నేరెళ్ళ వేణుమాధవ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 75:
# మారిషస్ - 1990
== వీరి ప్రదర్శమనలను ప్రత్యక్షంగా వీక్షించిన ప్రముఖులు ==
భారతరాష్ట్రపతులు - సర్వేపల్లి రాధాకృష్ణన్, వి.వి.గిరి, గ్యానీ జైల్ సింగ్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, నీలం సంజీవరెడ్డి ; ఉపరాష్ట్రపతి - బి.డి జెట్టి ; ప్రధానమంత్రులు - లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు : ముఖ్యమంత్రులు - దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానంద రెడ్డి, టి.అంజయ్య, ఎన్.టీ.రామారావు, చంద్రబాబు నాయుడు, కేరళ ముఖ్యమంత్రి - ఇ.ఎం.ఎస్..నంబూద్రిపాద్ మరియు గవర్నర్లు - బూర్గుల రామకృష్ణారావు (కేరళ, 1958), శారదాముఖర్జీ, కుముద్ బెన్ జోషి, కృష్ణకాంత్, సి.రంగరాజన్. వీరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం, 1977 లో "కళాప్రపూర్ణ ", జె.ఎన్.టి.యూ.సీ, 1987 లో,కాకతీయ విశ్వవిద్యాలయం 1992 లో గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. వీరికి తిరుపతి పట్టణంలో గజారోహణం, పొరసన్మానం జరిగాయి. వీరి బిరుదులు - ధ్వన్యనుకరణ సామ్రాట్, మిమిక్రీ సామ్రాట్,చుపే రుస్తుం ధ్వన్యనుకరణ చక్రవర్తి, కళాసరస్వతి, స్వర్ కే రాజా, ధ్వన్యనుకరణ ప్రవీణ, ధ్వన్యనుకరణ కళానిధి, మిమిక్రీ రత్న, విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సార్వభౌమ,మున్నగునవి. వీరు 'నేరెళ్ళ వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్' ను స్థాపించి ప్రతియేటా తన పుట్టినరోజైన డిసెంబర్ 28న ప్రముఖ కళాకారులను పదివేల రూపాయల పురస్కారంతో సత్కరిస్తున్నారు. ఈ పురస్కారం పొందిన వారు - డా. కాశీభట్ల విశ్వనాథం (చిత్రలేఖనం 0 2002, ఎస్.కె.గౌడ్ (నాటకం) 2003, కవిశాబ్దిక కేసరి నల్లాన్ చక్రవర్తుల రఘునాధాచార్య (వేద పండితులు) 2004, జమ్మలమడక కృష్ణమూర్తి (నాటకం) 2005, ఉల్లి రామచంద్రయ్య (హిందుస్తానీ సంగీతం) 2006, తిరుమలశెట్టి సీతాలత (నాటకం) 2007, జానీలీవర్ (మిమిక్రీ) 2008, కోవెల సుప్రసన్నాచార్య (సాహిత్యం) 2009, [[వంగిపురం హరికిషన్|వి.హరికిషన్]] (మిమిక్రీ) 2010, చుక్కా సత్తయ్య (ఒగ్గుకథ) 2011, [[వెలిదె హరిశంకర శాస్త్రి]] (హరికథ) & తణుకు రాజ్యం (నాటకం) 2012. వీరి పేరిట హనుమకొండ పట్టణంలో నిర్మింపబడ్డ 'డా.నేరెళ్ళ వేణుమాధవ్ గారి కళాప్రాంగణం ' సాహిత్య,సాంస్కృతిక కార్యక్రమాలకు చక్కని వేదికగా ఉపయోగపడుతున్నది.<ref>http://www.freebase.com/view/guid/9202a8c04000641f8000000007694049</ref>. తన ప్రదర్శనలతో క్రమంగా ప్రసిద్ధుడయ్యాడు. ముఖ్యంగా ప్రసిద్ధులైన వ్యక్తులను, నాయకులను అనుకరించడంలో ఇతనికి పెట్టినది పేరు. [[ధ్వన్యనుకరణ]]కు ఇతని వలన తెలుగునాట విశిష్టమైన ప్రాచుర్యం లభించింది. 2001లో ఇతనికి [[పద్మశ్రీ]] పురస్కారం లభించింది. 1981లో [[శ్రీ రాజాలక్ష్మీ ఫౌండేషన్ బహుమతి]] లభించింది. ఇతని శిష్యులలో ప్రసిద్ధుడైన మరొక మిమిక్రీ కళాకారుడు [[వంగిపురం హరికిషన్|హరికిషన్]].
 
== పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/నేరెళ్ళ_వేణుమాధవ్" నుండి వెలికితీశారు