తెలంగాణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 95:
[[File:Andhra Pradesh and Telangana Physical.jpeg|thumb|తెలంగాణ భౌతిక పటము]]
[[దస్త్రం:Telangana NHs Pic.png|thumb|170px|left|<center>తెలంగాణా జాతీయ రహదారులు</center>]]
తెలంగాణ రాష్ట్రం [[దక్కను పీఠభూమి]]లో భాగంగా, [[తూర్పు కనుమల]]కు పశ్చిమంగా ఉంది. ఈ ప్రాంతము సరాసరిన సముద్రమట్టం నుంచి 1500 అడుగుల ఎత్తును కలిగియుండి ఆగ్నేయానికి వాలి ఉంది. ఈ రాష్ట్రపు దక్షిణ భాగంలో ప్రధానముగా [[కృష్ణానది|కృష్ణా]], [[తుంగభద్ర నది|తుంగభద్ర]] నదులు ప్రవహిస్తుండగా, ఉత్తర భాగంలో [[గోదావరి నది]] ప్రవహిస్తున్నది. [[కృష్ణా నది|కృష్ణా]], [[తుంగభద్ర]] నదులు దక్షిణమున ఈ రాష్ట్రాన్ని [[ఆంధ్రప్రదేశ్‌]]లోని రాయలసీమ నుంచి వేరుచేస్తున్నవి. ఈ రాష్ట్ర విస్తీర్ణం 1,14,840 చదరపు కిలోమీటర్లు. తెలంగాణలో భౌగోళికంగా [[మహబూబ్ నగర్ జిల్లా]] పెద్దది కాగా, [[హైదరాబాదు]] చిన్నది. తెలంగాణకు సముద్రతీరం లేదు. ఈ రాష్ట్రం [[కృష్ణా]] మరియు [[గోదావరి]] నదుల పరీవాహక ప్రాంతంలోకి వస్తుంది.
[[దస్త్రం:Rivers in Telangana.png|thumb|170px|right|<center>తెలంగాణా నదులు</center>]]
'''నదులు:''' [[గోదావరి]], [[కృష్ణా నది|కృష్ణా]] నదులతో సహా పలు నదులు తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి. [[గోదావరి]] నది [[ఆదిలాబాదు]], [[నిజామాబాదు]], [[కరీంనగర్]], [[వరంగల్]], [[ఖమ్మం]] జిల్లాల సరిహద్దుల గుండా ప్రవహిస్తుంది. [[కృష్ణా నది]] [[మహబూబ్‌నగర్]], [[నల్గొండ]] జిల్లాల దక్షిణ భాగం నుంచి ప్రవహిస్తుంది. [[తుంగభద్రనది]] [[మహబూబ్‌నగర్]] జిల్లా దక్షిణ సరిహద్దు గుండా ప్రవహిస్తూ కృష్ణానదిలో సంగమిస్తుంది. [[భీమానది]] [[మహబూబ్‌నగర్ జిల్లా]]లో కొంత దూరం ప్రవహించి కృష్ణాలో సంగమిస్తుంది. [[దుందుభి నది]] మహబూబ్‌నగర్ మరియు నల్గొండ జిల్లాలలో ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. [[ప్రాణహిత నది]] [[ఆదిలాబాదు]] జిల్లా సరిహద్దు గుండా ప్రవహించి గోదావరిలో సంగమిస్తుంది. [[మూసీనది]] రంగారెడ్డి, హైదరాబాదు మరియు నల్గొండ జిల్లాలలో ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. [[పాలేరు నది]] [[నల్గొండ]], [[ఖమ్మం]] జిల్లాల సరిహద్దు గుండా ప్రవహించి కృష్ణాలో విలీనమౌతుంది. [[కాగ్నా నది]] రంగారెడ్డి జిల్లాలో పశ్చిమ దిశగా ప్రవహించి [[కర్ణాటక]]లో కృష్ణాలో సంగమిస్తుంది. [[మంజీరా నది]] [[మెదక్]], [[నిజామాబాదు]] జిల్లాలలో ప్రవహించి [[గోదావరి]]లో కలుస్తుంది.
 
'''''అడవులు''''': [[ఆదిలాబాదు]], [[ఖమ్మం]], [[వరంగల్]] జిల్లాలలోఅడవులు అధికంగా ఉన్నాయి. [[మహబూబ్‌నగర్]] జిల్లా అగ్నేయప్రాంతం మరియు [[నల్గొండ]] జిల్లా నైరుతి ప్రాంతంలో విస్తరించియున్న అమ్రాబాదు [[పులుల అభయారణ్యం]] దేశంలోనే పెద్దది.<ref>నమస్తే తెలంగాణ దినపత్రిక, తేది 26-10-2014</ref> [[మెదక్]], [[నిజామాబాదు]] జిల్లాలలో, నల్గొండ ఆగ్నేయ భాగంలోని దేవరకొండ డివిజన్‌లో కూడా అడవులు ఉన్నాయి. [[నల్లమల]] అటవీ రక్షిత ప్రాంతం, [[మంజీరా అభయారణ్యం]], [[కిన్నెరసాని అభయారణ్యం]], [[కవ్వాల్ అభయారణ్యం]] ఈ ప్రాంతంలోని ప్రముఖ రక్షిత అరణ్యాలు.
పంక్తి 105:
ఈ రాష్ట్రంలో [[ఆదిలాబాదు జిల్లా]] ఉత్తరాన ఉండగా పశ్చిమ సరిహద్దులో [[ఆదిలాబాదు]]తో పాటు [[నిజామాబాదు]], [[మెదక్]], [[రంగారెడ్డి]], [[మహబూబ్ నగర్]] జిల్లాలు ఉన్నాయి. ఈశాన్య సరిహద్దులో [[కరీంనగర్]], [[వరంగల్]] మరియు [[ఖమ్మం]] జిల్లాలు ఉన్నాయి. దక్షిణమున [[మహబూబ్ నగర్ జిల్లా]], ఆగ్నేయమున [[నల్గొండ]] జిల్లా సరిహద్దుగా ఉంది. [[ఖమ్మం]] జిల్లా తెలంగాణకు అతి తూర్పున ఉన్న జిల్లాగా పేరుగాంచింది. తెలంగాణ రాష్ట్రపు భౌగోళిక సరిహద్దు లేని ఏకైక జిల్లా [[హైదరాబాదు]].
 
[[కర్ణాటక]] సరిహద్దుగా 3 జిల్లాలు, [[మహారాష్ట్ర]] సరిహద్దుగా 3 జిల్లాలు, [[ఛత్తీస్‌గఢ్|ఛత్తీస్‌ఘఢ్]] సరిహద్దుగా 2 జిల్లాలు, [[ఆంధ్రప్రదేశ్]] సరిహద్దుగా 3 జిల్లాలు ఉన్నాయి.
 
