వీరకంకణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
== కథ ==
మల్లె దేశపు మహారాజు వెంగళరాయ దేవుడు (రమణారెడ్డి) ఆ దేశానికి మంత్రి సత్యకీర్తి (కె.వి.ఎస్.శర్మ), రాజగురువు (గుమ్మడి)లపై ఆధారపడి పరిపాలన చేస్తుంటాడు. రాకుమారి రజని (కృష్ణకుమారి), మంత్రి కుమార్తె పార్వతి (జమున) స్నేహితులు. సేనాపతి వీరమోహన్ (ఎన్.టి.రామారావు). వీరమోహన్, రజని ప్రేమించుకుంటారు. వీరమోహన్ చేతిలో భంగపడిన రాజగురువు కుమారుడు చంద్రసేనుడు (జగ్గయ్య) రాజ్యం చివర కొండల్లో చేరి బందిపోటు దొంగతనాలు చేస్తూ అరాచకం సృష్టిస్తుంటాడు. రాకుమారిపై ఆశపడి, మంత్రి కుమారిని ప్రేమించినట్లు వంచిస్తాడు. సేనాని వీరమోహన్ చేతిలో బంధింపబడి, మరణశిక్షకు బలి అవుతున్న చంద్రసేనుని పార్వతి అబద్ధపు సాక్ష్యంతో రక్షిస్తుంది. వీరమోహన్ రాజ్యబహిష్కరణకు గురవుతాడు. రాకుమారి అతని వెంటే వెళుతుంది. చంద్రసేనుని పెళ్లాడిన పార్వతి, పెళ్లి తరువాత అతడు మారతాడని ఆశిస్తుంది. కాని చంద్రసేనుడు రజనిని బంధించి వశం చేసుకోబోగా, మారువేషంలో వెళ్లి అతన్ని ఎదిరించి, రాకుమారిని రక్షిస్తుంది. పార్వతిని అంతం చేయాలనుకుని, కుట్రతో చంద్రసేనుడు మలయ పర్వతాలకు తీసుకువెళతాడు. అతని, అతని తండ్రియొక్క కుట్రను తెలుసుకున్న పార్వతి, తెలివిగా చంద్రసేనుడి పర్వతంపైనుంచి త్రోసివేస్తుంది. రాకుమారి కోసం, అంతఃపురం ప్రవేశించి శిక్షకు గురవుతున్న వీరమోహన్‌ను విడిపించి మహారాజుకు సభాసదులకు చంద్రసేనుడు, రాజగురువుల కుట్రను వెల్లడిస్తుంది.
 
== పాటలు ==
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/వీరకంకణం" నుండి వెలికితీశారు