ఆది శంకరాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
వ్యాకరణం స్థిరం ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు |
→జీవిత గాధ: అక్షర దోషం స్థిరం, వ్యాకరణం స్థిరం, లింకులు చేర్చబడ్డాయి ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు |
||
పంక్తి 35:
</ref> శంకరుల జీవిత గాథలో ఎన్నో అసాధారణమైన, అధిభౌతికమైన సంఘటనలు మనకు గోచరిస్తాయి. <!-- ఇవి అన్నీ నిజమని పలువురు విశ్వసిస్తారు.-->
* మాధవీయ శంకర విజయం - 14వ శతాబ్దికి చెందిన మాధవుని రచన
* చిద్విలాస శంకర విజయం - 15 - 17
* కేరళీయ శంకర విజయం - 17వ శతాబ్దికి చెందిన రచన
వెయ్యి సంవత్సరాల పాటు [[బౌద్ధమతం]] ప్రచారంలోకి వచ్చాక, సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించీ, సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు. బౌద్ధమత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచ
తెలుగులో వీరి జీవిత చరిత్రను 1001 పద్యాలతో [[ధర్మదండము]] పేరిట పద్య కావ్యంగా డా. [[కోడూరి విష్ణునందన్]] రచించారు.
===జననము===
[[బొమ్మ:శంకరుల జనంస్థలం కాలడి.jpg|200px|right|thumb|శంకరుల జన్మస్థలం కాలడి]]
[[శివుడు|సదాశివుడే]] ఆదిశంకరుల రూపంలో భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం. కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ, శివగురులకు [[కేరళ]] లోని [[పూర్ణా నది]] ఒడ్డున ఉన్న [[కాలడి]]లో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి [[త్రిచూర్]]కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ, శివగురులు త్రిచూర్ లోని [[వృషాచల పర్వతం]] పైన ఉన్న శివుడిని ప్రార్థించి, ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని
===బాల్యము===
శంకరుల బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి, శాస్త్రోక్తంగా [[ఉపనయనం]] జరిపించింది. శంకరులు [[ఏకసంథాగ్రాహి]]. బాల్యంలోనే [[చతుర్వేదాలు|వేదవిద్యలు]], [[సంస్కృతం]] అభ్యసించారు. బాలబ్రహ్మచారిగా శంకరులు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా, భిక్ష వేసేందుకు ఏమీ లేక, తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకొన్న [[ఉసిరి]] కాయను
ఒకరోజు శంకరుల తల్లి ఆర్యమాంబ పూర్ణా నది నుండి నీళ్ళు తెచ్చుకుంటుండగా స్పృహతప్పి పడిపోయింది. అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి, నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆవిధంగా నదీ ప్రవాహ మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు.
పంక్తి 56:
===గోవింద భగవత్పాదుల దర్శనం===
తల్లి అంగీకారం తీసుకుని శంకరులు కాలడి విడిచి, గురువు కొరకు అన్వేషణలో [[నర్మద|నర్మదా]] నది వద్దకు వెళ్ళారు. నర్మద ఒడ్డున [[గౌడపాదుడు|గౌడపాదుల]] శిష్యుడైన [[గోవింద భగవత్పాదులు]] ఉండే గుహ
<poem>
:న భూమిర్నతోయం న తేజో నవాయుర్మఖంనేంద్రియం వా న తేషాం సమూహః
పంక్తి 62:
::నేను నింగిని కాదు, భూమిని కాదు,నీటినికాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేని వాడిని. [[ఇంద్రియాలు]] కాని వేరే చిత్తం గాని లేనివాడిని. నేను శివుడను. విభజనలేని జ్ఞాన సారాన్ని.
