బ్రిటిష్ సామ్రాజ్యము భారతదేశమునుండి నిష్క్రమించేనాటి స్వదేశ సంస్థానాధీశుల నిర్ణయములు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
సవరణ,విస్తరణ |
|||
పంక్తి 2:
==స్వదేశ సంస్థానములు==
భారతదేశపు బ్రిటిష్ పరిపాలనాకాలములో (18-20 వ శతాబ్ద మధ్యకాలము) "ప్రిన్సిలీ స్టేట్సు" అనబడిన అనేక చిన్న పెద్ద రాజులు నవాబులు పరిపాలనక్రిందయున్నటువంటి రాజ్యములే స్వదేశ సంస్థానములు. వాటిని పరిపాలించు రాజులు, నవాబులు మొగల్ సామ్రాజ్యములో సామంతలుగనుండిన వారె. క్రీ.శ 1707 సంవత్సర మొగలాయి చక్రవర్తి [[ఔరంగజీబు]] మరణానంతరము తదుపరి చక్రవర్తులు బలహీనులైన పరిస్థితులలో మొగలాయి సామ్రాజ్యము విఛిన్నమై క్షీణించి అస్తమించప్రారంభించింది. అప్పటినుండి సామ్రాజ్యములోని సామంతరాజులు, నవాబులు స్వతంత్రులై వారి రాజ్యమును వారు రక్షణకలిపించుకొనలేని పరిస్థితులలో బ్రిటిష్ ప్రభుత్వముకంటే వేరే సార్వభౌముడు లేనందుననూ, వారి వారి అంతఃకలహములు, వారసత్వపు వైరములతో బ్రిటిష్ ప్రభుత్వమునాశ్రయించి సంధి వప్పందములు కుదుర్చుకొనుచుండుట వలన బ్రిటిష్ ప్రభుత్వము స్వలాభదృష్టితో అనేక రాజ్యతంత్రములు ప్రయేగించి రాజ్యాక్రమణలు చేసి తాము పరిపాలించు బ్రిటిష్ ఇండియాను క్రమేణ విస్తరించిరి. బ్రిటిష్ ప్రభుత్వముకు దాసోహమనిన రాజులు, నవాబులు లాగనే బ్రిటిష్ ప్రభుత్వపు కుటిల రాజకీయములు రాజ్యాక్రమణలకు వ్యతిరేకించి ప్రాణాలకు లెక్కసేయక పోరాడిన రాజులు నవాబులు కూడా భారతదేశ చరిత్రలో చిరస్మరణీయులే. బ్రిటిష్ సామ్రాజ్యము భారతదేశమున అస్తమించునాటికి అఖండ భారతదేశములో దాదాపుగా మూడవవంతు భూభాగము "ప్రిన్సిలీ స్టేట్సు"అనబడిన స్వదేశ సంస్థానాధీశుల క్రిందయుండెను. <ref name= “D.V.Siva Rao(1938)”> "The British Rule in India" దిగవల్లి వేంకట శివరావు(1938) ఆంధ్రగ్రంధాలయ ముద్రాక్షర శాల, బెజవాడ pp 18-56</ref> 1941 జనాభా లెఖ్కల ప్రకారము 39 కోట్ల మొత్తం భారతదేశపు జనాభాలో స్వదేశ సంస్థానములలోని జనాభా9కోట్లుగా నుండెనని 1947నాటికి స్వదేశ సంస్థానములు చిన్న-పెద్ద కలిపి 562 అనియు చరిత్రలో కనబడుచున్నది. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భారతదేశ స్వదేశ సంస్థానములను బుధ్దిపూర్వకముగనే బ్రిటిష్ సామ్రాజ్యములోని స్వతంత్రసంస్థానములుగ గుర్తించి రాజకీయములు చేసిరి. 