దున్న ఇద్దాసు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
ఈయన క్రీ.శ. 1811 న నల్లగొండ జిల్లా, పెద్ద ఊర మండలం, చింతపల్లి గ్రామంలో దున్న రామయ్య- ఎల్లమ్మ దంపతులకు జన్మించాడు. ఈయన బాల్యంలో అందరిలాగే పెరిగాడు. చిన్నతనంలో పశువులు కాయటం, నాగలి దున్నటం, చెప్పులు కుట్టటం, వంటి పనులు చేసేవాడు.
==రచనలు==
<big>ఆరు చక్రములను దిరిగె,
 
ఆరు హంసల బందుజేసి,
 
మీది చక్రము మీద దిరిగె.</big>
 
==జీవిత విశేషాలు==
ఒకనాడు తన ఇంటి దగారి నుంచి ప్రతిదినం ముగ్గురు సాధువులు పోతుంటే గమనించి, వారిని అనుసరించాడు. ఆ సాధువులు తుంగతుర్తి లోని శివాలయంలో శివసంకీ ర్తనం చేయటం విని పరవశించినాడు. ఆనాటి నుండి సాధువుల వెంట వెళ్లి భక్తితో నామ సంకీర్తనం చేసి వచ్చేవాడు. ఒకనాడు ఆ సాధువులు ఈయనను గమనించి అతని భక్తికి మెచ్చి నోరు తెరిపించి నాలుకపై విభూతి రాసారు . ఆనాటి నుండి ఈయన హృదయంలో నిక్షిప్తంగా ఉన్న భక్తిబీజాలు వెలసినాయి.రోజు మోట తోలుతూసులువుగా తత్త్వగీతాలు ఆలపించేవాడు. మోట బొక్కెనలోనుంచి నీళ్లు వచ్చినట్లే ఇదన్న హృదయం నుండి తత్త్వగీతాలు వచ్చేవి. ఈయన తత్త్వాలు విన్న ఆ ప్రాంతపు ప్రసిద్ధ జంగమదేవర పూదోట బసవయ్య ఇదన్న హృదయ క్షేత్రం పక్వమైనట్లు గుర్తించి లింగధారణం చేయించి పంచాక్షరీ మంత్రం ఉపదేశించాడు. ఈయన శిష్యగణం ఎక్కువగా పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్ ప్రాంతాల్లో ఉన్నారు.
"https://te.wikipedia.org/wiki/దున్న_ఇద్దాసు" నుండి వెలికితీశారు