వాల్మీకి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జరిగినది. → జరిగింది., బాష → భాష, → (4), ( → ( using AWB
పంక్తి 2:
 
== జీవిత విశేషాలు ==
మహర్షి వాల్మీకి ఎవరు? వల్మీకము ([[పుట్ట]]) నుండి వెలుపలికి వచ్చిన వారు కావున వాల్మీకి. మరామరా అని తపస్సుచేసిన వారు  కావున మహర్షి, రాముడి జీవితచరిత్రను [[రామాయణము]]<nowiki/>గా మహాకావ్యరచన గావించి నవాడిగా [[ఆదికవి]] అయ్యాడు.
 
అయితే వాల్మీకి జన్మము ఎట్టిది? ఆయన తల్లితండ్రులు ఎవరు? అనే విషయము పై అనేక తర్జనభర్జనలు, కట్టుకథలు ప్రాచుర్యములో ఉన్నాయి. ఏ రచయత అయినా తన గురించి ఉపోధ్గాతము మరియు పరిచయము తదితర అంశములను తెలుపుకోవటము ఈనాటి రచయతలు పాటిస్తున్న విధానము. [[వేదవ్యాసుడు]] తాను [[మత్స్యగంధి]], [[పరాశరుడు|పరాశరు]]<nowiki/>ల కుమారుడనని తన రచనలలోనే చెప్పుకోవడముతో వ్యాసుడు ఎవరన్నది కచ్చితముగా తెలిసింది. అదేవిధముగా రచయతగా తాను ఎవరన్నది ప్రత్యేకముగా వాల్మీకి వ్రాయనప్పటికీ సందర్భానుసారముగా [[సీత]]<nowiki/>ను రాముడికి అప్పచెబుతున్న సమయములో ఉత్తరకాండ (రామాయణము)లో వాల్మీకి ఇలా రాసాడు “రామా నేను ప్రాచేతసుడను ప్రచేతసుడి ఏడవ (దశమ) కుమారుడిని. వేలసంవత్సరాలు తపస్సు చేసి, ఏ పాపము చేయని, అబద్దమాడని మహర్షిని. [[సీత]] నిన్ను తప్ప మనసా, వాచా పరపురుషుడిని ఎరగని మహాపతివ్రత. నా మాట నమ్ము, సీతను ఏలుకో. నా మాటలు తప్పు, అబద్దము అయితే ఇంతకాలము నేను చేసిన తపస్సు భగ్నము అవుగాక.” అంటాడు. (వాల్మీకి రామా యణము-తెలుగు అనువాదము,క్రీ.శే.పురిపండా అప్పలస్వామి)
 
[[ఫైలు:Valmiki ramayan.jpg|thumb|right|వాల్మీకి మహర్షి [[రామాయణం]] రచన చేస్తున్న దృశ్యం]]
[[File:Replica of sage Valmiki at Dwaraka Tirumala, Andhra Pradesh.jpg|thumb|వాల్మీకి మహర్షి]]
 
