మండలి వెంకటకృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి replacing dead dlilinks to archive.org links
పంక్తి 41:
1926 ఆగస్టు 4న [[కృష్ణా జిల్లా]] [[కైకలూరు]] తాలూకా, [[పల్లెవాడ]] గ్రామంలో మండలి వేంకట కృష్ణారావు ‘దివిసీమ గాంధీ’గా ప్రజల మన్ననలనందుకున్నారు. 1997 సెప్టెంబర్ 27న తుదిశ్వాస విడిచారు. ‘బాధలలో ఉన్న వారిని మనమే ముందు వెల్లి ఓదార్చాలని’ వారు ఆచరించి చెప్పిన మాటలు దివిసీమ ప్రజలకు భగవద్గీతలా వినిపిస్తూనే ఉంటాయి.
 
మండలి వేంకట కృష్ణారావు కృషి వల్లే దివిసీమలోని నిరుపేదలకు బంజరు భూములను పంచె కార్యక్రమం 1955లో ప్రారంభమైంది. 15 వేల ఎకరాల బంజరు భూములను పేదలకు పంచారు. 1974 లో ఆయన విద్యా – సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1975 రాక్షస నామ సంవత్సరం ఉగాదినాడు ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలను [[హైదరాబాదు|హైదరాబాద్]] లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమ నిర్వహణ కమిటీకి మండలి వెంకట కృష్ణారావు కార్యనిర్వాహక అధ్యక్షునిగా వ్యవహరించారు.<ref name="దేవులపల్లి రామానుజరావు">{{cite book|last1=రామానుజరావు|first1=దేవులపల్లి|title=తెలుగు నవల (ముందుమాట)|date=17 మార్చి 1975|publisher=ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ|location=హైదరాబాద్|page=iii|url=httphttps://dliarchive.gov.inorg/cgi-bindetails/metainfoin.ernet.dli.2015.cgi?&title1=Telugu+Navala&author1=Akkiraju+Ramapathi+Rao&subject1=NOVEL&year=1975+&language1=telugu&pages=47&barcode=2020120002063&author2&identifier1&publisher1=ANDHRAPRADESH+SAHITYA+ACADEMY&contributor1=ANDHRAPRADESH+SAHITYA+ACADEMY&vendor1=NONE&scanningcentre1=ccl%2C+hyderabad&slocation1=NONE&sourcelib1=ROP+HYDERABAD&scannerno1&digitalrepublisher1=PAR+INFORMATICS%2C+HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1&unnumberedpages1&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter+name+of+the+copyright+owner&copyrightexpirydate1&format1=BOOK+&url=%2Fdata%2Fupload%2F0002%2F064387391|accessdate=7 March 2015}}</ref> ‘అంతర్జాతీయ తెలుగు కేంద్రం’ సంస్థను 1975లో నాటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్ ప్రారంభించారు. మండలి వేంకటకృష్ణారావు ఈ సంస్థకు ప్రథమ అధ్యక్షులుగా వ్యవహరించారు.
 
ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల కార్యనిర్వాహక అధ్యక్షులుగా, అంతర్జాతీయ తెలుగు కేంద్రం ప్రథమ అధ్యక్షులుగా వ్యవహరించిన మండలి వేంకట కృష్ణారావు కృషిని గుర్తించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంతర్జాతీయ తెలుగు కేంద్రం పేరును ‘మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం’గా మార్చారు. దివిసీమ లోని [[పులిగడ్డ]] – [[పెనుమూడి]] వంతెనకు మండలి వేంకట కృష్ణారావు పేరు పెట్టారు.