బ్రిటిష్ సామ్రాజ్యము భారతదేశమునుండి నిష్క్రమించేనాటి స్వదేశ సంస్థానాధీశుల నిర్ణయములు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 74:
==స్వదేశ సంస్థానములు భారతడొమినీయన్లో విలీనమగటకు వైస్రాయి మౌంటుబాటన్ చేసిన కృషి==
ఆ కాలమునాటి వివిధ రాజకీయ నేతలందరితోకంటె నెహ్రూతో వైస్రాయి లార్డు మౌంటుబాటన్ సఖ్యముగనుండెననియూ నేహ్రూచేసే సూచనలకు సుముఖముగా స్పందించెననియూ, అనేక సమావేశములలోను, సన్నివేశములలోను నెహ్రూదే ఆఖరిమాటగా వైస్రాయి అంగీకరించియుండెనన్న సంగతి పరిచితమైన చరిత్రాంశమైనది. స్వదేశ సంస్థానాధీశులకు జులై25 వతారీకున వైస్రాయి మౌంటుబాటన్ తన అధికార నివాసములో గొప్పవిందుభోజనముతో అధికార సమావేశముచేసెను. స్వదేశ సంస్థానాధీశులకు సానుకూలమైన షరతులనేకములను, వప్పందములను భారతడొమినియన్ ప్రభుత్వము వప్పుకొనక తప్పనిసరి అగునటుల తాను స్వాయన్న కృషిసలిపి చేసితిననియూ ఆ సందర్భములో అతను స్వదేశ సంస్థానాధీశులకు తెలియచేెసెను. విలంబనచేయక అతి త్వరలోనే తమ తమ అంగీకార పత్రములు దాఖలుచేయమనియూకూడా నచ్చచెప్పెను. చాలమంది స్వదేశ సంస్తానాధీశులా విందుభోజనములో పాల్గొనిరి. కానీ భోపాలు మరియూ ఇండొర్ నవాబులు పాల్గొనటకు తిరస్కరించిరి. అంతేకాక స్వదేశ సంస్థానముల విలీన విషయములో మౌంటుబాటన్ దొర స్వయాన్న ఆంగ్ల రాజు(6వ జార్జి) వంశీయుడగుటవలన అతను వ్యక్తిగతస్థాయిలో స్వదేశ సంస్థానాధీశులకు అభిమానపాత్రుడైయుండెను. భారతడోమినియన్లో విలీనమగుటకు సమ్మతి పత్రములను పంపమని అతను ప్రోత్సహించుటవలన చాలమంది సంస్థానాధీశులు తమ పత్రములను ఆగస్టు 15 వ తారీకులోపలనే పంపించినటుల తెలుయుచున్నది.<ref name=“Barney(2017)”/>
== భారతడొమినియన్లో విలీనమగుటకు ఆసక్తిచూపి ఇతర సంస్థానధీశులను ప్రోత్సాహపరచిన సంస్థానాధీశులు==
గ్వాలియర్, బరోడా.................సశేషము
|