'''[[శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి]]''' (జననం: [[1866]] - మరణం: [[1960]]) ఆధునిక తెలుగు ఆస్థాన కవి.
వీరు [[పశ్చిమ గోదావరి]] జిల్లా దేవరపల్లిలోదేవరపల్లికి చెందిన [[ఎర్నగూడెం]] లో [[1866 ]] సంవత్సరంలో అక్టోబరు 29 వ తేదీనాడు (అక్షయ సం. ఆశ్వయుజ బహుళ షష్థీ సోమవారము) నాడు రాత్రిజాము గడిచిన పిదప పునర్వసు తృతీయ చరణమున ఎర్నగూడెం తాలూకా దేవరపల్లి గ్రామంలో వెలనాటి వైదిక [[బ్రాహ్మణులు|బ్రాహ్మణ]] వంశంమున వెంకట సుబ్బమ్మ వెంకట సోమయాజులను పుణ్యదంపతులకు పదుగురు [[పిల్లలు]] గతించిన పిదప వల్మీక ప్రాంతమున శ్రీకృష్ణారాధనము చేసిన ఆనంతరము జనించి, విషూచివలన రెండేళ్ళ ప్రాయమున అస్తమించి, శ్వశానవాటికలో పునర్జన్మ నంది, గర్భాష్థనము దాటినపిదప ఉపనయన దీక్షారాంభమందే శ్రౌతస్మార్తముల నెరంగి కావ్యపఠనము సాగించి, [[రఘువంశము|రఘువంశ]] పరిశీలనమందె సంస్కృత కవనపుజాడలు గ్రహించి, 16వయేట [[తెలుగు]] కవిత్వమును చెప్పనేర్చి, బహుళశ్లోకములందు స్వీయచరిత్రను వ్రాసి, తండ్రి యజ్ఞములో అధ్వర్యమును సలిపి, బాల్యమును కాటవరమున గడిపి, శ్రీ ఇవటూరి నాగలింగశాస్త్రి గారిని ఆశ్రయించి, శ్రీ మధిరసుబ్బన్న దీక్షితులను సహాధ్యాయముతో బహుళశాస్త్రాంశము లెరిగి, వాగ్దేవి నారాధించి శాస్త్రులుగారు దీర్ఘోపాసనకు పూనుకొనిరి.. వీరికి వేదవిద్యలో పాండిత్యం సంపాదించి గ్రాంథిక భాష మీద గౌరవంతో తన రచనలను కొనసాగించారు. వీరు సుమారు 200 పైగా [[గ్రంథాలు]] రచించారు. వానిలో [[నాటకాలు]], [[కావ్యాలు]], జీవిత చరిత్రలు మొదలైనవి ఉన్నాయి. వీరి కుమార్తె [[కల్లూరి విశాలాక్షమ్మ]] కూడా కవయిత్రి. ఈమె శతకాలు, కావ్యాలు 30కి పైగా వ్రాశారు.