ఆదిల్‌షాహీ వంశం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
బీజాపూర్ స్వతంత్ర రాజ్యంగా కాక ముందు ఈ వంశ వ్యవస్థాపకుడు [[యూసఫ్ ఆదిల్ షా]] (1490–1510), బీజాపూర్ రాజ్యవిభాగానికి గవర్నర్ గా నియమింపబడ్డాడు. యూసఫ్ ను, అతని కొడుకు ఇస్మాయిల్ ను ఆదిల్ ఖాన్ బిరుదుతో వ్యవహరిస్తారు. ఖాన్ అంటే [[పర్షియన్]], [[మంగోలియన్]] భాషల్లో నాయకుడు అని అర్ధం. షా బిరుదు కన్నా తక్కువ స్థాయి కలిగినదే అయినా ఖాన్ అనేది రాచ మర్యాద కలిగిన బిరుదు. యూసఫ్ మనవడు ఇబ్రహిం ఆదిల్ షా 1 (1534–1558), తో "ఆదిల్ షా" బిరుదు సామాన్య వాడుకలోకి వచ్చింది.
 
బీజాపూర్ సుల్తానుల సరిహద్దులు కాలానుగుణంగా మారుతూ వచ్చాయి. ఈ రాజ్య ఉత్తరపుటెల్లలు ఎప్పుడూ స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుత దక్షిణ [[మహారాష్ట్ర]] నుంచి ఉత్తర [[కర్ణాటక]] వరకూ ఈ రాజ్యం విస్తరించి ఉంది. [[రాయచూరు అంతర్వేది]] ప్రాంతాన్ని గెలవడంతో వారి దక్షిణం వైపు విస్తరణ ప్రారంభమైంది. 1565లో తలికోట యుద్ధంలో గెలుపుతో [[విజయనగర సామ్రాజ్యం|విజయనగర సామ్రాజ్యాన్ని]] గెలుచుకుని ఇంకా దక్షిణానికి జరిగారు. మొహమద్ ఆదిల్ షా (1627–1657), తరువాతి దండయాత్రలతో బీజాపూర్ అధికారపు సరిహద్దు మరింత దక్షిణంలో ఉన్న [[బెంగళూరు]] వరకూ వచ్చాయి. పశ్చిమాన పోర్చుగీస్ పరిపాలనలో ఉన్న [[గోవా]], తూర్పున [[కుతుబ్ షాహీ వంశం]] పాలిస్తున్న [[గోల్కొండ|గోల్కొండ రాజ్యం]] వరకూ బీజాపూర్ రాజ్యం విస్తరించి ఉంది.
 
బహామని ప్రావిన్సు రాజధాని అయిన బీజాపూర్ నే వీరు కూడా చివరి వరకూ రాజధానిగా కొనసాగించారు. ఇబ్రహిం ఆదిల్ షా I (1534–1558), అలీ ఆదిల్ షా I (1558–1579) బీజాపూర్ నగరాన్ని పునర్నిర్మించారు. వీరిద్దరి పరిపాలనా కాలంలో నగరానికి ప్రహారీ, కాంగ్రిగేషన్ మసీదు, రాజభవనాలు, ప్రధాన నీటి సరఫరా మౌలిక సదుపాయాల నిర్మాణాలు చేపట్టారు. వారి వారసులు అయిన ఇబ్రహం ఆదిల్ షా II (1580–1627), ఆదిల్ షా (1627–1657), అలీ ఆదిల్ షా II (1657–1672)లు బీజాపూర్ ను సుందరమైన రాజభవనాలు, మసీదులు, సమాధులు, ఇతర కట్టడాలతో మరింత అలంకరించారు. దక్కన్ సుల్తనేట్, ఇండో-ఇస్లామిక్ నిర్మాణ శైలికి అత్యుత్తమ ఉదాహరణాలలో ఒకటిగా నిలిచింది బీజాపూర్ నగరం.
"https://te.wikipedia.org/wiki/ఆదిల్‌షాహీ_వంశం" నుండి వెలికితీశారు