త్యాగరాజు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 3:
{{Indianclassicalmusic}}
'''[[శ్రీ]]త్యాగరాజుగారు '''(౧౭??-౧౮౪౮) కర్నాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు, వీరు గొప్ప రామ భక్తులు. వీరు ప్రస్తుత [[తమిళనాడు]] లోని [[తంజావూరు]] దగ్గరలోని [[తిరువయ్యూరు]] అను గ్రామం ([[అగ్రహారం]]) నందు [[తెలుగు]] [[వైదిక]] [[బ్రాహ్మణ]] కుటుంబంలో జన్మించినారు.
==జీవితము మరియు వీరి పనులు==
===చదువు (శిక్షణ) మరియు ప్రయోజనం===
త్యాగరాజుగారు వారి సంగీత శిక్షణను శ్రీయుతులు [[శొంఠి వెంకటరమనయ్య]] వారి దగ్గర, చాలా చిన్న వయసులోనే ప్రారంభించినారు. [[సంగీతం]]ను భగవంతుని ప్రేమను అనుభవించు మార్గముగా త్యాగరాజుగారు భావించినారు. సంగీతంలోని [[రాగ]] [[తాళ]] ములను వాటిపై తన ప్రావీణ్యాన్ని చూపించుకోవడానికి కాకుండ భగవంతుని నామాలను చెప్పడానికి, భగవంతుని లీలలను పొగడటానికి ఓ సాధనముగా మాత్రమే చూసినారు. [[దేవముని]] అయినా [[నారదు]]లవారే స్వయంగా వీరికి సంగీతంలోని రహశ్యాలను చెప్పి ఓ అద్భుతమైన పుస్తకం ఇచ్చినారు, ఆ సంధర్భంలోనే త్యాగరాజు గారు చెప్పిన కృతిగా [[పంచరత్న కృతులు | పంచరత్న కృతులలో]] మూడవదైన [[సాధించెనా]] అనునది అని చెపుతారు.
===వృత్తి===
పదమూడేండ్ల చిరుత ప్రాయమునాడే త్యాగరాజుగారు ''[[నమో నమో రాఘవా]]'' అను కీర్తనను [[దేశికతోడి]]లో స్వరపరచినారు. గురువుగారైన [[శోంఠి వేంకటరమణయ్య]]గారు తన శిష్యుని క్రొత్త ప్రతిభను గురించి విని [[తంజావూరు]]లోని తన ఇంతికి పిలిచి కచేరీ ఇవ్వమన్నారు, అప్పుడు స్వరపరచి పాడిన పాటే ''[[ఎందరో మహానుభావులు]]'', ఇది [[పంచరత్న కృతులలో]] ఐదవది.
ఈ పాటకు [[శోంఠి వెంకటరమణ]]గారు చాలా సంతోషించి, త్యాగరాజులోని బాలమేధావి గురించి [[తంజావూరు]] రాజుగారికి చెప్పగా రాజు సంతోషించి అనేక ధన కనక వస్తు వాహనాది రాజలాంచనాలతో త్యాగరాజును సభకు ఆహ్వానించినాడు. కానీ త్యాగరాజు ''[[నిధి చాల సుఖమా]]'' అను కీర్తన పాడి తనకు నిధి కన్నా రామ సన్నిధి మాత్రమే సుఖమని అంత సొమ్ములను నిర్మొహమాటంగా తిరస్కరించినాడు.
త్యాగరాజు యొక్క ఈ చర్య తో ఆగ్రహించిన వారి జ్యేష్ట (పెద్ద) సోదరుడు, త్యాగారాజు నిత్యం పూజించుకునే [[శ్రీ రామ]] పట్టాభిషేక విగ్రహాలను [[కావేరి]] నదిలో విసిరివేసినారు. [[శ్రీ రామ]] వియోగ బాదను తట్టుకోలేక, రాముడు లేని ఊరిలో ఉండలేక దక్షిణ భారతదేశ యాత్రలుకు వెళ్ళి అనేకానేక దేవాలయములను, తీర్దములను దర్శించి ఎన్నో అద్భుత కీర్తనలు రచించినారు. చివరగా [[శ్రీ రామ]]అనుగ్రహంతో విగ్రహాలను పొందుతారు. [[వైకుంఠ ఏకాదశి]]నాడు వీరు శ్రీరామ సన్నిధి చేరుకున్నారు.
===త్యాగరాజు ఆరాధనోత్సవాలు===
అసంఖ్యాకమైన కీర్తనలు రచించి, కర్నాటక సంగీతంలోని అన్ని నియమాలను సోదాహరణంగా నిరూపించి (?) శాశ్వతమైన కీర్తి సంపాదించిన త్యాగరాజుగారు కర్నాటసంగీతానికి మూలస్థంబంగా చెపుతారు. ప్రతి సంవత్సరం జనవరి నుండి ఫిబ్రవరి లలో [[తంజావూరు]] నందు [[త్యాగరాజు ఆరాధనోత్సవాలు]] నిర్వహిస్తారు.
===కీర్తనలు===
మచ్చుకు ఈ కీర్తనను చూడండి:
బలహరి రాగము - ఆది తాళము
దొరకునా ఇటువంటి సేవ ॥దొరకునా॥
దొరకునా తప మొనరించిన భూ
సురవరులకైన సురలకైన ॥దొరకునా॥
తుంబుర నారదులు సుగుణకీర్త
నంబుల నాలాపము సేయగా
అంబరీష ముఖ్యులు నామము సే
యగ జాజులపై చల్లగా
బింబాధరులగు సురవారయళి
వేణులు నాట్యములాడగా
అంబుజభవ పాకారు లిరుగడల
నన్వయ బిరుదావళిని బొగడగా
అంబరవాస సతులు కరకంక
ణంబులు ఘల్లని విసరగ మణిహా
రంబులు ఘల్లని విసరగ మణిహా
రంబులు గదలగ సూచే ఫణి త
ల్పంబున నెలకొన్న హరిని గనుగొన ॥దొరకునా॥
మరకతమణిసన్నిభ దేహంబున
మెఱుగు గనకచేలము శోభిల్ల
చరణయుగ నభావళికాంతులు
జందురు పిల్లలను గేర
వరనూపురము వెలుగంగ గతయుగమున
వజ్రపు భూషణములు మెఱయ
ఉదమున ముక్తాహారములు మఱియు
ఉచితమైన మకరకుండలంబులు
చిఱునవ్వులుగల వదనంబున ముం
గురు లద్దంపుగపోలము ముద్దు
గురియు దివ్యఫాలంబున దిలకము
మెఱసే భువిలావణ్యనిధిని గన
తామసగుణరహిత మునులకు బొగడ
దరముగాకనే భమసి నిల్వగ
శ్రీమత్కనకపు దొట్లపైని చెలు
వందగ గొలువుండగ
కామితఫలదాయకియౌ సీత
కాంతునిగని యుప్పొంగగ
రామబ్రహ్మ తనయుడౌ త్యాగ
రాజు తా బాడుచు నూచగ
రాముని జగదుద్దారుని సురరిపు
భీముని త్రిగుణాతీతుని బూర్ణ
కాముని చిన్మయరూపుని సద్గుణ
ధామని కనులార మదిని కనుగొన ॥దొరకునా॥
చూడండి
#[[తెలుగు]]
#[[సాహిత్యము]]
|