== చరిత్ర ==
పంక్తి 113:
<big>'''మౌర్యుల కాలం''':</big>మౌర్యుల కాలంలో ఈ ప్రాంతం భాగంగా ఉండేదనడానికి అశోకుని 13వ శిలాశాసనం ఆధారంగా చరిత్రకారులు నిర్ణయించారు. మౌర్యుల కాలంలో పర్యటించిన విదేశీ యాత్రికుడు [[మెగస్తనీసు]] ఆంధ్రులకు 30 దుర్గాలున్నాయని పేర్కొనగా అందులో కదంబపూర్ ([[కరీంనగర్]]), పౌదన్యపురం (బోధన్), పిధుండ, ముషిక, [[ధూళికట్ట]], [[పెద్దబొంకూర్]], [[ఫణిగిరి]], [[కొండాపురం]], [[కోటిలింగాల]], గాజులబండ ముఖ్యమైనది.<ref>ఆంధ్రుల చరిత్ర, బి.ఎస్.ఎల్.హన్మంతరావు, పేజీ 52</ref> ఇవన్నీ నేటి తెలంగాణ రాష్ట్రంలోనివే. ఇంకనూ బయటపడాల్సిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి.<ref>ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర, [[ఏటుకూరి బలరామమూర్తి]], పేజీ 17</ref> [[మెగస్తనీసు]] ఎంతో బలవంతమైనదిగా వర్ణించిన ఆంధ్రరాజ్యం బహుశా ములక అస్సక లేదా ప్రతిష్ఠాన రాజ్యమే అయి ఉంటుందని ప్రముఖ చరిత్రకారుడు బి.ఎస్.ఎల్.హనుమంతరావు పేర్కొన్నారు.<ref>తెలంగాణ చరిత్ర, రచన:సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 37</ref>
 
<big>'''శాతవాహనుల కాలం''':</big>[[శాతవాహనులు|శాతవాహనుల]] కాలంలో [[కోటిలింగాల]] ఒక వెలుగు వెలిగిన ప్రాంతం. శాతవాహనుల తొలి రాజధాని కూడా ఇదే. అయితే కొన్ని దశాబ్దాల వరకు కూడా ప్రతిష్ఠానపురం మరియు ధరణికోటనే తొలి రాజధానిగా పరిగణించారు. శాతవాహనులకు సంబంధించిన పలు నాణేలు కోటిలింగాల మరియు దాని పరిసరాలలో లభ్యమయ్యాయి. కాబట్టి [[శాతవాహనులు|శాతవాహనుల]] తొలి కేంద్రస్థానం [[గోదావరి]] తీరంలోని తెలంగాణ ప్రాంతమేనని పరిశోధకులు నిర్ణయించారు.<ref>తెలంగాణ చారిత్రక భౌగోళం, జి.రాంబాబు, పేజి 102</ref> శాతవాహనుల అనంతరం తెలంగాణ ప్రాంతం మొత్తం కలిపి పాలించిన రాజ్యాలులేవు. [[విజయపురి]] కేంద్రంగా పాలించిన ఇక్ష్వాకుల రాజ్యంలో తెలంగాణ తూర్పు ప్రాంతాలు భాగంగా ఉండేవి. ఇదే కాలంలో ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని వాకాటకులు పాలించారు. వాకాటక రాజు ప్రవరసేనుడి కాలంలో మొత్తం తెలంగాణ ప్రాంతం వాకాటక రాజ్యంలో కలిసిపోయింది. ఇక్ష్వాకులకు సామంతులుగా ఉన్న విష్ణుకుండినులు కూడా ఇక్ష్వాకుల తర్వాత స్వతంత్రంగా ఏర్పడి రాజ్యపాలన చేశారు. ఈ విష్ణుకుండినుల జన్మభూమి తెలంగాణయేనని ప్రసిద్ధ చరిత్రకారుడు బి.ఎన్.శాస్త్రి పరిశోధనల ద్వారా నిరూపించాడు.<ref>తెలంగాణ చరిత్ర, రచన: సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 69</ref> ఇంద్రపాలనగరంలోని అమరేశ్వర, రామేశ్వర, మల్లికార్జున ఆలయాలు, కీసరలోని రామలింగేశ్వర, షాద్‌నగర్ సమీపంలోని రామలింగేశ్వర ఆలయాలు విష్ణుకుండినుల కాలం నాటివి.
 
[[దస్త్రం:AlampurinTelangana.png|thumb|left|170px|<center>ఆలంపూర్‌లో బాదామి చాళుక్యుల నిర్మించిన దేవాలయాలు</center>]]
పంక్తి 136:
<big>కుతుబ్‌షాహీల కాలం</big>: క్రీ.శ.1565లో విజయనగర సామ్రాజ్యం అంతం కాగా, దక్షిణ తెలంగాణ ప్రాంతం కుతుబ్‌షాహీల పాలనలోకి వచ్చింది. ఉత్తర ప్రాంతంలో అంతకు క్రితమే బహమనీలు పాలించారు. బహమనీ సామ్రాజ్యం ఐదు ముక్కలు అయిన పిదప గోల్కొండ ప్రాంతాన్ని కుతుబ్‌షాహీలు రాజ్యమేలారు. కుతుబ్‌షాహీల ఉచ్ఛదశలో కూడా కృష్ణానదికి దక్షిణాన ఉన్న తెలంగాణ ప్రాంతం (రాయచూర్ డోబ్‌లోని నడిగడ్డ ప్రాంతం) ఆదిల్‌షాహీల పాలన కిందకు ఉండేది. అయితే ఇది తరచుగా చేతులు మారింది. 1687లో ఈ ప్రాంతం మొఘలుల వశమైంది.
 
<big>'''ఆసఫ్‌జాహీల కాలం''':</big> క్రీ.శ.1724 నుంచి తెలంగాణ ప్రాంతాన్ని ఆసఫ్‌జాహీలు పాలించారు. రాజభాషగా పర్షియన్ స్థానంలో [[ఉర్దూ భాష|ఉర్దూ]] ప్రవేశపెట్టారు.<ref>తెలంగాణ చరిత్ర, రచన: సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 196</ref> స్థానిక ప్రజలను అణకద్రొక్కి ఢిల్లీనుంచి ఉద్యోగస్తులను రప్పించడంతో ముల్కీ ఉద్యమం తలెత్తింది. క్రమక్రమంగా ప్రజలలో తలెత్తిన స్వేచ్ఛా భావనలతో 20వ శతాబ్ది ప్రారంభం నుంచి పలు రచయితల మూలంగా ప్రజలలో చైతన్యం వచ్చింది. [[సురవరం ప్రతాపరెడ్డి]] 1925లో [[గోల్కొండగోలకొండ పత్రిక|గోల్కొండ పత్రికను]]ను స్థాపించడం, 1930 నుంచి నిజాం రాష్ట్ర ఆంధ్రమహాసభలు జరగడంతో ప్రజలలో చైతన్యం అధికమైంది. సురవరంతో పాటు [[బూర్గుల రామకృష్ణారావు]], [[పులిజాల వెంకటరావు]], [[కొండా వెంకట రంగారెడ్డి]], [[మాడపాటి హనుమంతరావు|మాడపాటి హన్మంతరావు]], [[మందుముల నరసింగరావు]], [[రావి నారాయణరెడ్డి]], [[జమలాపురం కేశవరావు]] తదితరులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు.
{{main|తెలంగాణ విమోచనోద్యమం}}
 