</poem>
ఆటువంటి అద్వైత సంబంధమైన మాటలు పలికిన శంకరులను, గోవిందభగవత్పాపాదులు జ్ఞాన సమాధి నుండి చూసి ఈ విధంగా అన్నారు. - ''"స ప్రాహ శంకర స శంకర ఏవ సాక్షాత్"'' (సాక్షాత్తు భూమికి దిగి వచ్చిన పరమశివుడే ఈ [[శంకరుడు|శంకరులు]]
శంకరులు మొట్టమొదటిగా గోవిందపాదులకు పాదపూజ చేశారు. గురువులకు పాదపూజ చేసే ఈ సాంప్రదాయం పరంపరగా నేటికీ వస్తోంది. గురుసేవ తోనే జ్ఞానార్జన జరుగుతుందని శంకరులు సర్వప్రపంచానికి వెల్లడి చేశారు. గోవిందపాదులు శంకరులను బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని నాలుగు [[మహావాక్యాలు|మహావాక్యాలుగా]] బోధించారు. ఒకరోజు నర్మదా నదికి వరద వచ్చి, పొంగి పొర్లుతూ, గోవిందపాదుల తపస్సుకు భంగం కల్గించబోతుండగా శంకరులు తన శక్తితో నదిని నిరోధించారు. గోవిందపాదుల వద్ద విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురువు ఆజ్ఞతో [[బ్రహ్మసూత్రాలు|బ్రహ్మసూత్రా]] లకు భాష్యాలు వ్రాయడం కోసం పండితులకు నిలయమైన [[వారణాసి]] చేరుకున్నారు.
===వారాణసిలో శంకరులు ===
గుర్వాజ్ఞతో శంకరులు [[వారాణసి]] చేరుకొని పవిత్ర [[గంగా నది]]లో పుణ్యస్నానమాచరించి, [[విశ్వేశ్వరుడు|విశ్వేశ్వరుని]] సన్నిధిలో కొంతకాలం గడిపారు. అయస్కాంతం ఇనుపరజనును ఆకర్షించినట్లు, వేదసూక్ష్మాలు శంకరులకు వారణాసిలో బాగా అవగతమయ్యాయి. వారణాసిలోనే [[సదానందుడు]] అనే బ్రహ్మచారి శంకరులకు ప్రథమ శిష్యుడయ్యాడు.
===మనీషా పంచకం===
పంక్తి 76:
::సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం ఛండాలుడిలోనైనా, బ్రాహ్మణుడి లోనైనా ఒకేవిధంగా పనిచేస్తుంది. మీరు అడ్డు తప్పుకోమన్నది కనిపిస్తున్న ఈ శరీరాన్నా, లేక లోపలనున్న ఆత్మనా? ఆవిధంగా అయితే అది ద్వంద్వం అవుతుంది కాని అద్వైతం కాదు
</poem>
ఆ మాటలువిన్న వెంటనే శంకరులు అంతరార్థం గ్రహించి సాక్షాత్తు [[శివుడు|పరమశివుడే]] [[వేదాలు|నాలుగు వేదాలతో]] వచ్చాడని గ్రహించి మహాదేవుడిని [[మనీషా పంచకం]] అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం
===ప్రస్థానత్రయం===
పంక్తి 82:
===[[వ్యాసుడు|వ్యాసమహర్షి]]===
ఒకరోజు శంకరులు గంగా నది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళ్తుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు వ్రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. 8 రోజుల చర్చ తరువాత, ఆ వచ్చింది సాక్షాత్తూ వ్యాసుడేనని పద్మపాదుడు గ్రహించి, అ విషయం శంకరులకు చెప్తాడు. శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి, తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా, వ్యాసుడు సంతోషించి [[బ్రహ్మ సూత్రాలు]] అసలు అర్థాన్ని గ్రహించింది శంకరులు మాత్రమేనని
వేదవ్యాసుడు నిష్క్రమించ బోవడం చూసి, శంకరులు 'నేను చెయ్యవలసిన పని అయిపోయింది, నాకు ఈ శరీరం నుండి ముక్తి ప్రసాదించ'మని వ్యాసుని కోరగా, వ్యాసుడు "లేదు, అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులనేకులను ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే, నీ కారణంగా రూపుదిద్దుకుని, ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్ఛానురక్తి అర్ధాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్నివ్వాలని అనిపిస్తోంది. బ్రహ్మ నీకిచ్చిన 8 సంవత్సరాల
==శంకరాచార్యుల శిష్యులు==
|