారం నల్లమేకను శక్తికి బలి ఇవ్వవలసి ఉండగా ఇతడు ఆ ఆచారాన్ని విసర్జించాడు. [[స్త్రీ]] పునర్వివాహము శాస్త్రీయమని అనేక సభలలో వాదించి నిరూపించాడు. స్త్రీ విద్య ఆవస్యకత గురించి ఉపన్యాసాలు చేశాడు. అంతే కాకుండా తన ద్వితీయభార్యకు విద్య నేర్పించి మూడు ప్రభందములు, భారత భాగవత పురాణాలను నేర్పించాడు. ఇతడు నేర్పిన విద్య కారణంగా ఆమె సంగ్రహ రామాయణము, మరికొన్ని గ్రంథాలను రచించగలిగింది. ఇతడు [[ఆంధ్రపత్రిక]], [[భారతి (మాస పత్రిక)|భారతి]] పత్రికలద్వారా ధర్మశాస్త్రములను పరిశీలించి అందలి విషయాలను సప్రమాణకంగా ప్రకటించేవాడు. రజస్వలానంతరమగు పురుష సంయోగార్హ కాలమే స్త్రీలకు వివాహకాలం అన్న సిద్ధాంతాన్ని ప్రకటించి నిరూపించాడు. స్త్రీ పునర్వివాహము పూర్వాచారము కాకపోయినప్పటికి శాస్త్రీయము కాబట్టి ఆచరణీయమని ఇతడు వాదించాడు. సతీ శాసనము వచ్చిన తర్వాత పునర్వివాహము అవశ్యకత కలిగినదని ఇతడు వాదించి పత్రికలలో చర్చ కొనసాగించాడు. శారదా చట్టం ప్రతిపాదించిన కాలంలో ఆ చట్టానికి అనుకూలంగా [[మద్రాసు]] మొదలైన పలు ప్రాంతాలలో పెద్దపెద్ద సభలలో చర్చలు చేసి పండితులతో రజస్వలానంతర వివాహమే శాస్త్రీయమని అంగీకరింపచేశాడు. తన కుమార్తె కృష్ణవేణమ్మకు పునర్వివాహం చేయడమే కాకుండా శాఖాంతర వివాహం చేసి ఆకాలంలో ఆదర్శంగా నిలిచాడు. అస్పృశ్యతావ్యతిరేకంగా [[ఆంధ్రపత్రిక]], త్రిలిఙ్గ పత్రికలలో వ్యాసములు వ్రాశాడు. [[మద్రాసు]], [[నెల్లూరు]], [[గుంటూరు]], [[గోదావరి]], [[కృష్ణా జిల్లా|కృష్ణ]], [[విశాఖపట్నం]], [[గంజాం]] మండలాలలో తిరిగి అస్పృస్యతాప్రచారం చేశాడు. శూద్రులను తన ఇంటికి పిలిచి వారితో పాటు [[భోజనము]] చేసేవాడు. అప్పారావు అనే ఒక బ్రాహ్మణేతరుడిని తన ఇంటిలోనే ఉంచుకుని తన కుమారులతో పాటుగా చదువు సంధ్యలు చెప్పాడు.
 
==వ్యక్తిత్వము==