[[దస్త్రం:Mahabubnagar Toorpu Kaman.JPG|thumb|left|170px|<center>పాలమూరు పట్టణంలో విమోచనోద్యమానికి గుర్తుగా ఉన్న తూర్పుకమాన్</center>]]
<big>'''తెలంగాణ విమోచనోద్యమం''':</big> [[1947]], [[ఆగస్టు 15]]న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినను తెలంగాణ ప్రాంతం నిజాం పరిపాలనలోని హైదరాబాదు సంస్థానంలో భాగంగా ఉండేది. తరువాత పోలీసు చర్య ద్వారా [[1948]], [[సెప్టెంబరు 17]]ఇది భారతదేశంలో కలపబడింది. ఈ పోరాటంలో ([[తెలంగాణ విమోచనోద్యమం]], [[తెలంగాణా సాయుధ పోరాటం]]) నాటి [[రజాకార్లు|రజాకార్ల]] దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ముఖ్య భూమిక పోషించింది. 1948 నుంచి హైదరాబాదు రాష్ట్రంగా కొనసాగింది. వెల్లోడి మరియు బూర్గుల రామకృష్ణారావు ఈ కాలంలో ముఖ్యమంత్రులుగావ్యవహరించారు.
 
<big>'''1956 తర్వాత:'''</big> [[1956]]లో భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్విభజన జరుగగా హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు మరియు ఆంధ్రరాష్ట్రం కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడింది. వరంగల్లు నుండి కొంత ప్రాంతాన్నీ, గోదావరి జిల్లాలనుండి భద్రాచలం, దండకారణ్యం ప్రాంతాలకు వేరు చేసి ఖమ్మం రాజధానిగా ఖమ్మం జిల్లాను ఏర్పరచారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కొన్నాళ్ళకే మళ్ళీ వేర్పాటు ఉద్యమాలు తలెత్తాయి. 1969లో [[మర్రి చెన్నారెడ్డి]] నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతరూపం దాల్చింది. అప్పుడు ప్రత్యేక తెలంగాణ నేపథ్యంలో ఏర్పడిన [[తెలంగాణ ప్రజా సమితి]] పార్టీ 1971లో 11 లోకసభ స్థానలలో విజయం సాధించింది. 1979లో హైదరాబాదు జిల్లా గ్రామీణ ప్రాంతాన్ని వేరుచేసి రంగారెడ్డి జిల్లా ఏర్పాటుచేశారు. [[2001]], [[ఏప్రిల్ 27]]న కె.చంద్రశేఖర్ రావు ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీని ఏర్పాటు చేశారు. 2011 నుంచి తెలంగాణ ఉద్యమ నాయకత్వం "ఐక్య కార్యాచరణ సమితి" చేతుల్లోకి వెళ్ళడంతో విద్యార్థులు, ఉద్యోగసంఘాలు చురుకుగా పాల్గొన్నారు. 2010లో తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటిని నియమించగా ఆ కమిటి 6 ప్రతిపాదనలు చేసింది. తెలంగాణ అంతటా ఉద్యోగులు, కార్మికులు 2011లో 42 రోజుల సమ్మె చేశారు. 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేయగా, 2013 [[అక్టోబరు]] 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. 2014 జూన్ 2నాడు దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది.
పంక్తి 146:
==తెలంగాణ పర్యాటక ప్రదేశాలు==
[[ఫైలు:Pillalamarry 05.JPG|thumb|right|180px|<center>పిల్లల మర్రి వృక్షం</center>]]
తెలంగాణ రాష్ట్రంలో చారిత్రక, అధ్యాత్మిక, సాంస్కృతిక తదితర పర్యాటక ప్రాంతాలకు కొదువలేదు. [[ఆలంపూర్|ఆలంపూర్‌లో]] [[అష్టాదశ శక్తిపీఠం]], [[బాసర]]లో జ్ఞానసరస్వతి దేవాలయం, [[భద్రాచలం]]లో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం, [[యాదగిరి గుట్ట]]లో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, [[వేములవాడ]]లో శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం, నిజామాబాద్ నగరంలోని [[నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం]], నిజామాబాద్ [[సారంగపూర్ హనుమాన్ మందిరం]] (ఇది చత్రపతి శివాజి గురువైన సమర్థ రామదాసు నిర్మించినది), ఆర్మూర్ [[సిద్దులగుట్ట]], నిజామాబాద్ ఖిల్లా[[రఘునాధ ఆలయం]] (ఇది చత్రపతి శివాజి గురువైన సమర్థ రామదాసు నిర్మించినది), డిచ్ పల్లి [[ఖిల్లా రామాలయం]], ( కేస్లాపూర్‌లో నాగోబా దేవాలయం, సిరిచెల్మలో సోమేశ్వరాలయం, [[జైనథ్|జైనాథ్‌లో]] పల్లవుల కాలం నాటి ఆలయం, [[గంగాపూర్ (జడ్చర్ల)|గంగాపూర్‌లో]] కళ్యాణి చాళుక్యుల కాలం నాటి చెన్నకేశ్వస్వామి ఆలయం, కదిలిలో పాపహరేశ్వరాలయం, ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం,<ref>మాతల్లి గోదావరి (తితిదే ప్రచురణ)</ref> [[కొండగట్టు]]లో ఆంజనేయస్వామి ఆలయం, [[కాళేశ్వరం]]లో [[కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం]], [[అచ్చంపేట]] సమీపంలో ఉమామహేశ్వర ఆలయం, [[నారాయణపేట]] సమీపంలో ఔదుంబరేశ్వరాలయం, సిర్సనగండ్లలో సీతారామాలయం, [[మన్యంకొండ]]లో [[శ్రీవెంకటేశ్వరాలయం]], మామిళ్ళపల్లిలో నృసింహక్షేత్రం, [[బీచుపల్లి]]లో పురాతనమైన ఆంజనేయస్వామి ఆలయం<ref>ఆంధ్రప్రదేశ్ దర్శిని, పేజీ136</ref><ref>నా దక్షిణ భారత యాత్రావిశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 246</ref>, మెదక్‌లో పెద్ద చర్చి, ఏడుపాయలలో భావాని మందిరం, కొత్లాపూర్‌లో ఎల్లమ్మ ఆలయం, ఝురాసంగంలో కేతకీ ఆలయం, కొల్చారంలో జైనమందిరం, నాచగిరిలోనృసింహాలయం, బొంతపల్లిలో వీరభద్ర ఆలయం, వరంగల్‌లో వేయిస్తంభాల ఆలయం, భద్రకాళి ఆలయం, నిజామాబాద్ జిల్ల లింబాద్రిగుట్టపై లక్ష్మీనృసింహస్వామి ఆలయం, బోధన్ ఏకచక్రేశ్వర ఆలయం, [[తాండూరు]]లో భద్రేశ్వరస్వామి ఆలయం, అనంతగిరిలో [[పద్మనాభస్వామి ఆలయం]], [[కీసర]]లో రామలింగేశ్వరస్వామి ఆలయం, చేవెళ్ళలో వెంకటేశ్వరస్వామి ఆలయం, [[చిలుకూరు బాలాజీ దేవాలయం|చిలుకూరు]]లో బాలాజీ ఆలయం, [[పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయం|పాంబండ]]లో రామాయణం కాలం నాటి శివాలయం, దామగుండంలో రామలింగేశ్వరాలయం, [[పాలంపేట]]లో [[రామప్ప దేవాలయము|రామప్పదేవాలయం]], [[కొమురవెల్లి]]లో [[మల్లికార్జునస్వామి ఆలయం]], మేడారంలో సమ్మక్క-సారక్క గద్దె ఉన్నాయి.వరంగల్ జిల్లా మేడారానికి 20 కిలోమీటర్ దూరంలో బ్రిటిష్ కాలానికి చెందిన అద్భుతమైన మరో ప్రకృతి వనం అందులోనూ కొలకత్తా [[హౌరా బ్రిడ్జి]] నమూనా రెండు వేరు వేరు దీవులను ఏకం చేస్తూ కట్టిన మరో అద్భుతం లక్నవరపు సరస్సు.
 
