[[సింధూ నది]]కి ఉపనది అయిన '''జీలంఝేలం నది''' (Jhelum River) పంజాబ్లో ప్రవహించే నదులలో పెద్దది. 774 కిలోమీటర్ల దూరం ప్రవహించే జీలంఝేలం నది [[వేదకాలం]]లో వితస్థగా పిలువబడింది. కాశ్మీర్ లోయలోని పిర్పంజల్ దిగువ భాగాన వెరినాగ్ ప్రాంతంలో జన్మించిన జీలంఝేలం నది [[శ్రీనగర్]] మరియు [[ఊలర్ సరస్సు]] గుండా ప్రవహించి [[పాకిస్తాన్]] లో ప్రవేశిస్తుంది. ఈ నది యొక్క పెద్ద ఉపనది అయిన నీలం నది [[ముజఫరాబాదు]] వద్ద, తరువాతి పెద్ద ఉపనది అయిన కున్హర్ నది కాఘన్ లోయలో జీలంఝేలం నదిలో కలుస్తున్నాయి. జీలంఝేలం జిల్లాలో ఈ నది [[పంజాబ్]] రాష్ట్రంలో కలుస్తుంది. తరువాత ఇది పాకిస్తాన్ పంజాబ్లోని తీరమైదానంలో ప్రవేశిస్తుంది. చివరికి ట్రిమ్ము వద్ద [[చీనాబ్ నది]]లో సంగమిస్తుంది.