చంద్రయ్య (చంద్రమోహన్), రాజా (నాగార్జున) అన్నదమ్ములు. చంద్రయ్య ఆ వూరి ప్రెసిడెంటు అయిన దేవుడు (కైకాల సత్యనారాయణ) దగ్గర పని చేస్తుంటాడుపనిచేస్తుంటాడు. చంద్రయ్యకు దేవుడంటే నిజంగా దేవుడితో సమానం. కానీ రాజాకు మాత్రం ఆయనంటే పడదు. ఇదే విషయమై అన్నదమ్ములిద్దరూ అప్పుడప్పుడూ గొడవ పడుతూ ఉంటారు. దేవుడి కూతురు స్వప్న (మీనా) పట్నంలో చదువుకుంటూ ఉంటుంది. తన అహంకారంతో రాజాతో గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. ఒకసారి ఎడ్లబండి ఎక్కి రాజా జొన్న చేను నాశనం చేస్తుంది. రాజా ఆమెను అవమానించి ఆమె తండ్రి చేత నష్ట పరిహారం పొందుతాడు. ఆ అవమానంతో తన అన్న నరేంద్ర (శ్రీకాంత్) చేత రాజాను కొట్టించాలని చూస్తుంది. కానీ అతను వెళ్ళి రాజా చేతిలో దెబ్బలు తిని వస్తాడు. దేవుడు తెలివిగా చంద్రయ్య ద్వారా రాజా సాగు చేస్తున్న పొలాన్ని కొనేస్తాడు. స్వప్న వెళ్ళి రాజాను అవమానించి వస్తుంది. రాజా చాలా మంచి మనిషనీ అతన్ని అవమానించినందుకు క్షమాపణ చెప్పమని ఆమె తల్లి కోరుతుంది. స్వప్న రాజాను ప్రేమిస్తున్నట్లు నటించి అతను తనని పాడుచేయడానికి ప్రయత్నించాడని అతనికి పంచాయితీలో కొరడా దెబ్బల శిక్ష విధిస్తుంది. రాజా మనసు తీవ్రంగా గాయపడుతుంది.