[[File:Ramojifilmcity hyderabad.jpg|left|thumb|180px|<center>రామోజీ పిల్మ్ సిటి</center>]]
ఆదిలాబాదు జిల్లాలో ఎత్తయిన [[కుంటాల జలపాతం]], [[పొచ్చెర జలపాతం]], కవ్వాల్ అభయారణ్యం, బత్తీస్‌ఘఢ్ కోట, [[హైదరాబాదు]]లో [[బిర్లా మందిరం, హైదరాబాదు|బిర్లామందిరం]], బిర్లా ప్లానెటోరియం, [[చార్మినార్]], [[గోల్కొండ కోట]], [[నెహ్రూ జంతుప్రదర్శనశాల|నెహ్రూ జూపార్క్]], [[రామోజీ ఫిల్మ్ సిటీ|రామోజీ ఫిలిం సిటి]], [[సాలార్జంగ్ మ్యూజియం]], చౌమహల్లా ప్యాలెస్, లుంబినీ పార్క్, ఎన్టీయార్ గార్డెన్, సంఘీనగర్ వెంకటేశ్వరాలయం, కరీంనగర్ జిల్లాలో జగిత్యాల ఖిల్లా, [[ఎలగందల్ ఖిల్లా|ఎలగందల్]], [[రామగిరిఖిల్లా]], ఖమ్మం జిల్లాలో రామాయణం కాలం నాటి పర్ణశాల, పాపికొండలు, [[కిన్నెరసాని అభయారణ్యం]], నేలకొండపల్లి బౌద్ధస్తూపం, ఖమ్మం ఖిల్లా, పాలమూరు జిల్లాలో [[పిల్లలమర్రి (వృక్షం)|పిల్లలమర్రి వృక్షం]], [[గద్వాల కోట]], [[ఘనపురం ఖిల్లా|ఖిల్లాఘనపురం కోట]], [[అంకాళమ్మ కోట]], [[కోయిలకొండ]] కోట, [[పానగల్ కోట]], [[ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు]], వరహాబాదు వ్యూపాయింట్, [[మల్లెలతీర్థం]], నల్గొండ జిల్లాలో [[నాగార్జునసాగర్ ప్రాజెక్టు]], [[భువనగిరి కోట]], దేవరకొండ దుర్గం, నిజామాబాదు జిల్లాలో [[శ్రీరాంసాగర్ ప్రాజెక్టు]], అలీసాగర్ ప్రాజెక్టు, దోమకొండ కోట,[[నిజాంసాగర్ ప్రాజెక్టు]], నిజామాబాద్ [[కందకుర్తి త్రివేణి సంగమం (గోదావరి, మంజీరా, హరిద్రా నదులు కలిసే స్థలం)]] మరియు రాస్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకుడు [[శ్రీ కేశవరావ్ హెగ్డేవార్]] జన్మస్థలం, [[రంగారెడ్డి జిల్లా]]లో అనంతగిరి కొండలు, [[కోట్‌పల్లి ప్రాజెక్టు]], గండిపేట, [[శామీర్‌పేట చెరువు]], వరంగల్ జిల్లాలో [[ఓరుగల్లు కోట]], [[పాకాల చెరువు]], మెదక్ జిల్లాలో మెదక్ ఖిల్లా, [[పోచారం అభయారణ్యం]], [[మంజీరా అభయారణ్యం]], [[కొండాపూర్ మ్యూజియం]], తదితర పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.
 
==ఆర్థిక పరిస్థితి==
పంక్తి 163:
<big>'''విద్యుత్ కేంద్రాలు'''</big>: 1921లో హుస్సేన్‌సాహర్ విద్యుత్ కేంద్రం స్థాపించబడింది. 1930లో [[నిజాంసాగర్ జలవిద్యుత్ కేంద్రం]] స్థాపితమైంది. 1956లో [[నాగార్జున సాగర్]] నిర్మించిన పిదప విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. 1983లో [[శ్రీరాంసాగర్ ప్రాజెక్టు]] జలాశయానికి ప్రాజెక్టుగా మార్చి జలవిద్యుత్ కేంద్రంగా మార్చారు. 2011లో ప్రియదర్శినీ జూరాలా ప్రాజెక్టులో కూడా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. [[కొత్తగూడెం]]లో [[థర్మల్ విద్యుత్ కేంద్రం]] ఉంది. గట్టు ప్రాంతంలో భారీ సౌరవిద్యుత్ కేంద్రం స్థాపించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
 
