ఉప్పు సత్యాగ్రహం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
ఈ సత్యాగ్రహం ప్రారంభానికి కొన్నిరోజులకు ముందే [[బ్రిటిష్]] వారు గాంధీని మార్చి 5, 1930 న అరెస్టు చేశారు. ఈ ఉప్పుసత్యాగ్రహం గురించి ప్రపంచానికి తెలిసినపుడు, [[ప్రపంచం]] దృష్టియంతా ఈ సత్యాగ్రహం వైపున ఆసక్తిగా వుండినది. ఈ సత్యాగ్రహం దాదాపు ఒక సంవత్సరకాలం వుండినది. [[మహాత్మా గాంధీ|మహాత్మాగాంధీ]]<nowiki/>ని జైలునుండి విడుదల చేశాక, వైశ్రాయ్ అయిన [[లార్డ్ ఇర్విన్]]తో [[రెండవ రౌండ్ టేబుల్ సమావేశం]] సంభాషణలు మొదలయ్యాయి.<ref>Dalton, p. 92.</ref> ఈ సత్యాగ్రహం మూలంగా దాదాపు 80,000 వేలకు పైగా భారతీయులు కారాగారాల పాలయ్యారు.<ref>Johnson, p. 234.</ref> ఈ ఉద్యమం బ్రిటిష్ రాజ్య అరాచక విధానాలు తేటతెల్లమైనాయి.<ref name="Johnson, p. 37">Johnson, p. 37.</ref><ref>Ackerman & DuVall, p. 109.</ref> మరియు లక్షలకొద్దీ భారతీయులు స్వాతంత్ర్యోద్యమం పట్ల ఆకర్షితులయ్యారు.<ref>Ackerman & DuVall, pp. 106.</ref>
 
 
== ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో ఆంధ్రుల పాత్ర ==
 
దండి మార్చ్‌లో మహాత్ముడితో పాటు 78 మంది అనుచరులు పాల్గొన్నారు. http://www.gandhiashramsevagram.org ప్రకారం ఆంధ్ర ప్రాంతం నుంచి దండి మార్చిలో గాంధీతో పాటు నడిచిన ఏకైక తెలుగు వ్యక్తి ఎర్నేని సుబ్రమణ్యం. తర్వాత కాలంలో ఆయన గాంధీ సిద్ధాంతాలతో కొమరవోలులో ఒక ఆశ్రమాన్ని స్థాపించారు.
 
నెల్లూరులో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించిన దండు నారాయణరాజును నాటి ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టడంతో ఆయన అక్కడే మరణించారు.
 
ఉప్పు సత్యాగ్రహం సమయంలోనే 'కవిరాజు' త్రిపురనేని రామస్వామి చౌదరి ''వీర గంధము తెచ్చినారము వీరులెవ్వరొ తెల్పుడి'' అనే గేయకవితను రాశారు.
 
మాక్సిం గోర్కీ రాసిన రష్యన్ నవల 'ది మదర్'ను 'అమ్మ' పేరుతో తెలుగులోకి అనువదించిన క్రొవ్విడి లింగరాజు ఈ ఉద్యమ సమయంలోనే దేశ ద్రోహం నేరంపై జైలుకెళ్లారు.
 
బ్రహ్మాజోశ్యుల సుబ్రమణ్యం సీతానగర ఆశ్రమాన్ని స్థాపించారు. దీన్నే 'ఆంధ్రా దండి'గా పిలుస్తారు.
 
ఉప్పు సత్యాగ్రహం సందర్భంలోనే కేంద్ర శాసన సభకు రామదాసు పంతులు, శాసన మండలి సభ్యత్వానికి స్వామి వెంకటాచలం రాజీనామాలు చేశారు.
 
ఉప్పు చట్టాలను ఉల్లఘించి బులుసు సాంబమూర్తి, ఉన్నవ లక్ష్మీనారాయణ ( మాలపల్లి నవల రచయిత), ఖాసా సుబ్బారావు లాఠీ దెబ్బలు తిన్నారు.
 
టంగుటూరి ప్రకాశం పంతులు మద్రాసులోని తన నివాసం వేదవనంలో సత్యాగ్రహ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
 
విశాఖపట్నంలో తెన్నేటి విశ్వనాథం, మచిలీపట్నంలో అయ్యదేవర కాళేశ్వరరావు, రాయల సీమ పరిధిలో కల్లూరి సుబ్బారావు ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు.
 
నెల్లూరులోని మైపాడు బీచ్‌లో బెజవాడ గోపాలరెడ్డి ఉప్పు తయారు చేసి ప్రజలకు అమ్మారు.
 
== సత్యాగ్రహం ==
"https://te.wikipedia.org/wiki/ఉప్పు_సత్యాగ్రహం" నుండి వెలికితీశారు