జంధ్యాల పాపయ్య శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
Added few sections; translated from data available in the English version of this page.
పంక్తి 1:
'''[[జంధ్యాల పాపయ్య శాస్త్రి]]''' ([[ఆగస్టు 4]], [[1912]] - [[జూన్ 21]], [[1992]]) 20వ శతాబ్దములో బాగా జనాదరణ పొందిన [[తెలుగు]] కవులలో ఒకరు. వీరి [[కవిత్వము]] సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని [[తెలుగు]] నుడికారముతో విన సొంపై యుండును. ఖండకావ్యములు వీరి ప్రత్యేకత. అందునా కరుణ రస ప్రధానముగా చాలా కవితలు వ్రాసి, "[[కరుణశ్రీ]]" అని ప్రసిద్దులైనారు.
 
కరుణశ్రీ గారి అత్యంత ప్రముఖ కావ్యాలు "పుష్పవిలాపము" మరియు "కుంతి కుమారి" అని అనవచ్చును. ఈయన కవితాత్రయము అయిన 'ఉదయశ్రీ', 'విజయశ్రీ', మరియు 'కరుణశ్రీ' అత్యధిక ముద్రణలు కలిగి, ఎనలేని ఖ్యాతి గాంచినవి. పై మూడింటిని తన సున్నిత హృదయము, తర్కమునకుప్రతీక అయిన తన మెదడు, మరియు తన విలువైన జీవితమని అభివర్ణిస్తారు. ఈ మూడు రచనలు, కరుణశ్రీ గారి ప్రకారము సత్యం, శివం, మరియు సుందరం యొక్క రూపాంతరాలుగా పరిగణిస్తారు.
 
ఈయన కవిత్వము పాఠకులని ఆత్మజ్ఞాన శిఖరాంచులనే కాక సమాజాంతరళాలలోని దుఃఖాన్ని, వాటికి కారణాలని, పరిష్కార మార్గాలని కూడా చూపుతాయి. మనుషులలో ఉత్తమ మార్పుకై, సమాజములో శాంతికై, నైతిక విలువ అను సంపద్వృద్ధికై తన కవిత్వాన్ని వినియోగించారు. ఆందునే ఈనాటికి వారి పద్యాలు జనుల నోటిలో నానుతూనే ఉన్నాయి.
 
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = జంధ్యాల పాపయ్య శాస్త్రి
Line 133 ⟶ 139:
</poem>
మూలం: website - > Dr.Seshagirirao
 
== పురస్కారాలు, గౌరవాలు ==
తెలుగు అకాడెమి పురస్కారము - 29 ఏప్రిలు, 1985 (మద్రాసు)
 
రసమయి పురస్కారము - 27 జూన్ 1987 (హైదరాబాదు)
 
ఆభినందన పురస్కారము - 21 సెప్టెంబరు 1987 (హైదరాబాదు)
 
శుభాంగి పురస్కారము - 27 జనవరి 1989 (హైదరాబాదు)
 
ఆభిరుచి పురస్కారము - 9 ఏప్రిలు 1989 (ఒంగోలు)
 
నలం కృష్ణరాయ పురస్కారము - 17 ఏప్రిలు 1989 (బాపట్ల)
 
సింధూజ పురస్కారము - 8 నవంబరు 1989 (సికిందరాబాదు)
 
డా|| పైడి లక్ష్మయ్య పురస్కారము - 24 జూన్ 1989 (హైదరాబాదు)
 
మహామంత్రి మాదన్న పురస్కారము - 16 మార్చి 1990 (హైదరాబాదు)
 
యార్లగడ్డ రంగనాయకులు పురస్కారము - 26 అక్టోబరు 1990 (మద్రాసు)
 
డా|| బూర్గుల రమకృష్ణారావు పురస్కారము - 13 మార్చి 1991 (హైదరాబాదు)
 
== ఇతర విషయాలు ==
- "సుభాషిణి" అను మాసపత్రికకు 1951-1953 కాలములో సంపాదకునిగా పని చేసారు.
 
- జాతీయ రచయితల గోష్ఠి (క్రొత్త ఢిల్లె, 24 జనవరి 1961) లో పాల్గొన్నారు
 
- పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా గారి "దైవ సన్మానము", 25 సెప్టెంబరు 1972న పుట్టపర్తిలో.
 
- ప్రత్యేక సభ్యత్వము, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి, 29 జనవరి 1977న హైదరాబాదులో.
 
- బంగారుపుష్ప సన్మానము మరియు పుత్తడి కంకణధారణా సన్మానము, 27 జూన్ 1982న విజయవాడలో.
 
- ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి పురస్కారము, 30 జనవరి 1983న.
 
- "మెన్ ఆఫ్ లెట్టెర్స్" సభ్యత్వం, 1 ఏప్రిల్ 1984న.
 
- గౌరవ రాష్ట్రపతి శ్రీ జ్ఞాని జైల్ సింఘ్ చేతులమీదుగా సన్మానము, 25 ఏప్రిల్ 1987న.
 
- "ఊదయశ్రీ" స్వర్ణోత్సవం, మరియు "విజయశ్రీ", "కరుణశ్రీ"ల రజతోత్సవము, గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నం. తా. రామారావుగారి చేతులమీదుగా, 27 జూన్, 1987న.
 
- "తెలుగు బాల" అను పుస్తకము 1,25,000కు పైగా ప్రతులు, 50,000కు పైగా ఉదయశ్రీ, 25,000కు పైగా విజయశ్రీ మరియు కరుణశ్రీ ప్రతులు అమ్ముడయినాయి.
 
- "ఫుష్పవిలాపము", "కుంతికుమారి", మరియు "ఆనంద లహరి" కావ్యములు ఆంగ్లములోనికి డా|| అమరేంద్ర గారు, హిందీ లోనికి డా|| సూర్యనారాయభాను గారు అనువదించారు.
 
- గానగంధర్వులు ఘంటసాల వేంకటేశ్వరరావు గారు "అద్వైత మూర్తి", "సంధ్యశ్రీ", "పుష్పవిలాపము", కుంతికుమారి", "అంజలి", "కరుణామయి", మరియు "ప్రభాతి" కావ్యములను గానము చేసారు.
 
- "భువన విజయము" నాటకములో ముక్కు తిమ్మనగాను, "భారతావతరణము" నాటకములోలో నన్నయ్యగాను, "ఇందిరమందిరము" నాటకములో చేమకూర వేంకట కవి గాను, మరియు "బ్రహ్మసభ" నాటకములో పోతన గాను పాత్రధారణ చేసినారు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}