<big>'''వ్యవసాయం'''</big>: ప్రాచీన కాలంలో ముఖ్యంగా [[కాకతీయులు|కాకతీయుల]] కాలంలో తెలంగాణ ప్రాంతం వ్యవసాయికంగా బాగా అభివృద్ధి చెందింది. వ్యవసాయాభివృద్ధి కోసం కాకతీయులు నిర్మించిన పలుచెరువులు నేటికీ కనిపిస్తున్నాయి. రెండొబేతరాజు కేసరి సముద్రం నిర్మించగా, [[గణపతి దేవుడు|గణపతిదేవుడు]] దేశం (తెలంగాణ) నలుమూలలా పలు భారీ చెరువులను నిర్మించాడు. గణపతిదేవుడి సేనాని [[రేచర్ల రుద్రుడు]] ప్రఖ్యాతిగాంచిన [[రామప్ప చెరువు]]ను త్రవ్వించాడు. తెలంగాణ ప్రాంతంలో సువాసనలువెదజల్లే బియ్యం పండుతున్నట్లు అప్పట్లోనే సాహితీవేత్తలు పేర్కొన్నారు.<ref>తెలంగాణ చరిత్ర, రచన-సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, పేజీ 133</ref> కుతుబ్‌షాహీ, ఆసఫ్‌జాహీల కాలంలో కూడా ఈ ప్రాంతం వ్యవసాయంలో పేరుగాంచింది. 1914లో వ్యవసాయాభివృద్ధి కోసం సహకార వ్యవస్థను ఏర్పాటుచేశారు. [[నిజాంసాగర్]] (1935)జలాశయం, [[అలీసాగర్]], [[ఉస్మాన్ సాగర్]], [[హిమాయత్ సాగర్]], [[గండిపేట చెరువు]]ల నిర్మాణం జరిగింది. [[నిజామాబాద్ జిల్లా]] [[రుద్రూర్]]లో ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధనా స్థానము (1935) ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం [[మహబూబ్‌నగర్ జిల్లా]]లో వరి, [[జొన్నలు]], కందులు, [[ఆదిలాబాదు జిల్లా]]లో ప్రత్తి, [[నిజామాబాదు జిల్లా]]లో వరి, చెరుకు, మొక్కజొన్న, [[కరీంనగర్ జిల్లా]]లో వరి, ప్రత్తి, [[మెదక్ జిల్లా]]లో [[వరి]], [[మొక్కజొన్న]], [[వరంగల్ జిల్లా]]లో ప్రత్తి, వరి, [[నల్గొండ జిల్లా]]లో వరి, [[ప్రత్తి]], [[రంగారెడ్డి జిల్లా]]లో [[వరి]], కందులు అధికంగా పండుతాయి.
 
పంక్తి 180:
==తెలంగాణ ప్రముఖులు==
[[దస్త్రం:Kodandaram inTelangana.png|right|160px|thumb|<center>[[కోదండరాం]]</center>]]
హైదరాబాదు సంఘసంస్కర్తగా పేరుపొందిన [[భాగ్యరెడ్డివర్మ]], తొలి తెలుగు రామాయణం [[రంగనాథ రామాయణం]] రచించిన [[గోన బుద్దారెడ్డి]],<ref>పాలమూరు సాహితీ వైభవము, ఆచార్య ఎస్వీ రామారావు, 2010 ప్రచురణ,</ref> సహజకవి [[బమ్మెరపోతన]], దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత [[పైడి జైరాజ్]], ప్రముఖ కవి, విమోచనోద్యమకారుడు [[దాశరథి రంగాచార్యులు]], కవయిత్రి [[సరోజినీ నాయుడు]], కవి పండితుడు [[వానమామలై వరదాచార్యులు]], ఒగ్గు కథకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన [[మిద్దె రాములు]], ప్రముఖ విమోచనోద్యమకారుడు, నిజాంపైబాంబులు విసిరిన [[నారాయణరావు పవార్]], ప్రముఖ చిత్రకళాకారుడు [[కొండపల్లి శేషగిరి రావు]], ప్రముఖ తెలంగాణవాది, మాజీ మంత్రి [[కొండా లక్ష్మణ్ బాపూజీ]], ప్రముఖ సాహితీవేత్త [[జువ్వాడి గౌతంరావు]], సుమతీ శతక కర్త [[బద్దెన]], తొలి తెలుగు పురాణ అనువాదకుడు, మార్కండేయ పురాణం రచించిన [[మారన]], భూమి కోసం, భుక్తి కోసం సాయుధపోరాటం చేసిన [[దొడ్డి కొమరయ్య]], ప్రముఖ సాహితీవేత్త [[దేవులపల్లి రామానుజరావు]], తెలంగాణ కాటన్‌గా ప్రసిద్ధి చెందిన [[నవాబ్ అలీ నవాబ్‌జంగ్ బహదూర్]], ప్రధానమంత్రిగా పనిచేసిన [[పి.వి.నరసింహరావు]], ప్రముఖ సంకీర్తనాచార్యుడు [[ముష్టిపల్లి వేంకటభూపాలుడు]],<ref>పాలమూరు జిల్లా వాగ్గేయకారులు, రచన: [[పి.భాస్కరయోగి]]</ref> ప్రముఖ విద్యావేత్త [[చుక్కా రామయ్య]], ప్రతిజ్ఞ రచయిత [[పైడిమర్రి సుబ్బారావు]], నిజాం కాలంలో కొత్వాల్‌గా పనిచేసిన [[రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి]],<ref>స్వాతంత్ర్య సమరంలో తెలంగాణ ఆణిముత్యాలు, రచన: మల్లయ్య</ref> సాయుధపోరాట యోధుడు [[ఆరుట్ల రామచంద్రారెడ్డి]], ప్రముఖకవి [[వేములవాడ భీమకవి]], సమరయోధుడు [[రాధాకిషన్ మోదాని]], జానపద సాహిత్య సృష్టికర్త [[బిరుదురాజు రామరాజు]], తెలంగాణ సాహితీమూర్తి [[లక్ష్మీ నరసింహశర్మ]], ప్రముఖ సమరయోధుడు [[పులిజాల వెంకటరంగారావు]], 13వ శతాబ్దికి చెందిన శివకవి [[పాల్కురికి సోమనాథుడు]], కమ్యూనిస్ట్ నాయకుడు [[బొమ్మగాని ధర్మభిక్షం]], తెలంగాణ సాయుధ పోరాట సేనాని [[రాజ్ బహదూర్ గౌర్]], నిజాంపై తిరగబడిన [[షోబుల్లాఖాన్]], గద్వాల కోటను నిర్మించిన [[పెద సోమభూపాలుడు]],<ref>కృష్ణవేణి తరంగాలు, (తితిదే ప్రచురణ)</ref> సమరయోధుడు [[జమలాపురం కేశవరావు]], ప్రముఖ చిత్రకారుడు [[పాకాల తిరుమల రెడ్డి]], ప్రముఖ కవి [[సామల సదాశివ]], సాహితీ వేత్త [[కూరెళ్ల విఠలాచార్య]], సమరయోధుడు, సంఘసంస్కర్త [[పల్లెర్ల హనుమంతరావు]],<ref>మహబూబ్‌నగర్ జిల్లా అజ్ఞాత విషయాలు, రచన: పల్లెర్ల జానకి రామశర్మ</ref> ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఒక రూపు తీసుకువచ్చిన [[కొత్తపల్లి జయశంకర్]], అడవి బిడ్డలకు అండగానిలిచిన [[రాంజీ గోండు]], కుతుబ్‌షాహీల నాటి కవి [[మరింగంటి సింగనాచార్యులు]], తెలంగాణ ఉద్యమకారిణి [[టి.ఎస్.సదాలక్ష్మి]], తొలితరం తెలుగు కవి [[కొరవి గోపరాజు]], నటుడు [[కత్తి కాంతారావు]], విమోచనోద్యమకారుడు [[విశ్వనాథ్ సూరి]], దక్షిణ భారతదేశంలోనే తొలి మహిళాపాలకురాలు [[రుద్రమదేవి]], [[దస్త్రం:Burgula Ramakrishna Rao, 1952.jpg|left|160px|thumb|<center>హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి [[బూర్గుల రామకృష్ణారావు]]</center>]]ముఖ్యమంత్రిగా పనిచేసిన [[టంగుటూరి అంజయ్య]], సాహితీవేత్త [[కృష్ణస్వామి ముదియార్]], తెలంగాణభాషలో కవితలద్దిన [[కాళోజీ నారాయణరావు]], కవి [[మల్లినాథ సూరి]], ప్రముఖ చిత్రకారుడు [[కాపు రాజయ్య]], కవి, కళాకారుడు [[సుద్దాల హనుమంతు]], బహుముఖ ప్రజ్ఞాశాలి [[వట్టికోట ఆళ్వారుస్వామి]], తెలంగాణ రైతాంగపోరాటయోధుడు [[బందగి]], ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు [[రావి నారాయణరెడ్డి]], ముఖ్యమంత్రిగా, గవర్నరుగా పనిచేసిన [[బూర్గుల రామకృష్ణారావు]], సమరయోధుడు [[మందుముల నరసింగరావు]], కళాకారుడు, కవి [[పల్లెర్ల రామ్మోహనరావు]],<ref>పాలమూరు జిల్లా నాటక కళావైభవం, రచన:[[దుప్పల్లి శ్రీరాములు]]</ref> గవర్నరుగా పనిచేసిన [[బి.సత్యనారాయణ రెడ్డి]], తెలంగాణలో కవులే లేరని హేళన చేయగా "[[గోలకొండ కవుల సంచిక|గోల్కొండకవుల చరిత్ర]]"తో నోరుమూయించిన [[సురవరం ప్రతాపరెడ్డి]], ప్రముఖ కవి మరియు చరిత్ర పరిశోధకుడు [[కపిలవాయి లింగమూర్తి]], తొలితెలుగు కవయిత్రి [[కుప్పాంబిక]], ప్రముఖ చరిత్ర పరిశోధకుడు, సాహితీవేత్త [[గడియారం రామకృష్ణ శర్మ]], తెలంగాణ ఉద్యమనేత [[బొజ్జం నరసింహులు]], నిజాం పాలనను ఎదిరించి ప్రజలలో చైతన్యం తెచ్చిన<ref>శతవసంతాల కరీంనగర్ జిల్లా</ref> [[అనభేరి ప్రభాకరరావు]], 15వ శతాబ్దికి చెందిన ప్రముఖ కవి [[చరిగొండ ధర్మన్న]], మొఘల్ పాలనను అడ్డుకున్న [[సర్వాయి పాపన్న]], కూచిపూడి నృత్యంలో అంతర్జాతీయ ఖ్యాతిచెందిన రాజారాధారెడ్డి దంపతులు, ఆర్యసమాజ్ ప్రముఖుడు [[పండిత్ నరేంద్రజీ]], విమోచనోద్యమకారుడు [[పాగ పుల్లారెడ్డి]], నిజాంపై తిరగబడిన ఆదివాసి [[కొమురం భీమ్]], ముఖ్యమంత్రిగా పనిచేసిన [[జలగం వెంగళరావు]], తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడు [[కె.చంద్రశేఖర రావు]], ముఖ్యమంత్రిగా, గవర్నరుగా పనిచేసిన [[మర్రి చెన్నారెడ్డి]], కథా రచయిత [[అల్లం రాజయ్య]], ప్రముఖ వాగ్గేయకారుడు [[రాకమచర్ల వేంకటదాసు]], తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్న [[కోదండరాం]], విమోచనొద్యమకారుడు [[వెల్దుర్తి మాణిక్యరావు]], ప్రముఖ విద్యావేత్త [[జి.రాంరెడ్డి]], ప్రముఖ చిత్రకారుడు [[తోట వైకుంఠం]], శాసనసభ స్పీకరుగా పనిచేసిన [[దుద్దిల్ల శ్రీపాద రావు]], చేనేత వస్త్ర పరిశోధకుడు [[నల్ల పరంధాములు]], ప్రముఖ సాహితీవేత్త, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత [[సి.నారాయణ రెడ్డి]], కేంద్రమంత్రిగా పనిచేసి, ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నరుగా ఉన్న [[సి.హెచ్.విద్యాసాగర్ రావు]], ప్రముఖ చరిత్ర పరిశోధకుడు [[ఆదిరాజు వీరభద్రరావు]], విమోచనోద్యమకారిణి [[ఆరుట్ల కమలాదేవి]], విప్లవకవి [[గద్దర్]], ప్రముఖ రచయిత [[జ్వాలాముఖి]], విమోచనొద్యమకారుడు [[మగ్దూం మొహియుద్దీన్]], ప్రస్తుత కేంద్రమంత్రి [[సూదిని జైపాల్ రెడ్డి]], మాజీ ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ పితామహుడిగా పేరుపొందిన [[కొండా వెంకట రంగారెడ్డి]],తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారి నిరాహారదీక్ష కీలక ఘట్టం అయితే.....స్వరాస్ట్రం కోసం అసువులు బాసిన తొలి అమరుడు [[శ్రీకాంతాచారి]].కణకణలాడే నిప్పును ముద్దాడి తన శ్వాస ఆశ ఆశయం తెలంగాణ రాష్ట్రం అంటూ ఉద్యమ సాక్షిగా మంటల్లో మాడి మసి అయిన విద్యార్థి [[శ్రీకాంతాచారి]], 2009 డిసెంబరు 3వ తేదీన ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడు<ref>http://www.andhrajyothy.com/Artical?SID=179247</ref>. ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖులలో కొందరు.
 
