శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
| boards =
| religion =
| spouse = సీత
| partner =
| children =
పంక్తి 37:
20 వ శతాబ్దపు [[తెలుగు సాహితీకారులు|తెలుగు కథకులలో]] విశిష్టంగా చెప్పుగోదగ్గ రచయిత '''[[శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి]]''' ([[ఏప్రిల్ 23]], [[1891]] - [[ఫిబ్రవరి 25]], [[1961]]). భాషలో, భావంలో, [[తెలుగు]] నుడికారం ప్రయోగించటంలో ఈయన పేరెన్నిక గన్నవాడు. ఆయన [[జీవితం]] ఒక సంధి యుగంలో గడిచింది. ఒక పక్క పాత సంప్రదాయాలు వెనక్కి లాగుతూ ఉండగా, [[పాశ్చాత్య సంస్కృతి|పాశ్చాత్య]] నాగరికత మరొక పక్క ఆకర్షిస్తూ ఉండగా ఆ పాత కొత్తల కలయికని తన రచనలలో ప్రతిభావంతంగా చిత్రించేడీయన.
 
[[వేదములు|వేదవేదాంగాలు]] తరతరాలుగా అధ్యయనం చేసే కర్మిష్టులూ, పండితులూ అయిన [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో పుట్టి, [[సంస్కృతం|సంస్కృతానికి]] స్వస్తి చెప్పి, తెలుగులో చిన్న కథలని రాయటం ప్రవృత్తిగా ఎన్నుకుని ఆ చిన్న [[కథ]]<nowiki/>కి కావ్యప్రతిపత్తి కలిగించిన సాహిత్య శిల్పి, సుబ్రహ్మణ్యశాస్త్రి. ఆయన ఆత్మకథ పేరు [[అనుభవాలూ -జ్ఞాపకాలూనూ]].
 
== జీవిత విశేషాలు ==
సుబ్రహ్మణ్యశాస్త్రి [[1891]] [[ఏప్రిల్ 23]] న [[తూర్పు గోదావరి]] జిల్లా [[పొలమూరు]] లో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు మహలక్ష్మీ సోదెమ్మ, లక్ష్మీపతి సోమయాజులు. వేదం, [[జ్యోతిష్యం]] మరియు ధర్మ శాస్త్రాలను చదివారు.
 
ఈయన [[మహాత్మా గాంధీ|గాంధీ]], '''[[ఖద్దరు''']], [[హిందీ]] - ఈ మూడింటినీ వ్యతిరేకించారు.
 
సుబ్రహ్మణ్యశాస్త్రి [[1961]] [[ఫిబ్రవరి 25]] న [[రాజమహేంద్రవరం]] లో మరణించారు.
 
==రచనలు==
సుబ్రహ్మణ్య శాస్రి 75 కథలు రాసాడు. ఈయన కథలలో విషయాన్ని ప్రణయం, సంఘసంస్కారం, ప్రబోధం, కుటుంబజీవితం, అపరాధ పరిశోధనం, భాషావివాదాత్మకం, అవహేళనాత్మకం, చారిత్రకం అనే విషయాలుగా విభజించచ్చు. ఇవేకాక శ్రీపాద అనేక పద్య రచనలు, నవలలు,[[నాటకాలు]],అనువాదాలు, వైద్య గ్రంథాలు కూడా రాసాడు.వాటిలో కొన్ని: ఆత్మబలి, రక్షాబంధనం, రాజరాజూ, కలంపోటు, వీరపూజ, వీరాంగనలు, మహాభక్త విజయము, [[ఆయుర్వేదం|ఆయుర్వేద]] యోగ ముక్తావళి, వైద్యక పరిభాష వగైరా. శాస్త్రి తన ఆత్మకథ - [[అనుభవాలూ-జ్ఞాపకాలూనూ]] ని ఎనిమిది సంపుటాలుగా ప్రచురించదలిచాడు. కానీ శాస్త్రి అకాలమరణంతో అది మూడు సంపుటాల దగ్గర నిలిచిపోయింది. ఈయన రచనలు ఆంధ్రప్రదేశ్ పాఠశాల, కళాశాలలలో పాఠ్యాంశాలుగా కూడా ఉన్నాయి. శాస్త్రి తొమ్మిదేళ్ళ పాటు ''<nowiki/>'ప్రబుద్ధాంధ్ర''' పత్రిక నిర్వహించారు. [[గిడుగు రామమూర్తి]] లాగా ప్రముఖ వ్యావహారిక భాషావాది. కలం పేర్లతో శతాధిక వ్యాసాలు రాసారు. అనేక [[అష్టావధానాలు]] కుడా చేసారు. [[1956]] లో కనకాభిషేకం అందుకున్నారు.
 
==వ్యక్తిగతం==
సుబ్రహ్మణ్యశాస్త్రి వ్యక్తిగతం గురించి తన స్వీయచరిత్రాస్వీయచరిత్ర పుస్తకాలైన అనుభవాలు,జ్ఞాపకాలుఅనుభవాలూ-జ్ఞాపకాలూనూ లో వివరంగా రాసుకొన్నాడు. దాని ప్రకారం చిన్నతనం నుండి బాగా అల్లరి చిల్లరిగా పొలాల వెంట తన స్నేహితుడు ఆనంద్ తో తిరిగేవాడినని రాసాడు. చాలాకాలం మునికూడలి ([[మురమళ్ళ]]) లో [[వారాలు]] చేసుకొంటూ విద్యాభ్యాసం కొనసాగించాడు. చిన్న వయసులోనే అత్త కూతురు సీతతో [[పెళ్ళి|వివాహం]] జరిగింది. వీరికి సంతానం లేదు.
 
==ప్రఖ్యాత సందేశాలు==
పంక్తి 81:
* బ్రాహ్మణాగ్రహారం
* యావజ్జీవం హోష్యామి
* '''విజయనగర రాజుల కథలు'''<ref>[https://archive.org/details/VijayanagaraRajulaKathalu ఆర్కివులో విజయనగర రాజుల కథలు పూర్తి పుస్తకం.]</ref> అనే ఈ పుస్తకం [[శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి]] బాలురకు చరిత్ర లొనిలోని నీతి కథలు తెలియుటకు వ్రాసిన విషయాల సంపుటం. ఈ పుస్తకముతో పాటు ''గోల్కొండనవాబు కథలు, ఓరుగంటి రాజుల కథలు , [[చిత్తూరు]] రాజుల కథలు, [[ఢిల్లీ]] రాజుల కథలు'' వెలువడ్డాయి.
 
==నవలలు==
పంక్తి 93:
 
==ఇతర రచనలు==
* [[అనుభవాలు జ్ఞాపకాలుఅనుభవాలూ-జ్ఞాపకాలూనూ]] (స్వీయానుభవాలు)
* రాచపీనుగ తోడు లేకుండా వెళ్ళదు (నాటకం)