నండూరి రామమోహనరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
| weight =
}}
'''నండూరి రామమోహనరావు''' ([[ఏప్రిల్ 24]], [[1927]]- [[సెప్టెంబర్ 3]], [[2011]]) తెలుగు పాత్రికేయరంగ ప్రముఖులు. పాత్రికేయునిగానే కాక, రచయితగా కూడా ప్రసిద్ధులు. చాలాకాలం పాటు [[ఆంధ్రజ్యోతి]] పత్రిక సంపాదక బాధ్యతలు నిర్వహించారు. "బాల" అన్న పత్రికలోనూ, [[ఆంధ్రపత్రిక]] లోనూ [[1940]] వ దశకంలో వీరి రచనలు ఎన్నో ప్రచురింపబడ్డాయి. "నరావతారం", "విశ్వరూపం" ఈయన ప్రముఖ రచనలు. సామాన్య జనాలకు సైన్సు సంగతులు పరిచయం చేయడంలో వీరి కృషి ఎన్నదగ్గది. ఇవికాక వీరు ఆంధ్రపత్రికలో [[మార్క్ ట్వేన్ట్వేయిన్]] నవలలకు తెలుగు అనువాదాలు కూడా చేసారు.
 
== జీవితం==
నండూరి రామ్మోహనరావు [[కృష్ణా జిల్లా]] [[బాపులపాడు]] మండలం [[ఆరుగొలను]] గ్రామంలో [[1927]], [[ఏప్రిల్ 24]] న జన్మించారు.1937-42 మధ్య [[నూజివీడు]], [[మచిలీపట్నం]] లలో ఉన్నత పాఠశాల విద్యనభ్యసించారు. [[రాజమండ్రి]] గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో 1942-47 మధ్య చదువుకున్నారు. [[రాజమండ్రి]] ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థిగా ఉండగానే ‘విజ్ఞానం’ అనే లిఖిత పత్రికను నడిపారు. నండూరి తన 21వ ఏటనే పాత్రికేయుడిగా తన ప్రస్థానం ప్రారంభించారు. [[1944]] [[ఏప్రిల్ 30]] వ తేదీన మేనమామ కూతురు రాజేశ్వరిని వివాహమాడారు. కొన్నాళ్ళు ఋషీకేశంలో ఉన్నారు. ఆ తరువాత [[1947]] లో కొన్ని నెలలు ఉదయభారతి గురుకులంలో పనిచేశాక, "జన్మభూమి" అన్న పత్రికలో సబెడిటర్సబ్ ఎడిటర్ ఉద్యోగంలో చేరారు. 1948-1960 మధ్యలో వివిధ స్థాయిల్లో "[[ఆంధ్రపత్రిక]]"లో పనిచేశారు. 1960-1994 దాకా [[ఆంధ్రజ్యోతి]] పత్రికలో వివిధ స్థాయుల్లో పని చేసి, సంపాదకులు గా పదవీ విరమణ చేశారు. ఆ సమయంలోనే "జ్యోతిచిత్ర", "వనితాజ్యోతి", "బాలజ్యోతి" వంటి పత్రికలకు వ్యవస్థాపక సంపాదకులుగా ఉన్నారు.
 
ఆయన జర్నలిస్టు జీవితం ‘ఆంధ్రపత్రిక’లో ప్రారంభమైంది. [[1948]] నుంచి [[1960]] వరకు ఆయన ‘ఆంధ్ర పత్రిక’లో పనిచేశారు. 1960లో సహ సంపాదకుడి హోదాలో ‘[[ఆంధ్రజ్యోతి]]’లో అడుగు పెట్టారు.1960 నుంచి 1994 దాకా… అంటే 34 సంవత్సరాల కాలం ఆయన ‘ఆంధ్రజ్యోతి’లో అక్షర యాత్ర చేశారు. ఆయన ఎంతో మందిని పాత్రికేయులుగా తీర్చి దిద్దారు. సూటిగా, సరళంగా ఉండే ఆయన సంపాదకీయాలు పాఠకులపై మంచి ప్రభావం చూపేవి. తొలితరం సంపాదకుడు నార్ల వెంకటేశ్వర రావుతో కలసి పని చేశారు. నార్ల నిష్క్రమణ అనంతరం [[1980]] లో నండూరి రామమోహనరావు ‘[[ఆంధ్రజ్యోతి]]’ సంపాదకుడిగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. ఆయన [[1962]], [[1978]], [[1984]], [[1992]] లలో [[అమెరికా]] లోను, 1982లో [[రష్యా]]లో లోను పర్యటించారు.
 
==అనువాద హనుమంతుడు==
బాపు – రమణలు నండూరిని ‘అనువాద హనుమంతుడు’ అని కొనియాడారు. సుప్రసిద్ధ ఆంగ్ల రచనలను అచ్చ తెలుగులో, అందరికీ నచ్చేలా, తనదైన ప్రత్యేక శైలిలో అనువదించడమే దీనికి కారణం. మార్క్‌ట్వేన్మార్క్‌ట్వేయిన్ రచించిన టామ్ సేయర్, హకిల్ బెరిఫిన్‌లను అవే పేర్లతో అనువదించారు. మార్క్‌ట్వేన్మార్క్‌ట్వేయిన్ మరో రెండు రచనలను రాజు – పేద, విచిత్ర వ్యక్తి పేరిట అనువదించారు. అలాగే… కాంచన ద్వీపం (రాబర్ట్ స్టీవెన్‌సన్) అనే మరో అనువాద రచన కూడా చేశారు.
 
61 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ఆ పుస్తకాలకు ఆదరణ ఉండడం విశేషం. నండూరి ఖగోళ, భౌతిక శాస్త్రాలను పరిశోధించి ‘విశ్వరూపం’ అనే పుస్తకం రచించారు. మానవాళి పరిణామ క్రమానికి సంబంధించిన నరావతారం, తత్త్వశాస్త్రాన్ని సులువుగా వివరించే ‘విశ్వ దర్శనం’ ఆయన కలం నుంచి జాలువారినవే. నండూరి.. సవ్యసాచి పేరుతో రాజకీయ వ్యంగ్య రచనలు, హరివిల్లు పేరుతో బాల గేయాలు, ఉషస్విని పేరిట కవితలు రచించారు. కథా గేయ సుధానిధి (లేదా యూసఫ్?) కూడా ఆయన రచనే.
"https://te.wikipedia.org/wiki/నండూరి_రామమోహనరావు" నుండి వెలికితీశారు