పాణిని: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) చి →మరణం |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) |
||
పంక్తి 8:
పాణిని సూత్రాలకు ఎందరో మహా పండితులు వార్తికాలు రాశారు. అందులో పతంజలి పేర్కొన్న వారు [[కాత్యాయనుడు]], భారద్వాజుడు, సునాగుడు, క్రోస్ట, బాడవుడు అనే అయిదుగురు ముఖ్యులు. వృత్తి అంటే వ్యాకరణ శాస్త్ర ప్రవృత్తి అని అర్ధం. వార్తికం అంటే వృత్తికి వ్యాఖ్యానం. వార్తిక కారుడికే వాక్య కారుడు అనీ పేరుంది. ఇందులో కాత్యాయనుని వార్తికం ప్రసిద్ధి పొందింది. కాత్యాయనుడికే వరరుచి, మేధాజిత్, పునర్వసు, కాత్యుడు అనే పేర్లున్నాయి. పాణిని ముఖ్య శిష్యుడే కాత్యాయనుడు. దక్షిణ దేశం వాడు. ఈ విషయాన్ని ఒక సూత్రంలో [[పతంజలి]] ప్రకటించాడు. పాణినీయం పై పతంజలి రాసిన భాష్యాన్ని ''మహా భాష్యం'' అంటారు. దీనికే ''పద'' అనే పేరు కూడా ఉంది. [[సూత్రం]]<nowiki/>లో వార్తికంలో అభిప్రాయ భేదం వస్తే ''పాతంజలీయం'' మాత్రమే ప్రమాణం. మహా భాష్యం పై ఎన్నో వ్యాఖ్యలు వచ్చాయి. అందులో [[భర్తృహరి]] రాసినది ప్రాచీనమైనది.
అష్టాధ్యాయి పై అనేక వృత్తులు వచ్చాయి. పాణిని మేన మామ ''వ్యాడి'' అనే ఆయన వ్యాడి సంగ్రహం అనే పేర వృత్తి రాశాడు. [[విక్రమార్కుడు|విక్రమార్కు]]<nowiki/>ని ఆస్థానంలో ఉన్న వరరుచి ఇంకో వృత్తి రాశాడు. జయాదిత్యుడు, [[వామనుడు]] కలిసి రాసిన వృత్తికి ''కాశికా వ్రుత్తి'' అని పేరు. ఇదీ గొప్ప పేరు పొందినదే. వీరిద్దరూ [[కాశీ]]<nowiki/>లో ఉండి రాయటం చేత ఆ పేరొచ్చింది. అతి ప్రధాన వృత్తిగా కాశికా
పాణిని తర్వాత చాలా మంది వ్యాకరణాలు రాశారు. అందులో కాతంత్ర కారుడు, చంద్ర గోమి, క్షపణకుడు, దేవా నంది, వామనుడు, అకలంక భట్టు, పాల్య కీర్తి, శివ స్వామి భోజ రాజు, బోపదేవుడు మొదలైన వారెందరో ఉన్నారు. ఇందరు రాసినా పాణినీయానికి ఉన్న ప్రాచుర్యం దేనికీ రాలేదు. పాణిని అష్టాధ్యాయి 19వ శతాబ్దంలో యూరోప్ భాషా శాస్త్రవేత్తలను విశేషంగా ప్రభావితం చేసింది. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ భాషల వ్యాకరణ అభివృధ్ధిలో పాణిని భాషా నిర్మాణ సూత్రాలు ఉపయోగించబడ్డాయి.
|