[[వాల్మీకి]]<nowiki/>గా పిలవబడుతున్న మహర్షి పేరు ప్రాచేతసుడని ఇక్కడ మనము గుర్తించవచ్చును.ఇది వాల్మీకి తనకు తాను తన గురించి చెప్పుకున్న విషయము. ఆయన మాటలలో ఆర్ధత, నిజాయతీ ఉట్టిపడుతున్నాయి. అయితే ప్రచేతసుడు ఎవరు? ప్రచేతసుడు ఎవరి కుమారుడు? ఆయనది ఏ వంశము? ఈ విషయ ములను తెలుసుకోవటానికి అనేక [[పురాణములు|పురాణముల]]<nowiki/>ను, చరిత్రలను చదవవలసి ఉంటుంది. ప్రచేతసుల గురించిన ప్రస్తావన “శ్రీ మత్భాగవతము”లో ఉంది. శ్రీ మత్భాగవతము వేదవ్యాసవిరచితము. వ్యాసుడు రచించిన [[పురాణములు|అష్టాదశ పురాణము]]<nowiki/>లలో శ్రీ మత్భాగవతము ఒక గొప్ప పురాణము.[[భారతదేశము]]<nowiki/>లోని మహాపురుషుల చరిత్రలు పురాణములుగా వ్రాయబడి ఉన్నాయి. భారతదేశము పై మొదటగా [[మహమ్మదీయులు]] దాడి చేయటముతో భారత చరిత్రను వ్రాసిన వారు స్థిరత్వము, ప్రోత్సాహము లేని పరిస్థితులలో చరిత్రలను వ్రాసే స్థితిలో ఉండకపోవడం జరిగినదిజరిగింది. ఆంగ్లేయుల పాలన మొదలైన తరువాత ప్రశాంత వాతావరణము ఏర్పడింది. (శ్రే వేమన పద్యసారామృతము-సి.పి.బ్రౌన్)  చరిత్ర అనగా హిస్=అతనియొక్క, స్టోరీ=కథ అని ఆంగ్లేయులు వచ్చిన తరువాతే చరిత్ర అనే పదము వాడు కలోకి వచ్చి చరిత్రలను వ్రాయటము మొదలు పెట్టారు. అంతకు ముందు భారతదేశ చరిత్రలను పురాణముల పేరుతో తెలుసుకునే వారు.[[భారత దేశము|భారతదేశము]]<nowiki/>లో పురాణములను అనగా జరిగిపోయిన వాస్తవాలను (చరిత్రలను) కాలక్షేపానికో, పుణ్యానికో చదవటము, వినటము అలవాటుగా వస్తోంది. పురాణములంటే భారతీయులకు అత్యంత విశ్వాసము. పురాణములలోని వ్యక్తుల జీవితకథలను, అందులోని నీతి, నిజాయతీలను, సంఘటనలను నిజమనే నమ్ముతారు. వారిని ఆదర్శముగా తీసుకొంటారు. పురాణాలలోని ఆచార వ్యవహారాలను, [[వ్రతము]]లను, పూజాదికార్యక్రమములను, [[జన్మ]]నుండి [[మరణము]] వరకు సాగే [[బారసాల]], [[అన్నప్రాశన]], అక్షరాభ్యాసము నుండి పుంసవనము, [[శ్రీమంతము]], [[వివాహము]]  తరువాత [[అప్పగింతలు]], [[మరణము]] తరువాత  పార్థీవశరీరానికి చేసే క్రతువులు అన్నీపురాణాలలో వివరించిన విధముగానే పాటిస్తారు. [[పురాణములు|పురాణ]] రచయతలను భగవత్‌సమానులుగా కొలుస్తారు. భగవంతుడే వాల్మీకిమహర్షిగాను (బ్రహ్మ), వేదవ్యాసుడు (శ్రీ మహావిష్ణువు) గాను జన్మించి పురాణములను రచించినారని, అవి విశ్వమానవ సౌభ్రాతత్వమును చాటుతాయని నమ్ముతారు. శ్రీ మధ్భాభాగవతము, శ్రీ [[విష్ణు పురాణం|విష్ణు]] పురాణము అన్నవి భగవాన్ విష్ణువు,ఆయన భక్తుల కథలు. ఎవరైతే శ్రీ మహా విష్ణువును నమ్మి కొలుచుకున్నారో, ఆయన వారిని కష్టాలబారి నుండి ఎలా రక్షించాడో తెలిపే కథలు ఈ పురాణాలలో తె లుపబడ్డాయి. శ్రీ మథ్భాగవతము ద్వాదశస్కంధములుగా వ్రాయబడింది. శ్రీ మథ్భాగవతము చతుర్థ స్కంధ  ములో త్రయోదశోధ్యాయములో విదుర ఉవాచ:
 
కే తే ప్రచేతసోనామ కస్యాపత్యాని సువ్ర
పంక్తి 40:
“వాల్మీకాగ్రాత్ ప్రభవతి ధను: ఖండమా ఖండాలస్య”   అర్థము:సుదూరములో కనిపిస్తున్న ఆ పుట్టను చూడండి! అందులో నుండిఇంధ్రధనస్సు ప్రభవించింది. దీనికి భాష్యము చెబుతూ ఇలపావులూరి పాండు రంగారావు అంటారు-ఇంధ్రధనస్సు అనే ఉపమానము వాల్మీకి కవితాత్మకు, ప్రబంధౌచిత్యానికి ప్రతీక.వాల్మీకి రామాయణములోని 7 కాండలు ఇంధ్రధనస్సులోని సప్తవర్ణాలను గుర్తుకు తెస్తాయి.` కిరాతులు క్షత్రియులే, వీరిలో ఉపనయనాది కర్మలు లోపించాయి అంటాడు మనువు (మనుస్మృతి).        
 