1930-40 దశాబ్దములలో ప్రభాతము అను పత్రికలో [[దిగవల్లి వేంకట శివరావు]] గారివ్యాసములో స్వదేశ సంస్థానములు భారతదేశ రాజ్యాంగ సమశ్యగ చారిత్రక విశేషములు కొన్నివివరించిరి. అప్పటికి (1930-40 దశాబ్దములలో సంగతి) 662 సంస్థానములున్నవి. అందు 200 ఎంచతగినరాజ్యములు. అందులోను 9 ముఖ్యమైనవి. భౌగోళకముగనూ, జనాభాసంఖ్యని బట్టి అవరోహణంగా హైదరాబాదు, జమ్మూ-కశ్మీరము, మైసూరు, బరోడా, గ్వాలియర్, భోపాల్, బికనీరు, కొచ్చిను, తిరువాంకూరు. ఆ9 దింటిలో అతిపెద్దది హైదరాబాదు నిజాం రాజ్యము విస్తీర్ణములోను జనాభాసంఖ్యలోను అతిపెద్ద స్వదేశ సంస్థానము. [[ఆస్ట్రేలియా]] దేశ జనాభాకంటే ఎక్కువైనది. తరువాత జమ్మూ కశ్మీరము, . అంత పెద్ద సంస్థానములేగాక కొన్ని అతిచిన్నవి కొన్నియకరముల విస్తీర్ణము మాత్రము గల చాల చిన్న చిన్న సంస్థానములు గూడకలవు.
==స్వదేశ సంస్థానముల పై బ్రిటిష్ రాజ్యతంత్ర ప్రభావము==
పంక్తి 76:
== భారతడొమినియన్లో విలీనమగుటకు ఆసక్తిచూపి ఇతర సంస్థానధీశులను ప్రోత్సాహపరచిన సంస్థానాధీశులు==
స్వాభిమానులైన చాలమంది సంస్థానాధీశులకు బ్రిటిష్ వారి చెప్పుచేతలకింద యుండుట సంకటముగయుండినది. బ్రిటిష్ పరిపాలననుండి ముక్తిపొందిన తరువతా పరిపాలనాధికారములు వహించిన కాంగ్రెస్సు అధినేతలైన నెహ్రూ ప్రభృతులతో చాలమంది సంస్థానాధీశులు అప్పటికే విభేధములుగలిగియుండిన సంగతి పరిచితమైన చరిత్రాంశము. అయినప్పటికినీ భారతదేశమునుండి బ్రిటిష్ సామ్రాజ్యము నిష్క్రమించి దేశమునకు స్వాతంత్రము కలుగుట గొప్ప అవకాశముగా కొందరు సంస్థానాధీశులు చూడగలిగియుండిరి. స్వతంత్ర భారతదేశము తమకు, తమ కుటుంబ సభ్యులకు రాజకీయముగనేకాక, సాంఘిక, వాణిజ్యావకాశములు కలిపించగలదన్నముందుచూపు, పురోగమనదృష్టి కలిగినట్టి ప్రముఖులైన ఆరుగురు సంస్థానాధీశులు 1947 ఆగస్టు 9 తేదీన ఒక ప్రకటన చేసియుండెను. గ్వాలియర్ సంస్థానాధీశుడు మహారాజసిందియా, ఫరీద్ కోట, భగత్ సంస్థానముల రాజులిద్దరు, భరత్ పూరు , ఆల్వారు, పన్నా సంస్థానముల మహా రాజులు ముగ్గురు. వీరు ఆరుగురు కలసి ప్రకటనచేసి సాటిసంస్థానాదీశులను ఢిల్లీలో సమావేశ పరిచి స్వతంత్రభారతదేశమున కల సదవకాశములు వివిరించి భారత,పాకిస్తాన్ డొమినియన్లలో వారి వారి స్థానములను బట్టి విలంబనచేయక విలీనమగుటకంగీకారములు తెలుపమని ప్రోత్సహించియుండిరి.<ref name=“Barney(2017)”/>
|