==జనాభా==
పంక్తి 216:
కాకతీయ సామ్రాజ్య పతనానంతరం తెలంగాణలో తెలుగు సాహిత్య ప్రభ తగ్గిననూ [[మరింగంటి సింగరాచార్యులు]] తన కవిత్వంతో [[ఇబ్రహీం కుతుబ్‌షా]]నే మెప్పించి అగ్రహారాన్ని పొందాడు. అప్పటి కవులు ఇతనిని మల్కిభరాముడని అభివర్ణించారు. ఇబ్రహీం కుతుబ్‌షా ఆస్థానకవి [[అద్దంకి గంగాధరుడు]] ప్రతిభావంతుడైన కవి. ఇతను రచించిన తపతి సంవర్ణోపాఖ్యానం ప్రఖ్యాతిచెందింది. [[పొన్నెగంటి తెలగనాచార్యుడు]] 16వ శతాబ్దికి చెందినకవి. కులీకుతుబ్‌షా ఫారసీ కవులను ఆదరించాడు. ఇతని కాలంలో ఫారసీ, ఉర్దూలలో పలు రచనలువెలువడ్డాయి. [[కులీకుతుబ్‌షా]] సంస్కృత "శుకసప్తతి"ని "యాతినామా" పేరుతో ఫారసీలోకి అనువాదం చేయించాడు. ఈ కాలంలోనే దోమకొండ సంస్థానం సాహిత్యానికి పేరుగాంచింది. 1600 ప్రాంతానికి చెందిన కాసె సర్వప్ప "సిద్దేశ్వర చరిత్ర" రచించాడు. సురభి మాధవరాయల ఆస్థానకవి [[ఎలకూచి బాలసరస్వతి]] తెలుగులోనే మొట్టమొదటి మహామహోపాధ్యాయ కవిగా గణతికెక్కాడు. కొందరు గుంటూరు జిల్లా కవిగా భావించే [[కాకునూరి అప్పకవి]] తెలంగాణ వాడేనని బూర్గుల నిరూపించాడు. [[తానీషా]] వద్ద పనిచేసే [[అక్కన్న-మాదన్న]]ల మేనల్లుడు [[కంచెర్ల గోపన్న]] (భక్తరామదాసు) కీర్తనలు తెలుగువారికి శతాబ్దాల నుంచి సుపరిచితమే.
[[దస్త్రం:Kaloji-1.jpg|thumb|right|160px|<center>తెలంగాణ భాషలో కవితలద్దిన కాళోజీ</center>]]
ఆసఫ్‌జాహీల కాలంలో (1724-1948) తెలంగాణ సాహిత్యం కుంటుపడింది. తెలుగుభాషను అణగద్రొక్కి బలవంతంగా ప్రజలపై ఉర్దూభాష రుద్దడం, తెలుగు కవులకు ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడంతో కాకతీయుల కాలంలో వెలుగులు విరజిమ్మిన [[తెలంగాణ సాహిత్యం]] [[ఆసఫ్‌జాహీలకాలం]]లో దారుణంగా దెబ్బతిన్నది. అక్కడక్కడా తెలుగులో రచించిన గ్రంథాలు కూడా వెలుగులోకి రాకుండా చేశారు. ఈ కాలంలో స్థానిక స్థల మహాత్మ్యాలు, దేవాలయ చరిత్రల విశేషాలు రచించినవి తర్వాతి కాలంలో బయటపడ్డాయి. భజనకీర్తనలు కూడా ఈ కాలంలో వ్రాయబడ్డాయి. [[మన్నెంకొండ హనుమద్దాసు]], [[రాకమచర్ల వేంకటదాసు]], [[వేపూరు హనుమద్దాసు]] ఈ కాలంలోని సంకీర్తన త్రిమూర్తులుగా పరిగణించబడతారు. రాజవోలు ప్రభువు ముష్టిపల్లి వేంకటభూపాలుడు వేలాది సంకీర్తనలు రచించాడు. [[ఆసఫ్‌జాహీలు]] స్వయంగా కవిపండితులకు ఆదరణ ఇవ్వకున్ననూ స్వతంత్రంగా పాలన కొనసాగించిన సంస్థానాలలో మాత్రం సాహిత్యం బాగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఆధునిక కాలంలో కవిపండితులకు నిలయమైన గద్వాల సంస్థానం ప్రత్యేకతను కలిగియుంది. సాహితీవేత్తలు ఈ సంస్థానాన్ని విద్వత్గద్వాలగా అభివర్ణించేవారు. గద్వాల సంస్థానాధీశూలు కూడా స్వయంగా కవులుగా ఉండి పలు రచనలు చేశారు. తరుచుగా కవితాగోష్టులు నిర్వహించేవారు. గద్వాల సంస్థానాధీశులు కవులను ఎంతగా అభిమానించేవారంటే, వారి కోసం ఒక ప్రత్యేక ద్వారాన్నే ఏర్పాటు చేసి, వారు నడిచే మార్గంలో తెల్లటి వస్త్రాన్ని పరిచి, కవిపండితుల పాదధూళిని భరిణెలో భద్రపర్చి వాటిని తిలకంగా నుదుటికి పెట్టుకొనేవారు. [[గద్వాల సంస్థానంసంస్థానము|గద్వాల సంస్థానంతో]]తో పాటు పరిసర సంస్థానాలైన వనపర్తి సంస్థానం, [[జటప్రోలు]] సంస్థానాధీశూలు కూడా [[గద్వాల సంస్థానంసంస్థానము|గద్వాల సంస్థానంతో]]తో పోటీపడ్డారు. వీరి మధ్య తరుచుగా కవితా గోష్టులు జరిగేవి. [[తిరుపతి వేంకటకవులవేంకట కవులు|తిరుపతి వేంకటకవులను]]ను కూడా ఓడించిన ఘనత [[వనపర్తి]] సంస్థాన కవులకు దక్కింది.
 