కిరాతుడు [[[ఋషి]]గా పరివర్తన చెండాడని చెప్పడము నిజము కావచ్చు. అంతేగాని ఆయన గురించి మరొక్క మాట దురాలోచనే. [[తపస్సు]] ఆయన ప్రధానసద్గుణము, నిరంతరాధ్యయనము, సత్ప్రవర్తనల ఫలితమే మహాఋషిగా ఆవిర్భవింపచేశాయి. వాల్మీకి పేరు కలిగిన వారు నలుగురైదుగురు ఉన్నారని కొందరు విజ్ఞుల (వ్యాసుడు అనిపేరు కలిగిన వారు కూడా 10 మంది ఉన్నారని) అభిప్రాయము. వారిలో రత్నాకరుడు, అగ్నిశర్మ కూడా ఉండి ఉండవచ్చును.  వీరు మహర్షి, ఆదికవి వాల్మీకి ఉత్ద్బోధనలకు ప్రేరితులై తమ పేర్లను వాల్మీకిగా మార్చుకొని ప్రాచుర్య ము లోనికి వచ్చి ఉంటారు. ఆకతాయి రచయతలు ఎవరో వారిని మహర్షిని ఒక్కరే అని పొరబడి ఉండవచ్చును.ఈ విషయము నిజమే అని నమ్మటానికి పంజాబ్ మరియు హరియానా విశ్వవిద్యాలయము వారు ఆచార్య, డాక్టరు సహదేవ ఆధ్వర్యములో 3 సంవత్సరముల పాటు నిర్వహించిన పరిశోధనలు సహకరిస్తున్నాయి (మహర్షి వాల్మీకి వాస్ నెవర్ ఏ డేకోయిట్ నార్ ఏ రోడ్ సైడ్ రాబర్-జస్టిస్ భల్లా, ద [[టైమ్స్ ఆఫ్ ఇండియా]],ఇంగ్లీష్ డైలీ, 2010 మే 22)[[పంజాబ్]] మరియు హరియానా హైకోర్ట్ ఆదేశాల మేరకు పంజాబ్ మరియు హరియానా,విశ్వవిధ్యాలయము వారు పరిశోధనలు గావించారు.డాక్టరు సహదేవ,చైర్ పర్సన్ గా, వాల్మీకి చైర్ అనే విభాగమును,ఏర్పాటు చేసి ఈ పరిశోధనలు,అధ్యాపకులచే నిర్వహింప బడ్డాయి). క్రీ.పూ.నుండి  అందుబాటులో ఉన్న వేదములు, శిలాశాసనాలు, ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములు, చరిత్రలు క్షుణ్ణముగా పరిశీలించగా మహర్షివాల్మీకిని ఎక్కడా, ఎప్పుడూ దొంగగా,దారిదోపిడీదారుడిగా వ్రాయబడి లేదు. ఈ పరిశోధన ఫలితాల ఆధారముగా జడ్జిమెంట్‌ను జస్టిస్ భల్లా ఇచ్చారు. ఈ జడ్జిమెంట్ ప్రకారము వాల్మీకి మహర్షిని ఎవ్వరూ దొంగ, దారి దోపిడీదారుడు అనకూడదు. ఆవిధముగా మాట్లాడకూడదు, నాటికలు,టి.వి.సీరియల్స్, సినిమాలు తీయరాదు, వాల్మీకి మహర్షిని దొంగ, దారిదోపిడీదారుడు అని బోయలను, వాల్మీకులను కించపరిచే విధముగా మాట్లాడితే నేరము, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చును. మహర్షి వాల్మీకి గురించి కొన్ని పురాణములలో ( ఆధ్యాత్మికరామాయణము, స్కాంధపురాణము,తదితర) వ్రాయ బడినట్లుగా చెబుతున్న వాటికి  వాస్తవాలకు పొంతన లేదని అవి మూలపురాణములో లేవని ఆ తరువాత చేర్చబడిన అవిశ్వాస కథలని ఇతిహాసికులు, చరిత్ర పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
 
వాల్మీకిమహర్షిని ఆదికవి, ఋక్షకుడు, భార్గవుడు, కవికోకిల, వాక్యావిశారదుడు, మహాజ్ఞాని, [[భగవాన్]] అని కూడా పిలుస్తారు. వాల్మీకిమహర్షి “ఓం  ఐ౦ హ్రీం క్లీ౦ శ్రీ౦” అనే బీజాక్షరాలు సరస్వతీ, లక్ష్మి,మాయ కటాక్షాన్ని కలుగచేసే మంత్రాలను లోకానికి పరిచయము చేశారు. (దేవిభాగవతము, వేదవ్యాసవిరచితము, తెలుగు అనువాదము)    
పంక్తి 50:
వాల్మీకి మహర్షి వద్ద శిష్యరికము గావించిన భరద్వాజుడు, లవుడు, కుశుడు మహర్షిని భగవాన్ అని సంబోధించేవారు. బ్రహ్మ సమానుడని, బ్రహ్మ రామాయణమును వ్రాయటానికి తానే వాల్మీకి మహర్షిగా అవుతరించాడని నమ్మేవారున్నారు. ”విప్రో వాల్మీకిస్సు మహాశయా”అని బ్రహ్మ సరస్వతి దేవితో చెప్పాడని, అందువలన వాల్మీకిమహర్షి విప్రుడు అని పురాణ వ్యాఖ్యాతలు చెబుతున్నారు. స్వగుణధర్మముతో బోయవాడిగా   పుట్టినవాడు ఆదికవిగా, మహర్షిగా, బ్రాహ్మణుడిగా  గుర్తించ బడ్డారని ఆయన గణకీర్తిని కొనియాడారు.
 
