నన్నయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
| weight =
}}
'''[[తెలుగు సాహిత్యం - నన్నయ యుగము|నన్నయ]] భట్టారకుడు''' ('''నన్నయ''' లేదా '''నన్నయ్య''' గానూ సుప్రఖ్యాతుడు) (క్రీ.శ.11వ శతాబ్ది) [[తెలుగు సాహిత్యము|తెలుగు సాహిత్యం]]<nowiki/>లో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అయితే, [[తెలంగాణ]] రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికిసోమనాథుడిని [[ఆది కవి]]<nowiki/>గా భావిస్తున్నారు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు, వయ్యాకరణి మరియు వాగనుశాసనుడు. సంస్కృత, ఆంధ్రభాషయందు పాండిత్యం కలవాడు. సంస్కృత మహాభారతానికి అనుసృజనయైన [[శ్రీమదాంధ్ర మహాభారతం]] రచించిన కవిత్రయం (ముగ్గురు కవులు) లో మొదటివాడు. మహాభారతమే తెలుగులో తొలి కావ్యంగా ప్రసిద్ధిచెందింది. మహాభారతానికి తెలుగు సాహిత్యంలో ఎంతో సాహితీపరమైన విలువ కలిగివుంది.fayaz [[చంపూ|చంపూ కవిత]] శైలిలోని [[మహా భారతము|మహాభారతం]] అత్యుత్తమ రచనాశైలికి అద్దంపడుతూ నిలిచింది.
 
నన్నయ సంస్కృతంలో తొలి [[తెలుగు]] వ్యాకరణ గ్రంథమైన ''ఆంధ్ర శబ్ద చింతామణి'' రచించారని భావిస్తారు. సంస్కృత భాషా వ్యాకరణాలైన అష్టాధ్యాయి, వాల్మీకి వ్యాకరణం వంటివాటి సరళిని అనుసరించారు. అయితే పాణిని పద్ధతికి విరుద్ధంగా ఐదు విభాగాలుగా తన వ్యాకరణాన్ని విభజించారు. అవి సంజ్ఞ, సంధి, అజంత, హలంత, క్రియ.
"https://te.wikipedia.org/wiki/నన్నయ్య" నుండి వెలికితీశారు