గోపీనాథ్ మొహంతి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 20 ఏప్రిల్ 1914 → 1914 ఏప్రిల్ 20, కమీషన్ → కమిషన్, శతాబ్ధం → శత using AWB
పంక్తి 17:
| awards = [[జ్ఞానపీఠ పురస్కారం]]<br />[[పద్మభూషణ్ పురస్కారం]]
}}
గోపీనాథ్ మొహంతి (1914-1991), ప్రఖ్యాత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. ఒరిస్సాలో 20వ శతాబ్ధంలోనిశతాబ్దంలోని నవలాకారులలో ఫకీర్ మోహన్ సేనాపతి తరువాత గోపీనాథ్ గొప్పవారిగా చెప్పబడ్డారు.
 
== బాల్యం, విద్య ==
గోపీనాథ్ మొహంతి 201914 ఏప్రిల్ 1914లో20లో [[కటక్ జిల్లా]]లో నాగబలి గ్రామంలో జన్మించాడు. వీరిది సనాతన ఆచారాలపట్ల గట్టి నమ్మకమున్న సంపన్న జమీందారీ కుటుంబం<ref name=మిసిమి>{{cite journal|last1=జె.లక్ష్మిరెడ్డి|title=పరస్పర రాగానుబంధమే జీవితం|journal=మిసిమి|date=1 January 2006|volume=17|issue=1|pages=65-71|url=https://misimi1990.files.wordpress.com/2013/06/misimi_2006_01.pdf|accessdate=29 March 2018}}</ref>. ఈయన 12 సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడు తండ్రి చనిపోగా [[పాట్నా]]లో ఉన్న తన అన్న దగ్గరకు వెళ్లవలసి వచ్చింది. అక్కడ మెట్రిక్ వరకు చదివాడు. ఆ తర్వాత [[కటక్|కటక్‌లో]] రావెన్షా కశాశాలలో ఉన్నత విద్య పూర్తి చేశాడు. పాట్నా విశ్వవిద్యాలయం నుండి 1936లో ఎం.ఎ డిగ్రీ పట్టా పొందాడు. గోపీనాథే కాక ఇతని కుటుంబంలో కూడా రచయితలున్నారు. ఆయన పెద్ద అన్నయ్య అయిన కహాను చరణ్ మొహంతి, మేనల్లుడు గురుప్రసాద్ మొహంతీ కూడా ఒరియా సాహిత్యంలో విశేష కృషి చేశారు.
 
== ఉద్యోగ జీవితం ==
ఇతనికి కాలేజీలో ఉపన్యాసకుడిగా పనిచేయాలన్న కోరిక ఉండేది. అది నెరవేరకుండానే ఇతడు 1938లో ఒరిస్సా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకు ఎంపిక అయ్యాడు. ఇతని మొదటి నియామకం జాజ్‌పూర్‌లో జరిగింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో పెద్ద వరద వచ్చింది. ప్రభుత్వోద్యోగిగా వరద సహాయ కార్యక్రమాలు చేపట్టే అనుభవం ఇతనికి మొదటిసారిగా అప్పుడు కలిగింది. తర్వాతి కాలంలో 'మాటీ మటాల్' వ్రాసినప్పుడు ఈ అనుభవం ఇతనికి ఎంతగానో తోడ్పడింది. 1940లో [[ఒడిశా|ఒరిస్సా]] దక్షిణ ప్రాంతంలోని గిరిజన ప్రాంతానికి బదిలీ అయ్యాడు. ఈ బదిలీ ఒరియా సాహిత్యానికే కాక భారతీయ సాహిత్యానికే ఒక వరంగా మారిందని పలువురు భావిస్తున్నారు. ఒక ప్రభుత్వ అధికారిగా [[కొరాపుట్|కోరాపుట్]] ప్రాంతంలోని ఆదివాసులతో పాటు జీవించి వారి జీవితాన్ని నిశితంగా పరిశీలించాడు. వారి స్థితిగతుల గురించి తీవ్రంగా ఆలోచించాడు. ఆదివాసులలో పరజా, కంధ్, గదబా, కోల్హ్, డంబ్ మొదలైన జాతుల ప్రజలతో ఇతడు మమైకమై పోయాడు. తన ఉద్యోగ కాలంలో ఆదివాసులతో ఇతడు ఎంతగా కలిసిపోయాడంటే కోరాపుట్ జిల్లాలోని జమీందారులు, వడ్డీ వ్యాపారులు 1953లో అప్పటి ప్రధానమంత్రికి ఇతనికి విరుద్ధంగా ఒక నివేదిక కూడా పంపారు. మొహంతి తన ఉద్యోగకాలంలో ఒరిస్సాలో చాలా చోట్ల పనిచేసినా కోరాపుట్‌తోను, అక్కడి ఆదివాసులతోను ఇతనికి విడదీయరాని బంధం ఏర్పడింది<ref name=మిసిమి />.
 
