చార్లెస్ ఫిలిప్ బ్రౌన్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 45:
[[1820]] ఆగస్టులో [[కడప]]లో డిప్యూటీ కలెక్టరుగా చేరాడు. ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో పనిచేసినపుడు తెలుగులో మాట్లాడడం తప్పనిసరి అయ్యింది. అయితే తెలుగు నేర్చుకోడానికి సులభమైన, శాస్త్రీయమైన విధానం లేకపోవడం వలన, పండితులు తమ తమ స్వంత పద్ధతులలో బోధిస్తూ ఉండేవారు. తెలుగేతరులకు ఈ విధంగా తెలుగు నేర్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. భాష నేర్చుకోవడం లోని ఈ ఇబ్బంది, బ్రౌనును తెలుగు భాషా పరిశోధనకై పురికొల్పింది. ప్రాచీన తెలుగు కావ్యాలను వెలికితీసి, ప్రజలందరికీ అర్ధమయ్యేలా పరిష్కరించి, ప్రచురించడం, భాషకు ఓ వ్యాకరణం, ఓ నిఘంటువు, ఏర్పడడానికి దారితీసింది. [[మచిలీపట్నం]], [[గుంటూరు]], [[చిత్తూరు]], [[తిరునెల్వేలి]] మొదలైనచోట్ల పనిచేసి, [[1826]]లో మళ్ళీ [[కడప]]కు తిరిగి వచ్చి అక్కడే స్థిర నివాసమేర్పరచుకొన్నాడు. అక్కడ ఒక బంగళా కొని, సొంత డబ్బుతో పండితులను నియమించి, అందులో తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించాడు. అయోధ్యాపురం కృష్ణారెడ్డి అనే ఆయన ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉండేవాడు
కడపలోను, [[మచిలీపట్నం]]లోను కూడా పాఠశాలలు పెట్టి ఉచితంగా చదువు చెప్పించాడు. విద్యార్థులకు ఉచితంగా భోజనవసతి కూడా కల్పించాడు. దానధర్మాలు విరివిగా చేసేవాడు. వికలాంగులకు సాయం చేసేవాడు. నెలనెలా పండితులకిచ్చే జీతాలు, దానధర్మాలు, పుస్తక ప్రచురణ ఖర్చుల కారణంగా బ్రౌను ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. అప్పులు కూడా చేసాడు. [[1834]]లో ఉద్యోగం నుండి తొలగించడంతో [[ఇంగ్లండు]] వెళ్ళిపోయి, తిరిగి [[1837]]లో కంపెనీలో [[పర్షియను]] అనువాదకుడిగా [[ఇండియా]] వచ్చాడు.
బ్రౌను మానవతావాది. [[1832]]-[[1833|33]]లో వచ్చిన ''గుంటూరు కరువు'' లేదా ''[[డొక్కల కరువు]]'' లేదా ''నందన కరువు'' సమయంలో ప్రజలకు బ్రౌను చేసిన సేవలు ప్రశంసలందుకున్నాయి. ఆ సమయంలో కరువును ''కరువు''గా కాక ''కొరత''గా రాయాలని అధికారులు చెప్పినా, అలానే పేర్కొనడంతో వారి అసంతృప్తిని ఎదుర్కొన్నాడు. పందొమ్మిదో శతాబ్ది తొలిపాదం చివర్లో తాను తెలుగు సాహిత్యంలో కృషి మొదలుపెట్టేనాటికి నెలకొని వుండిన స్థితిగతులను గురించి బ్రౌన్ స్ఫుటమయిన మాటల్లో అభివర్ణించాడు. ‘అప్పటికి తెలుగు సాహిత్యం కొనప్రాణంతో కొట్టుకులాడుతోంది. 1825 నాటికి ప్రమిదలో దీపం కొడిగట్టిపోతోంది. తెలుగు సాహిత్యం దాదాపు అంతరించిపోతూ ఉండడం నా కళ్లబడింది. నేను 30 ఏళ్లు కృషి చేసి, దాన్ని పునఃప్రతిష్ట చేశాన’న్నాడు బ్రౌన్. నిరలంకారంగా మాట్లాడ్డం బ్రౌన్ శైలి. ఈ మాటల్లో కూడా అందుకే అతిశయోక్తులు కనిపించవు. 1827 నాటికే, బ్రౌన్ ‘ఆంధ్ర గీర్వాణ ఛందము’ అనే పుస్తకం రాసినప్పటికీ, ఆయనకి మంచి గుర్తింపు తెచ్చిన పుస్తకం 1829 నాటి ‘వేమన శతకం’. అప్పటికి బ్రౌన్ అయిదేళ్లుగా వేమన సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఇందులో దాదాపు ఏడొందల పద్యాలకి ఆంగ్లానువాదాలతోపాటు విస్తృతమయిన పదకోశం కూడా సమకూర్చారు. మరో పదేళ్ల తర్వాత, 1164 పద్యాల మేరకి విస్తరింపచేసి, తిరిగి ‘వేమన శతకం’ అచ్చువేశారు.<ref>{{Cite ఇదే పుస్తకాన్ని ప్రముఖ ప్రచురణ సంస్థలు యథాతథంగా పునర్ముద్రించినప్పటికీ, తన పేరు ప్రస్తావించక పోవడం గురించి బ్రౌన్ మనసు కష్టపెట్టుకున్నారుwikisource|title=https://te. wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%81%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B1%81%E0%B0%B2_%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%87%E0%B0%B7%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81/%E0%B0%B8%E0%B0%BF.%E0%B0%AA%E0%B0%BF.%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8C%E0%B0%A8%E0%B1%8D}}</ref>
పదవీ విరమణ తరువాత [[1854]]లో [[లండన్‌]]లో స్థిరపడి, 1865లో లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసరుగా నియమితుడైనాడు. బ్రౌన్ [[1884]] [[డిసెంబర్ 12]] న తన స్వగృహము 22 కిల్డారే గార్డెన్స్, వెస్ట్‌బార్న్ గ్రోవ్, లండన్<ref>[http://maps.google.com/maps?f=q&hl=en&geocode=&q=22,+Kildare+gardens,+westbourne+grove,+london&sll=37.0625,-95.677068&sspn=36.231745,80.15625&ie=UTF8&ll=51.516281,-0.192947&spn=0.00087,0.002446&t=h&z=19&iwloc=addr&om=1 గూగుల్ మాప్స్‌లో బ్రౌన్ నివసించిన ఇల్లు]</ref>లో అవివాహితునిగానే మరణించాడు. ఈయనను కెన్సెల్ గ్రీన్ శ్మశానంలో సమాధి చేశారు<ref>http://www.oxforddnb.com/view/article/3601</ref>.