ఆదికవి వాల్మీకి ఆ రోజులలోనే “అక్షరలక్ష” అనే  ఈనాటి “ఎన్ సైక్లోపెడియా బ్రిటానికా” వంటి విజ్ఞాన  సర్వస్వము, సర్వశాస్త్రసంగ్రహమును వెలువరించారు. (పెదబాలశిక్ష- గాజుల సత్యనారాయణ) ఈపుస్తకములో  భూగర్భశాస్త్రము, రసాయనశాస్త్రము, గణితశాస్త్రము, రేఖాగణితము, బీజ గణిత ము,త్రికోణమితి, 325 రకాల గణిత ప్రక్రియలు, [[గాలి]], [[ఉష్ణము]], [[విద్యుత్ శక్తి|విద్యుత్]], జలయంత్ర శాస్త్రము,ఖనిజాలు తదితర అనేక అంశాలు వివరించబడి ఉన్నాయి. యోగవాశిష్టము అనే యోగా, ధ్యానముల గురించిన సంపూర్ణ విషయములు గల మరో పుస్తకము మహర్షి వాల్మీకి వ్రాశారు.ఈ పుస్తకము రామాయణములోని అంతర్భాగమే.రాముడు పది-పన్నెండు సంవత్సరాల వయసులో మానసిక అశాంతికి లోనై, మానసిక ధౌర్భల్యమునకు గురి అయిన ప్పుడు  వశిస్టుడి ద్వారాయోగా, ధ్యానములను శ్రీరాముడికి బోధించారు వ్రాసింది.  వాల్మీకిమహర్షి, పలికింది, బోధించింది వశిస్టుడు,అందు వలన “యోగవాశిష్టము” అనే పేరు వచ్చింది. ఆదిత్య హృదయము అనెడి సూర్యస్తుతిని వ్రాసినవారు వాల్మీకి మహర్షియే.కౌసల్యా సుప్రజా రామ అనెడి సుప్రభాతమును వ్రాసిన వారు  వాల్మీకియే. మహర్షివాల్మీకి  “వాల్మీకి మతము” అనే దానిని నెలకొల్పారు. తొమ్మిది లక్షణాలతో జీవితమును సంస్కరించుకోవాలని, ఈ తొమ్మిది గుణములు కలిగిన వారిని, పాటిస్తున్నవారిని  వాల్మీకి మత స్తులుగా గుర్తించారు. ఆటవికజీవితములో వ్యవసాయముతెలియదు.  అడవులలో దొరికిన [[ఆకులు]],  అల ములు, దుంపలుకాయలు, [[పండ్లు]], సాధుజీవుల (కుందేలు, కోడి, పంది, గొర్రె,   మేకలువంటివి)ను పట్టి, అవి పట్టుబడక పోతే వాటితో పోరాడి స్వంతము చేసుకోవటమే అలవాటు. తమ  వద్ద లేని ఇతరుల వద్ద ఉన్న వాటిని లాగుకోవటము, ఇవ్వకపోతే వారితో పొరాడి, చంపి అయినా సరే తమ స్వంతము చేసుకోవటము ఆటవికతనము, ఈ పోరాటము జరిపే, ధైర్యసాహసాలు గల వారినే “క్షత్రియులు” అని అంటారని భీష్ముడు [[మహాభారతము]]లో క్షత్రియత్వము గురించి  వివరణ ఇచ్చాడు.ఈ ఆటవికతనమును పారద్రోలి సంస్క రించటానికే వాల్మీకి తొమ్మిది లక్షణాలతో జీవనమును సాగించాలని బోధించారు.ఆటవికులలో సంస్కారము ను కలుగ చేయటానికే వాల్మీకిమతము ప్రారంభించబడింది. క్రీ.పూ.600 సంవత్సరములోనే ఆటవికులు సంస్కరించబడటము మొదలైంది అని చెప్పటానికి వాల్మీకి వ్రాసిన మొదటి శ్లోకమే గొప్ప ఉదాహరణ.ఆటవిక బాషభాష సంస్కృతముగా రూపొందింది వాల్మీకి వలననే. ”మా నిషాద” అనే పదముతో మొదలైన శ్లోకములోని మొదటి వ్యక్తి నిషాదుడే,అతనూ బోయవాడే.అజ్ఞానముతో బోయవాడు చేసిన ఆడ పక్షిని చంపటము అనే ప్రక్రియ వాల్మీకిమహర్షిలో బోయలను, ఆటవికులను సంస్కరించాలనే ఆలోచనను కలిగింప చేసి ఒక ఆదర్శ మానవుడిని  నాయకుడిగా చూపించాలని “రామాయణము” వ్రాసేలా చేశాయి.
 
 
"https://te.wikipedia.org/wiki/వాల్మీకి" నుండి వెలికితీశారు