గంటల పంచాంగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}
[[తిథి]], [[వారం]], [[నక్షత్రం]], [[కరణం]], [[యోగం]] - ఈ ఐదు భాగముల కలయికే పంచాంగం ("పంచ"-"అంగం"). పంచాంగం దుర్ముహూర్తములు, శుభముహూర్తములు తెలుపుతుంది. [[పంచాంగం]]లు రెండు రకములు. చాంద్రమాన పంచాంగం (చంద్రుని సంచరణతో అనుసంధానమైనది), సూర్యమాన పంచాంగం (సూర్యుని సంచరణతో అనుసంధానమైనది). అందులో తెలుగువారికి చాలా పాచీన్యంలో ఉన్న పంచాంగాలలో పిడపర్తి వంశం వారు వ్రాసిన [[గంటల పంచాంగం]] ముఖ్యమైనది, ప్రామాణికమైనది.
 
==పిడపర్తి వారి వైశిష్ఠ్యం==
పూర్వము [[విజయనగరము]]ను పాలించిన శ్రీ [[పూసపాటి నారాయణరాజు]] గారు సంవత్సరాంతమున లెక్కలు సరిచేయుటకు జమలు బందు చెయ్య వలసినిదిగా ఆజ్ఞఇచ్చి [[కోటిపల్లి]] ఠాణాకు జమా బందీకి ప్రయాణం సాగించారు రాజుగారు.
 
అదేమి చిత్రమో కాని ఎప్పుడు పల్లకీ ఎక్కినా రాజుగారు తల్లిడిల్లి పోయి చిన్న పిల్లవానివలె అల్లరిచేస్తూ ఉండేవారట. పల్లకీ ఎక్కడం మానుట రాజ లాంచనానికి విరుద్ధం. అందుచేత తాత్కాలిక ఉపశమనం కోశం [[వైద్యులు]], భూతవైద్యులు అనుపానాలిస్తూ మంత్రాక్షతలు జల్లుతూ అనుసరిస్తూ ఉండేవారు. వీరిని పల్లకీపౌజా అనేవారట.
 
జమాబందీ జరుగుతోంది. హైరాణా తీర్చుకోవడానికి పైకివచ్చి తిరిగి వెళ్ళుచుండగా ఒక ఆహితాగ్ని ఎదురై " ప్రభూ! నేను జ్యోతి శాస్త్రమును క్షుణ్ణముగా చదువుకున్నాను. ప్రశ్నాభాగం అమోఘంగా చెప్తాను" అని విన్న వించగా వినోదంగా కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలనే తలంపుతో "ఇక్కడున్న వారంతా ఆశ్చర్యపడేటట్టు యేదైనా చెప్పండి" అని ఆనతియ్యగా వెంటనే ఆ వచ్చిన బ్రాహ్మణుడు తన ఇష్ట దైవమును ప్రార్థించి అంతర్ముఖుడై అంతా స్తంభించేటట్లు " పల్లకీ బొంగులో వుల్లిపాము ఉన్నది" అని నోటివెంట మాట సూటిగా అనేసరికి అంతా నిర్ఘాంత పోయారు.
 
ప్రభ్వుకు పట్టరాని కోపం వచ్చింది. కాని ముందుగా మాట ఇచ్చినందున జబదాటుట మర్యాదకాదని వజ్ర వైఢూర్య స్థగిత మైన సదరు [[పల్లకీ]] నుంచి బొంగు విడదీసి పగుల గొట్టించగా పాము పైకి వచ్చింది. ఎక్కడివారు అక్కడ కొయ్యలవలె అయిపోయారు.
 
తమకు ఇన్నాళ్ళు గ్రహమై వక్రించిన [[పాము]]ను నిగ్రహించి నందులకు అనుగ్రహించిన వారై గ్రామమొకటి దానపట్టావ్రాసి ఇచ్చిరి. ఇదే నేటి '''బూరాడ పేట అగ్రహారం'''. ఆ కుటుంబీకులే
"https://te.wikipedia.org/wiki/గంటల_పంచాంగం" నుండి వెలికితీశారు