తెల్కపల్లి రామచంద్రశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది., → (8) using AWB |
||
పంక్తి 1:
[[దస్త్రం:Trcsastry.jpg|right| thumb|తెల్కపల్లి రామచంద్రశాస్త్రి]]
'''తెల్కపల్లి రామచంద్రశాస్త్రి'''
==బాల్యము, విద్యాభ్యాసము==
సామాన్యమైన కుటుంబంలో పుట్టి, గురువుల క్రమశిక్షణలో ప్రకాశించి రాజాస్థానాలు చేరి ఉన్నతమైన విలువను పొందిన వారిలో తెల్కపల్లి రామచంద్రశాస్త్రి గారు ఒకడు. ఇతడు [[మహబూబ్నగర్ జిల్లా]], [[కోడేరు]] మండలం, [[రాజాపురం (కోడేరు)|రాజాపురం]] గ్రామంలో [[డిసెంబర్ 6]]న, [[1902]]లో శేషమాంబ, సుబ్రమణ్యం దంపతులకు జన్మించాడు<ref>[http://namasthetelangaana.com/Editpage/Essays.aspx?category=1&subCategory=7&ContentId=437119 మన కవి కుల తిలకం - - సంబరాజు రవిప్రకాశరావు] </ref>.
==ఉద్యోగ ప్రస్థానం==
తాను చదువుకొన్న [[బందరు]] [[జాతీయ కళాశాల]]లో 1923లో ఒక సంవత్సరం అధ్యాపకుడిగా పనిచేసి ఆనాటి విద్యార్థులైన [[మరుపూరు కోదండరామిరెడ్డి]], వై.బి.రెడ్డి, [[బెజవాడ గోపాలరెడ్డి]], కౌతా ఆనందమోహన్, కౌతా రామమోహన్ వంటి ఉద్ధండుల మెప్పును పొందాడు. [[కర్నూలు]]లో వెల్లాల శంకరశాస్త్రి ఇతని ప్రియశిష్యుడు. బందరు జాతీయ కళాశాలలో
1924లో స్వగ్రామానికి తిరిగివచ్చి [[గద్వాల]] రాణి ఆది లక్ష్మిదేవమ్మ ఆస్థానంలో సంస్కృత విద్వాంసుడిగా నియమించబడ్డాడు.
==బహుముఖ ప్రతిభ==
ఇతడు బహుముఖీన ప్రతిభావంతుడు. కేవలం సంస్కృత రచనలేకాక [[ఆయుర్వేదం]]లో ఇతడు దిట్ట. ఇతని ఆయుర్వేద చిట్కాలు, ప్రసంగాలు [[ఆకాశవాణి]]లో ఎన్నో ప్రసారమైనాయి. ఎంతో మంది రోగులకు స్వయంగా ఆయుర్వేద మందులను తయారు చేసి ఇచ్చి స్వస్థత చేకూర్చాడు. అంతేగాక [[వడ్రంగి]], [[కంసాలి]] వంటి వృత్తులలో కూడా ఇతనికి ప్రవేశం ఉంది. తన ఇంటి తలుపులకు తానే స్వయంగా చెక్కిన వాణీ విలాస నిలయః అన్న అందమైన అక్షరాలు, తన ఇంటిలో స్వయంగా తయారు చేసుకున్న కర్ర స్టాండ్లకు చెక్కిన మామిడి పిందెల అలంకరణ ఇతడి
==సాహిత్య రంగం==
1922- 23 సంవత్సరం నుంచి ఇతని సాహిత్య ప్రస్థానం ప్రారంభమైనది. ఇతని మొదటి రచన 27 ఆర్యావృత్తాలతో కూడిన భారతీ తారామాల అనే శారదాస్తుతి. దీనిని ఇతడు [[బందరు]]లో ఉన్నప్పుడే రచించాడు. మాణిక్యప్రభు పీఠాన్ని దర్శించి ఆశువుగా కవితా కాంతా స్వయంవరము అను ఖండకావ్యాన్ని చెప్పాడు. ఇది 1926లో
[[శృంగేరీ]] పీఠానికి వెళ్లి అక్కడ [[శారదాదేవి]]ని చూడగానే ఇతడూ శారదా నవరత్నమాలికను ఆశువుగా చెప్పడమే కాకుండా లలితాస్తవఝరి అనే పేరుతో మరో 50 శ్లోకాలను చెప్పాడు. [[మైసూరు]]లోని పరకాల మఠాన్ని దర్శించి అక్కడి హయగ్రీవస్వామిపై హయగ్రీవ శతకాన్ని రచించి పండితుల మెప్పును పొందాడు. తర్వాత కాలంలో శారదానవరత్నమాలికను పొడిగించి శారదాస్తుతి శతకాన్ని రచించాడు. ఇవేకాక ఉమామహేశ్వర సుప్రభాతం, శ్రీహనుమత్సుప్రభాతం, మామిళ్లపల్లి లక్ష్మీనరసింహ సుప్రభాతం, గురుపీఠతత్త్వదర్శనం, శివానందాష్టకం, గణేశ పంచరత్నాలు, అయ్యప్పస్తుతి వంటి ముద్రిత రచనలతోపాటు కలిశతకం, రవీంద్రతపఃఫలము, ధూమశకట ప్రమాదం, చ్యవనోపాఖ్యానం, సుకన్యాస్తవం, మృత్యుశకటం వంటి అముద్రిత రచనలను చేశాడు. ఇతని కావ్యలక్ష్మి రచనను [[గోలకొండ]] కవుల సంచికలో చోటుచేసుకుంది.
తెల్కపల్లి రామచంద్రశాస్త్రి సంస్కృత కవితలు, సాహిత్యోపన్యాసాలు [[ఆకాశవాణి]]లో ఎన్నో ప్రసారమైనాయి. కామకోటి, [[ఆంధ్రభూమి]], సనాతన మత ప్రచారిణి, సమాలోచన మొదలైన పత్రికలు వీరి రచనలను ప్రచురించాయి. [[వనపర్తి]]కి చెందిన విక్రాల నరసింహాచార్యులతో కలిసి ఇతడు జంట కవిత్వం చెప్పాడు. [[ఆమనగల్లు]] మండలం సింగంపల్లెలో
==సన్మానాలు==
ఇతడు [[వనపర్తి]], [[ఆత్మకూరు]], [[కొల్లాపూర్|కొల్లాపురం]] సంస్థానాలలో చాలాసార్లు సన్మానింపబడ్డాడు. కంచికామకోటి, [[శృంగేరి]], [[పరకాల]], [[పుష్పగిరి]], మాణిక్యప్రభు పీఠాలలోని అధిపతులను తన పాండిత్యం, కవిత్వంతో మెప్పించి సత్కారాలు అందుకున్నాడు.
==బిరుదులు==
పంక్తి 27:
* సాహిత్య కల్పద్రుమ
==మరణం==
సంస్కృత భాషాసేవ తన జీవితమంతా చేసిన మహాపండితుడు తెల్కపల్లె రామచంద్రశాస్త్రి [[1990]],
==మూలాలు==
{{మూలాలజాబితా}}
|