1920 తర్వాత తెలంగాణలో నీలగిరి, గోల్కొండ పత్రిక లాంటి తెలుగు పత్రికలు రాకతో సాహిత్యం మరింత అభివృద్ధి చెందింది. అదివరకు వెలుగులోకి రాని కవులు, వారి రచనలను సురవరం ప్రతాపరెడ్డి తన [[గోల్కొండగోలకొండ పత్రిక|గోల్కొండ పత్రికలోనే]]లోనే, దానికి అనుబంధమైన సుజాత సాహిత్య పత్రికలోనూ ప్రచురించేవారు. తెలంగాణలో కవులే లేరనే ఒక ఆంధ్రుడి సవాలును తీసుకొని 356 కవుల చరిత్ర, వారి రచనలతో "గోల్కొండ కవుల సంచిక" పేరుతోఒక గ్రంథాన్నే ప్రజల ముందుకు ఉంచిన తెలంగాణ వైతాళికుడు [[సురవరం ప్రతాపరెడ్డి]]. తెలుగులో తొలి [[సాహిత్య అకాడమీ|సాహిత్య అకాడమీ అవార్డు]] కూడా ఇతనికే లభించింది. [[గ్రంథాలయోద్యమం]] సమయంలో ప్రతి ప్రాంతంలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం, సాహిత్య గ్రంథాలు ఉంచడంతో సాహితీ అభిమానులు కూడా అధికమయ్యారు. [[దాశరథి కృష్ణమాచార్య]], [[దాశరథి రంగాచార్య]] లాంటి కవులు నిజాం దురాగతాలను ఎలగెత్తడానికి పద్యాలనే ఆధారం చేసుకోగా, [[కాళోజీ నారాయణరావు]] తెలంగాణ భాషలోనే కవితలు చేసి ప్రజలను జాగృతం చేశారు. [[వట్టికోట ఆళ్వారుస్వామి]], [[మందుముల నరసింగరావు]], [[బూర్గుల రామకృష్ణారావు]] లాంటి వారు విమోచనోద్యమ కాలంలోనే సాహిత్య రచన చేశారు. [[సామల సదాశివ]] బహుభాషావేత్త, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. [[జ్ఞానపీఠ పురస్కారం|జ్ఞాన్‌పీఠ్ అవార్డు]] గ్రహీత [[సి.నారాయణరెడ్డి]] ఆధునిక తెలుగు సాహితీవేత్తలలోనే అగ్రగణ్యులుగా ప్రసిద్ధి చెందారు. [[నందిని సిద్ధారెడ్డి]], [[అందెశ్రీ]], [[గోరటి వెంకన్న]]లు తెలంగాణపై కవితలు రచించారు.
 
