కలంకారీ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి వర్గం:భారతీయ చిత్రకళ శైలులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) |
||
పంక్తి 8:
కోరమాండల్ తీరం వెంబడి ఉన్న ముఖ్యమైన [[మచిలీపట్నం]] ఓడరేవు ద్వారా ఈ కళంకారీ ఉత్పత్తులు ప్రపంచం నలుమూలలకూ వ్యాపించి ఉండవచ్చు. మచిలీపట్నం ఓడరేవుకు సౌకర్యాలు సరిగా లేకపోయినా [[గోల్కొండ]] ప్రభువులతో సంబంధాలు ఉండటంవలన అది ముఖ్యమైన ఓడరేవుగా విలసిల్లింది. గోల్కొండ ప్రభువులైన కుతుబ్ షాలు కళంకారీ ఉత్పత్తులను ఎక్కువగా కోరే పర్షియన్ వర్తకులతో వ్యాపార సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. [[ఈజిప్టు]]లో [[కైరో]] వద్దగల ఫోస్టాట్ అనే ప్రదేశం వద్ద పురాతత్వ శాఖ తవ్వకాలు జరిపే వరకూ భారతదేశంలో వస్త్రాలపై కళాఖండాలను చిత్రించే సంస్కృతి పెద్దగా ఎవరికీ తెలియదు. ఈ తవ్వకాల్లో వివిధ చిత్రాలతో కూడిన్ భారతదేశ నూలు వస్త్రాలు కనిపించాయి. ఈ వస్త్రాలను 18వ శతాబ్దంలో పశ్చిమ తీరం ద్వారా ఆ దేశాలను ఎగుమతి అయిఉండవచ్చునని చరిత్రకారులు భావిస్తున్నారు.
కలంకారీ ఉత్పత్తులు మార్కెట్ అవసరాలను బట్టి వివిధ రూపాలలో తయారవుతుంటాయి. ప్రార్థనా వస్త్రాలు, దుప్పట్లు, దిండు గలీబులు, ప్రవేశ
సుగంధ ద్రవ్యాల వ్యాపారస్థులు [[వస్తుమార్పిడి పద్దతి]] ప్రకారం తమ వ్యాపారం కోసం భారతీయ వస్త్రాలను ముఖ్యంగా కళంకారీ వస్త్రాలను వాడేవారు. ముఖ్యంగా ఈ కళంకారిలో చెప్పుకోవలసింది ఏమిటి అంటే ఈ విధానంలో వాడే [[రంగులు]] అన్నీ సహజసిద్ధమైన రంగులే (కూరగాయల నుంచి సేకరించినవి). ఇవి శరీరానికి ఏ విధమైన హానీ చేయవు. నిజాంల కాలంలో విదేశస్థులు కలంకారీ చేసిన గుడ్డకు సరితూగే బంగారాన్ని ఇచ్చి కొనుక్కొని మచిలీపట్నం (బందరు) ఓడరేవు ద్వారా తమ దేశాలకు తీసుకొని వెళ్ళేవారు.
|