పట్లోళ్ల రామచంద్రారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
== జీవిత విశేషాలు ==
రామచంద్రారెడ్డి 1929 డిసెంబరు 3న సాధారణ వ్యవసాయ కుటుంబంలో [[సంగారెడ్డి జిల్లా]] కొండాపూర్‌ మండలం మారేపల్లి జన్మించాడు.<ref>[[మెదక్]] జిల్లా స్వాతంత్ర్యోద్యమము - సమరయోధులు (రచన: ముబార్కపురం వీరయ్య, పేజీ 86)</ref> [[హైదరాబాదు]] సంస్థానం విమోచనోద్యమంలో పాల్గొని రామచంద్రారెడ్డి మొత్తం 13 సార్లు జైలుకు వెళ్ళాడు. విమోచన అనంతరం ఇంటర్ మరియు డిగ్రీ పూర్తిచేసి [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుంచి న్యాయశాస్త్ర పట్టా పొంది 1956లో న్యాయవాద వృత్తి చేపట్టి రాజకీయాలలో కూడా ప్రవేశించాడు. 1959లో పటాన్‌చెరు [[పంచాయతి]] సమితి అధ్యక్షులుగా కొంతకాలం పనిచేసాడు. పల్లెసీమల అభివృద్ధికి విశేషంగా కృషిచేసినందుకు నాటి ప్రధాని [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]] చేతుల మీదుగా అవార్డును అందుకున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి కాంగ్రెస్‌ తరఫున ఐదుసార్లు శాసనసభ్యుడిగా ప్రాతినిథ్యం వహించాడు. 1962లో తొలిసారిగా ఆయన ఎమ్మెల్యేగా సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా పాలుపంచుకున్నాడు. 1971లో రెండోసారి శాసనసభకు ఎన్నికై కొంతకాలం రాష్ట్ర మంత్రిగానూ పనిచేశాడు. అతడు పటాన్‌చెరు ఫారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి చాలా కృషిచేశాడు. తరువాత 1983, 1985, 1989లోనూ గెలిచాడు. 1990 జనవరి 4 నుంచి డిసెంబరు 22 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశాడు. నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి కేబినెట్‌లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశాడు. పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా కొనసాగాడు. 1999లో కాంగ్రెస్‌ నుంచి బయటకొచ్చాడు. 2004లో మెదక్‌ లోక్‌సభ స్థానానికి పోటీచేసి ఓడిపోయాడు.<ref>{{Cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=571582|title=మాజీ స్పీకర్‌ రామచంద్రారెడ్డి కన్నుమూత -|website=www.andhrajyothy.com|language=te|access-date=2018-04-30}}</ref>
 
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ ఎస్సార్‌నగర్‌లోని స్వగృహంలో 2018 ఏప్రిల్ 28న కన్నుమూసాడు.
 
==మూలాలు==