యం.యస్.స్వామినాధన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: 2017 source edit |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 23:
}}
'''మొన్కొంబు సాంబశివన్ స్వామినాథన్ '''(జ.1925 ఆగస్టు 7) భారత వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యుశాస్త్ర నిపుణుడు. అతనిని భారతదేశంలో "[[హరిత విప్లవం|హరిత విప్లవ]] పితామహుడు" గా పేర్కొంటారు
1972 నుండి 1979 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థకు జనరల్ డైరక్టరుగా పనిచేసాడు. 1979 నుండి 1980 వరకు భారతదేశ వ్యవసాయ మంత్రిత్వశాఖకు ప్రధాన కార్యదర్శిగా పనిచేసాడు. అతను ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు 1982 నుండి 1988 వరకు డైరక్టరుజనరల్ గా తన సేవలనందించాడు. 1988లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్స్ సంస్థకు అధ్యక్షునిగా ఉన్నాడు.<ref>[http://www.time.com/time/asia/asia/magazine/1999/990823/index.html Asians of the Century: A Tale of Titans], TIME 100: 23–30 August 1999 VOL. 154 NO. 7/8</ref> 1999లో 20వ శతాబ్దంలో అత్యధికంగా ప్రభావితం చేసిన ఆసియా ప్రజల జాబితా "టైం 20" లో అతని పేరును టైమ్ మ్యాగజైన్ ప్రచురించింది.
== ప్రారంభ జీవితం, విద్య ==
పంక్తి 36:
== వృత్తి జీవితం ==
స్వామినాథన్ వ్యవసాయ శాస్త్రాలలో తన వృత్తిని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. అతను మద్రాసు వ్యవసాయ కళాశాల (ప్రస్తుతం తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం) లో చేరి అక్కడ వ్యవసాయ శాస్త్రంలో మరో బ్యాచిలర్స్ డిగ్రీని పొందాడు. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాన్ని అతను ఇలా చెప్పాడు: "నేను కేరళ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు నాకు వ్యక్తిగత ప్రేరణ '1974 నాటి బెంగాల్ కరువు' తో మొదలైంది. అప్పుడు తీవ్రమైన బియ్యం కొరత ఉంది. బెంగాల్ లో మూడు మిలియన్ల ప్రజలు ఆకలితో మరణించారు. నాతో పాటు అనేక మంది యువకులు గాంధీతో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. అపుడు వ్యవసాయ రైతులకు ఎక్కువ ఉత్పత్తి అందించాలనే థ్యేయంతో నేను వ్యవసాయ పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నాను"<ref>SGI Quarterly, A Buddhist forum for peace, culture and education [http://www.sgiquarterly.org/feature2009Jly-6.html/ "An Evergreen Revolution, Interview with M.S. Swaminathan"] Retrieved on 26 March 2013</ref>
స్వాతంత్ర్యానంతరం భారతదేశం ప్రజల అవసరాలకు సరిపడినంత ఆహారధాన్యాలను ఉత్పత్తి చేయలేని పరిస్థితుల్లో ఉంది. ఆకాలంలో నోబెల్ బహుమతి గ్రహీత [[నార్మన్ బోర్లాగ్]] సృష్టించిన మెక్సికన్ పొట్టి [[గోధుమ]] రకాలను మనదేశంలోకి ప్రవేశపెట్టారు. వీని ప్రభావంతో పరిశోధనలు సాగించి అధిక దిగుబడినిచ్చే గోధుమ రకాలను రూపొందించాడు. దీని వలన గోధుమ ఉత్పత్తి పెరిగింది.
స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం 1947లో అతను జన్యుశాస్త్రం, మొక్కల పెంపకం అంశాలలో పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థిగా న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు మారాడు. 1949లో అతను సైటోజెనెటిక్స్ (జీవకణ నిర్మాణం, విధులకు సంబంధించిన శాస్త్రం) లో డిస్టింక్షన్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందాడు. అతను యూనియన్ పబ్లిక్ సర్వీసు కమీషన్ పరీక్ష రాసి "ఇండియన్ పోలీసు సర్వీసు" కు ఎంపికయ్యాడు.<ref>996 CURRENT SCIENCE, VOL. 101, NO. 8, 25 October 2011 [http://www.currentscience.ac.in/Volumes/101/08/0996.pdf/ "IN CONVERSATION M. S. Swaminathan" Retrieved on 26 March 2013] {{dead link|date=January 2018|bot=InternetArchiveBot|fix-attempted=yes}}</ref> అతను నెదర్లాండ్స్ లోని వాగెనేంజెన్ అగ్రికల్చర్ యూనివర్శిటీ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ విభాగంలో బంగాళా దుంపల జన్యువులపై తన ఐ.ఎ.ఆర్.ఐ పరిశోధనను కొనసాగించడానికోసం యునెస్కో ఫెలోషిప్ ను అంగీకరించాడు. సోలానమ్ యొక్క విస్తృతమైన అడవి జాతుల నుండి సాగు బంగాళాదుంప (సోలనమ్ ట్యుబరేసం) కు జన్యువులను బదిలీ చేయడానికి కావలసిన విధానాలను ప్రామాణీకరించడంలో అతను విజయం సాధించాడు. 1950లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్లాంట్ బ్రీడింగ్ ఇనిస్టిట్యూట్ లో చదవడానికి వళ్ళాడు. అతను రాసిన "స్పెసీస్ డిఫెరెన్సియేషన్, అండ్ ద నేచుర్ ఆఫ్ పోలీఫ్లోడీ ఇన్ సెర్టయిన్ స్పెసీస్ ఆహ్ ద జెనస్ సోలానం - సెక్షన్ టుబెరారియం" అంశంపై 1952 లో పి.హెచ్.డి డిగ్రీని పొందాడు. 2014లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ఫెలోషిప్ పొందాడు. <ref>[https://web.archive.org/web/20141209123426/http://www.fitz.cam.ac.uk/about/newsitem-4-237 Professor M S Swaminathan is new Honorary Fellow]. Fitzwilliam College. 28 November 2014.</ref>
|