1909వ సంవత్సరంసంవరం జూలై 15వ తేదీన రాజమండ్రిలో కృష్ణవేణమ్మ, రామారావు దంపతులకు దుర్గాబాయి జన్మించారు. ఈమె బాల్యం నుండి ప్రతిభాపాఠవాలను కనబరుస్తూ పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి, హిందీ [[పాఠశాల]]<nowiki/>ను నెలకొల్పి అన్ని వయసులవారికీ విద్యాబోధన అందించేవారు.[[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం|బెనారస్]] విశ్వవిద్యాలయం నుండి మెట్రి క్యులేషన్, [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి ఎం.ఏ (పొలిటికల్ సైన్స్), 1942లో ఎల్. ఎల్.బి పూర్తిచేసింది.దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకుంది. తెలుగుగడ్డ పై [[మహాత్మా గాంధీ]] రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేసింది. మహాత్ముని సూచన మేరకు మారు ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా అందించింది.