అధ్యాపకుడు కావాలన్న తన కోరికను ప్రభుత్వ ఉద్యోగ విరమణ తర్వాత ఉత్కళ్ విశ్వవిద్యాలయంలో రెండేళ్ళ పాటు ఆంగ్ల అధ్యాపకునిగాను, 1986లో అమెరికాలోని సాన్ జోస్ రాష్ట్ర విశ్వవిద్యాలయంలో సాంఘిక శాస్త్రంలో అధ్యాపకునిగా పనిచేసి నెరవేర్చుకున్నాడు.
పంక్తి 30:
ఇతడు 1936 నుండే వ్రాయడం ప్రారంభించాడు. 1930-38 మధ్యకాలాన్ని రచయితగా ఇతని నిర్మాణకాలంగా పరిగణించవచ్చు. ఇతనిపై ఆ కాలంలో మార్క్స్, రష్యావిప్లవం, ఫ్రాయిడ్ ప్రభావం, గాంధీజీ జాతీయోద్యమ ప్రభావం పడుతూ వచ్చింది. ఇతడు గొప్ప అధ్యయనశీలి. రోమరోలా, గోర్కీ రచనలు చదివి వారికి అభిమానిగా మారాడు. వివిధ సాహిత్య ప్రక్రియల స్వరూపాలలో కొత్తకొత్త ప్రయోగాలు చేస్తూ ప్రచారంలో ఉన్న రొమాంటిక్ అభిరుచులను బాహాటంగా ఖండించేవాడు. ఇతడు చాలా సాహిత్యప్రక్రియలలో రచనలు చేసినా కథాసాహిత్యమే ప్రముఖ రంగంగా నిలిచింది. ఇతని సాహిత్యాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు. అవి 1. ఆదివాసులకు సంబంధించిన రచనలు, 2. నగరవాసులకు సంబంధించిన రచనలు, 3. 'మాటీ మటాల్ ' నవల. ఇతడు తన రచనలలో నిరుపేదల, అణగారిన వర్గాల, నిరపాయులైన ఆదివాసుల పక్షాన ఎప్పుడూ నిలిచాడు. శోషణ ఏ రూపంలో ఉన్నా దానిని సహించేవాడు కాదు.
==రచనలు==
ఇతడు మొత్తం 19 నవలలు, 8 కథా సంపుటాలు, 2 నాటకాలు, 1 వ్యాస సంకలనం, 2 జీవిత చరిత్రలు, 8 ఆదివాసుల భాషలకు సంబంధించిన పుస్తకాలు, 4 హిందీ, బెంగాలీ, ఇంగ్లీషు నుండి అనువదించిన పుస్తకాలు వెలువరించాడు. ఇతనికి ముఖ్యంగా మూడు రచనల వల్ల గొప్ప ఖ్యాతి లభించింది. అవి 'పరజా', 'అమృత సంతాన్', 'మాటీ మటాల్'.
 
;పరజా
ఇది ఒక రకంగా కోరాపుట్ జిల్లాలోని పరజా జాతి ఆదివాసుల జీవితానికి సంబంధించిన సమాజ శాస్త్ర అధ్యయనానికి చెందిన రికార్డు వంటిది. కానీ గోపీనాథ్ మొహంతీ లోని సృజనాత్మకత దీనిని ఒక ఉత్కృష్ట కళాకృతిగా రూపొందించింది. ఈ నవల కారణంగా త్యక్తులు, తిరస్కృతులు అయిన పరజా జాతి వారు నేటివరకు ఆధునిక ఒరియా సాహిత్య లోకంలో అభిన్నమైన అంగాలుగా నిలిచి ఉన్నారు<ref name=మిసిమి />.
 
; అమృత సంతాన్
పంక్తి 47:
* 1973 - [[జ్ఞానపీఠ పురస్కారం]]<ref>{{cite web|url=http://www.jnanpith.net/page/jnanpith-laureates|title=Jnanpith Laureates Official listings|publisher=[[Jnanpith]] Website}}</ref>
* 1976 - సంభల్పూర్ విశ్వవిద్యాలయం వారిచే డి.లిట్.
* 1979 - ఒరియా భాషలో సృజనాత్మక రచనలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్కమిషన్ ఫెలోషిప్
* 1981 - భారత ప్రభుత్వంచే [[పద్మభూషణ్ పురస్కారం]]
* 1993 - ఒరిస్సా సాహిత్య అకాడమీ అవార్డు.
"https://te.wikipedia.org/wiki/గోపీనాథ్_మొహంతి" నుండి వెలికితీశారు