ఎ.కోదండరామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
[[కె.రాఘవేంద్రరావు]] శిష్యుడైన '''కోదండరామిరెడ్డి'''కి దర్శకుడిగా తొలిచిత్రం "[[సంధ్య]]". [[హిందీ భాష|హిందీ]] చిత్రం 'తపస్య' ఆధారంగా ఈ సినిమాను తీసారు. ఇది కుటుంబచిత్రంగా ఓ మాదిరిగా విజయవంతమైంది. చాలా కొద్దికాలంలోనే పెద్ద హీరోలతో అవకాశాలు వచ్చాయి. [[చిరంజీవి]]ని తారాపథానికి తీసుకెళ్ళిన [[ఖైదీ]] చిత్రం కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చింది. "[[న్యాయం కావాలి]]" చిత్రంతో మొదలైన వీరి సినీ నిర్మాణ బంధం "[[ముఠా మేస్త్రి]]" సినిమా వరకు సాగింది. వీరిద్దరు కలిపి 23 సినిమాలకు పనిచేసారు. అందులో 80% విజయం సాధించాయి. ఆ కాలంలోని కథానాయకుల్లో ఒక్క [[ఎన్.టి.ఆర్.|ఎన్.టి.ఆర్]] తో తప్ప అందరు ప్రముఖ నటులతోనూ చిత్రాలు తీసారు.
==విశేషాలు==
కోదండరామిరెడ్డి [[నెల్లూరు జిల్లా]] [[మైపాడు]]లో మధ్య తరగతి [[వ్యవసాయం|వ్యవసాయ]] కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి వెంకూరెడ్డి, తల్లి రమణమ్మ. [[ఇందుకూరుపేట]], [[నరసాపురం]]<nowiki/>లలో చదువు కొనసాగించి, ఎస్.ఎస్.ఎల్.సి దాకా చదువుకున్నాడు. విద్యార్థిదశనుండే నాటకాలంటే కోదండరామిరెడ్డికి పిచ్చి. పీయూసీ చదువుతూ మధ్యలోనే చదువు మానేసి సినిమాల్లో హీరో అవ్వాలనే కోరికతో రైలెక్కి [[చెన్నై|మద్రాసు]] వచ్చాడు. అక్కడ తన బంధువు [[మందాడి ప్రభాకర రెడ్డి|ప్రభాకరరెడ్డి]] ద్వారా [[పి.చంద్రశేఖరరెడ్డి (దర్శకుడు)|పి.చంద్రశేఖరరెడ్డి]] పరిచయమయ్యాడు. అతని సలహా మేరకు హీరో వేషాలకై ప్రయత్నాలు మానివేసి [[మనుషులు మారాలి]] సినిమాకు [[వి.మధుసూధన రావు]] వద్ద సహాయ దర్శకుడిగా చేరాడు.
 
==చిత్రసమాహారం==
"https://te.wikipedia.org/wiki/ఎ.కోదండరామిరెడ్డి" నుండి వెలికితీశారు