గోపీనాథ్ మొహంతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
 
==సాహిత్య జీవితం==
ఇతడు 1936 నుండే వ్రాయడం ప్రారంభించాడు. 1930-38 మధ్యకాలాన్ని రచయితగా ఇతని నిర్మాణకాలంగా పరిగణించవచ్చు. ఇతనిపై ఆ కాలంలో మార్క్స్, రష్యావిప్లవం, ఫ్రాయిడ్ ప్రభావం, గాంధీజీ జాతీయోద్యమ ప్రభావం పడుతూ వచ్చింది. ఇతడు గొప్ప అధ్యయనశీలి. రోమరోలా, గోర్కీ రచనలు చదివి వారికి అభిమానిగా మారాడు. వివిధ సాహిత్య ప్రక్రియల స్వరూపాలలో కొత్తకొత్త ప్రయోగాలు చేస్తూ ప్రచారంలో ఉన్న రొమాంటిక్ అభిరుచులను బాహాటంగా ఖండించేవాడు. ఇతడు చాలా సాహిత్యప్రక్రియలలో రచనలు చేసినా కథాసాహిత్యమే ప్రముఖ రంగంగా నిలిచింది. ఇతని సాహిత్యాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు. అవి 1. ఆదివాసులకు సంబంధించిన రచనలు, 2. నగరవాసులకు సంబంధించిన రచనలు, 3. 'మాటీ మటాల్ ' నవల. ఇతడు తన రచనలలో నిరుపేదల, అణగారిన వర్గాల, నిరపాయులైన ఆదివాసుల పక్షాన ఎప్పుడూ నిలిచాడు. శోషణ ఏ రూపంలో ఉన్నా దానిని సహించేవాడు కాదు.
==రచనలు==
ఇతడు మొత్తం 19 నవలలు, 8 కథా సంపుటాలు, 2 నాటకాలు, 1 వ్యాస సంకలనం, 2 జీవిత చరిత్రలు, 8 ఆదివాసుల భాషలకు సంబంధించిన పుస్తకాలు, 4 హిందీ, బెంగాలీ, ఇంగ్లీషు నుండి అనువదించిన పుస్తకాలు వెలువరించాడు. ఇతనికి ముఖ్యంగా మూడు రచనల వల్ల గొప్ప ఖ్యాతి లభించింది. అవి 'పరజా', 'అమృత సంతాన్', 'మాటీ మటాల్'.
 
;పరజా
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గోపీనాథ్_మొహంతి" నుండి వెలికితీశారు