బ్రిటిష్ సామ్రాజ్యము భారతదేశమునుండి నిష్క్రమించేనాటి స్వదేశ సంస్థానాధీశుల నిర్ణయములు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→జమ్మూ-కాశ్మీర సంస్థానము: వ్యాస విస్తరణ |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 70:
=====జమ్మూ-కాశ్మీర సంస్థానము=====
భారతడొమినియన్లో చేరుటకు విముఖత చూపియుండిన స్వదేశ సంస్థానములలో మరొకటి జమ్మూ కాశ్మీర సంస్థానము. జనాభావారి తక్కువైనప్పటికినీ వైశాల్యములో హైదరాబాదు సంస్థానమంతటి పెద్దదైన సంస్థానము. 85శాతం మహ్మదీయ ప్రజలు కల ఆ సంస్థానము 1925 నుండి [[మహారాజ సర్ హరి సింగు]] అని ప్రసిధ్దిచెందిన హిందుమతస్తుడైన రాజు పరిపాలనలోనుండెను. మహారాజ హరి సింగు 1915లో నేషల్ డిఫెన్సు అకాడమి పట్టభద్రుడైయ్యను. మహారాజ ప్రతాప్ సింగు పరిపాలనాకాలములో జమ్మూ-కాశ్మీరు సైన్యమునకు ముఖ్య సైనికాధికారిగనుండెను. మహారాజైనతరువాత ఇతను రెండవ ప్రపంచయుధ్ధములో పాల్గొని యోగదానము చేయుటకు తన సైన్యమును ప్రోత్సహించి బ్రిటిష్ వారి అభినందనలకు పాత్రుడై 1944వసంవత్సరం [[ బ్రిటిష్ వార్ కాబినెట్]] కు ఆహ్యానించబడెను. తన సంస్థానములో రాజకీయ వత్తిడివలన 40 మంది ఎన్నుకొనబడిన సభ్యులతో 75 సభ్యుల శాసన సభనేర్పరచి నామమాత్రపు ప్రజాపరిపాలనా పధ్దతి నడుపుచుండెను. [[ముస్లిం కానఫరెన్సు]] అనబడు రాజకీయ విపక్ష పార్టి స్థాపనతో మహరాజ హరి సింగు నిరంకుశపాలనకు వ్యతిరేకత పెరిగినది. 1932 నుండి [[షైక్ అబ్దుల్లా]] ఆ పార్టీకి అధ్యక్షుడుగానుండెను. 1939 లో నెహ్రూ సలహా ప్రకారము తన పార్టీని [[నేషనల్ కానఫరెన్సు]] గా మార్చిన కారణముగ ముస్లిం కానఫరెన్సుపార్టీ చీలి గులాం అబ్బాసు నాయకత్వములో ముస్లింలీగు పార్టీ గనే కొనసాగెను. షైక్ అబ్దుల్లా నెహ్రుకి సన్నిహితుడిగానుండెను. నిరంకుశుడైన మహారాజ హరి సింగును తీసివైసి ప్రజాప్రతినిధిగనుండిన సంస్థానాధీశుని నియమించవలెనని ఆందోళన ఉదృతము చేయగా అప్పటి ప్రధానమంత్రి రామచంద్ర కక్ ప్రభుత్వము 1945 లో అతనిని నిర్బంధములోనుంచి అతనిపై న్యాయస్థానములో అభియోగము నడిపించెను. షైక అబ్దుల్లా తరఫున న్యాయవాదిగా నెహ్రు స్వయాన్న కాశ్మీరుచేరుకున ప్రయత్నించగా అతనిని రానీయక దారిలోనేనిర్బందించి వెనుతిరిగి పంపివైసెను. ముస్లిం కానఫరెన్సు పార్టీ అధ్యక్షుడైన గులాం అబ్బాసు మహ్మద్ అలి జిన్నాతో సన్నిహతుడైయుండి ఆ సంస్థానమునందలి ముస్లిములను కలసికట్టుగ పాకిస్తానులో చేరుటకు మదత్తుచేసెను. జమ్మూ కాశ్మీర రాజ్యమునకు ప్రధాన మంత్రిగా యుండిన రామచంద్ర కక్ భారతదేశములోని కాంగ్రెస్సు అధినేతల అభిమతమునకు వ్యతిరెకించినవాడు. కొత్తగా నెలకొల్పబోవు ఇండియా డొమీనియన్లోనో లేదా పాకిస్తాన్ డొమినియన్ లోనో విలీనమగుటకు ఆగస్టు 14 వతేదీలోగా అంగీకారములు పంపవలసినదన్న వైస్రాయి హెచ్చరికలను పెడచెవిన పెట్టమని మహారాజ హరిసింగుని ప్రెరేపించెను. జమ్మూ కాశ్మీర రాజ్యము స్వతంత్రరాజ్యముగా నుండునని ఘోషించెను. వైస్రాయి మౌంటు బాటన్ స్వయముగా కాశ్మీరుకి సమావేశము చేయ రాగా తనకు అనారోగ్య కారణమువలన ఉపస్తితికాజాలనని తెలియచేసెను. మహాత్మాగాంధీ మహారాజు తో కలసి నచ్చచెప్పిన తరువాత ఆగస్టు 10 వతేదీన హరిసంగు తన ప్రధానమంత్రి కక్ ను పదవీ విముక్తిచేసి మేజర్ జనరల్ జనక్ సింగును ప్రధానమంత్రిగా నియమించెను. జమ్మూ కాశ్మీరు సంస్ధానమునతో stand still agreement చేసినయడల డొమినియన్లో చేరుటకు అంగీకరించెదమని ఆ కొత్త ప్రధాన మంత్రి రెండు డొమీనియన్లకు తంతి ద్వారా తెలియజేసెను. అందుకు భారత డొమీనియను అంగీకరించకపోగా పాకిస్థాన్ డొమినియన్ అందుకు అంగీకరించెను. ఆగస్టు 15 వ తారీకు తరువాతకూడా స్వదేశ సంస్థానముగనే యుండిన జమ్మూ-కాశ్మీర రాషట్ర వివిరములు తెలుసకోవలసిన చరిత్రాంశములు (చూడు [[1947 ఆగస్టు 15 తరువాత జమ్ము-కాశ్మీర సంస్థాన చరిత్ర]] ) <ref name= "Dilipp Hiro(2015)"/>
==స్వదేశ సంస్థానములు భారతడొమినీయన్లో విలీనమగటకు వైస్రాయి మౌంటుబాటన్ చేసిన కృషి==
|