==తెలంగాణ సంస్కృతి==
పంక్తి 225:
'''పండుగలు:''' [[బోనాలు|బోనాల ఉత్సవాలు]] మరియు [[బతుకమ్మ|బతుకమ్మ ఉత్సవాలు]] తెలంగాణ యొక్క ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. ఇవి కాకుండా మిగితా తెలుగు ప్రజలు జరుపుకొనే [[సంక్రాంతి]], [[ఉగాది]], [[దసరా]], [[వినాయక చవితి]], [[రంజాన్]] తదితర ముఖ్య పండుగులను ఇక్కడి ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. 2014 జూన్ 26న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనాలును రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఉత్తర్వు జారీచేసింది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 27-06-2014</ref>
 
'''భాష:''' తెలంగాణ రాష్ట్రంలో అధిక సంఖ్యాకుల భాష [[తెలుగు]]. సంపూర్ణ తెలంగాణావారు మాట్లాడే తెలుగు భాషలో ఉర్దూ పదాలు ఎక్కువగా కలుస్తాయి. ఆదిలాబాదు జిల్లాకు మూడు వైపులా [[మహారాష్ట్ర]] సరిహద్దు ఉండటంతో ఆ జిల్లాలో [[మరాఠీ భాష|మరాఠి భాష]] ప్రభావం కొంత ఉంది. [[మహబూబ్‌నగర్]], [[మెదక్]], [[నిజామాబాదు]] జిల్లాల [[కర్ణాటక]] సరిహద్దు గ్రామాలలో కన్నడ భాష ప్రభావం కొంతవరకు కనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతపు గ్రామీణ తెలుగు భాష యాసలో మిగితా ప్రాంతపు తెలుగు భాషకు కొద్దిగా వైరుధ్యం కనిపిస్తుంది. తెలంగాణాలోని ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లో కొద్దిగా స్వచ్ఛమైన తెలుగు వినిపిస్తుంది.
 
'''వస్త్రధారణ:''' తెలంగాణ ప్రాంతము ఉత్తర-దక్షిణ భారతదేశానికి వారధిగా ఉండటం మరియుకొన్ని శతాబ్దాల నుంచి ఈ ప్రాంతంపై దండయాత్రలుచేసి పాలించడం, ఇతర ప్రాంతాల వారు వచ్చి నివాసం ఏర్పర్చుకోవడంతో ఇక్కడ మిశ్రమ వస్త్రధారణ ఉంది. అలాగే మారుతున్న ధోరణులు, సినిమా-అంతర్జాలం-అంతర్జాతీయీకరణ తదితరాల వల్ల కూడా ఇక్కడి వస్త్రధారణ పట్టణ ప్రాంతాలలో చాలా మార్పుచెందింది. అయిననూ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో పురుషులు మోకాళ్లపైకి ఉండే ధోవతి, మహిళలు చీరలు ధరించడం సాధారణంగా కనిపిస్తుంది. గిరిజన ప్రాంతాల మహిళలు మాత్రం వారి సంప్రదాయక దుస్తులు ధరిస్తారు.
 
==వ్యవసాయం==
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన పంట [[వరి]]. రెండో ప్రధాన పంట జొన్నలు. ప్రాజెక్టులు, నదులు, కాలువలు ఉన్న ప్రాంతాలలో వరి అధికంగా పండుతుంది. జొన్నల ఉత్పత్తిలో మహబూబ్‌నగర్, మెదక్, [[ఆదిలాబాదు]] జిల్లాలు తొలి మూడు స్థానాలలో ఉన్నాయి. [[కందుల]] ఉత్పత్తికి మహబూబ్‌నగర్ జిల్లా [[కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం|కోడంగల్ నియోజకవర్గం]] మరియు రంగారెడ్డి జిల్లా [[తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం|తాండూరు నియోజకవర్గం]] పేరుగాంచాయి. [[మొక్కజొన్న]] ప్రధానంగా మహబూబ్‌నగర్, మెదక్, [[కరీంనగర్]], నిజామాబాదు, వరంగల్ జిల్లాలో పండుతుంది. పెసర్ల పంటలో మెదక్ జిల్లా అగ్రస్థానంలో ఉంది. నూనెగింజల ఉత్పత్తిలో మహబూబ్‌నగర్ జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా నిజామాబాదు జిల్లా తర్వాతి స్థానంలో ఉంది. [[చెరుకు]] ఉత్పత్తిలో మెదక్ జిల్లా తెలంగాణలో తొలి స్థానంలో ఉంది. మిరపపంటలో ఖమ్మం జిల్లా అగ్రస్థానం పొందగా, పత్తి ఉత్పత్తిలో ఆదిలాబాదు జిల్లా ముందంజలో ఉంది. [[పొగాకు]], [[ఉల్లి]] సాగులో మహబూబ్ నగర్ జిల్లా ప్రథమస్థానంలో ఉంది. మొత్తం సాగుభూమి విస్తీర్ణంలో భౌగోళికంగా పెద్ద జిల్లా అయిన మహబూబ్‌నగర్ అగ్రస్థానంలో ఉండగా పూర్తిగా నగర ప్రాంతమైన [[హైదరాబాదు]] జిల్లాలో ఎలాంటి సాగుభూమి లేదు.
 
==విద్యాసంస్థలు==
{{ప్రధాన వ్యాసం|తెలంగాణాలోని విశ్వవిద్యాలయాల జాబితా}}
[[ఫైలు:Osmania University Arts College 02.JPG|right|150px|thumb|<center>ఉస్మానియా విశ్వవిద్యాలయం<br />ఆర్ట్స్ కళాశాల భవనం</center>]]
1959లో [[వరంగల్]]లో నిట్ (NIT) [[జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయం]] స్థాపించబడింది.1919లో [[హైదరాబాదు]]లో [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]], 1964లో [[ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము|ఎన్.జీ.రంగా విశ్వవిద్యాలయం]], జే.ఎన్.టి.యూ, 1974లో [[హైదరాబాదు విశ్వవిద్యాలయం]], 1976లో [[వరంగల్‌]]లో [[కాకతీయ విశ్వవిద్యాలయం]] ప్రారంభించబడినవి. 2000 తర్వాత ప్రతి జిల్లాలో విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో [[నిజామాబాదు]]లో [[తెలంగాణ విశ్వవిద్యాలయం]], [[మహబూబ్‌నగర్‌]]లో [[పాలమూరు విశ్వవిద్యాలయం]], [[కరీంనగర్ మండలం|కరీంనగర్‌]] లో [[శాతవాహన విశ్వవిద్యాలయం|శాతవాహన విశ్వవిద్యాలయ]], [[నల్గొండ]]లో [[మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్గొండ|మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం]] ప్రారంభించబడ్డాయి. [[హైదరాబాదు]]లో [http://www.tiss.edu టటా ఇంస్టిట్యుట్ ఆఫ్ సొశ్యల్ సైంసెస్],
 
==కళలు==
"https://te.wikipedia.org/wiki/తెలంగాణ" నుండి వెలికితీశారు