తెలంగాణ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 89:
}}
[[File:Telangana State Map.jpg|thumb|తెలంగాణ రాష్ట్ర పటం]]
[[శ్రీశైలం]], [[కాళేశ్వరం]], ధ్రాక్షారామం ఈ మూడు దేవాలయాల మద్య భూబాగాన్ని [[కాకతీయులు]] పాలీంచిన ఏరియా [[త్రిలింగ]] [[దేశం]] కాలగమనంలో "తెలంగాణ" అనే పదంగా మారింది. [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లోని 29 రాష్ట్రాలలో ఒకటి '''తెలంగాణ'''. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన వాటిలో [[హైదరాబాద్]] ఒకటి. నిజాం పాలన నుంచి [[1948]] [[సెప్టెంబరు]] 17న విముక్తి చెంది [[హైదరాబాదు]] రాష్ట్రంగా ఏర్పడి, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా [[కన్నడ]], [[మరాఠి]] మాట్లాడే ప్రాంతాలు [[కర్ణాటక]], [[మహారాష్ట్ర]] లకు వెళ్ళిపోగా, తెలుగు భాష మాట్లాడే జిల్లాలు అప్పటి [[ఆంధ్ర రాష్ట్రం]]తో కలిసి [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంగా ఏర్పడింది. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలు ఉన్నాయి. భౌగోళికంగా ఇది [[దక్కను పీఠభూమి]]లో భాగము. దేశంలోనే పొడవైన 44వ నెంబరు ([[శ్రీనగర్]]-[[కన్యాకుమారి]]) జాతీయ రహదారి (జాతీయ రహదారి 7 [[కన్యాకుమారి]]-[[వారణాసి]] మరియు జాతీయ రహదారి 44 కలిసి ఉంటాయి), 65వ నెంబరు (పూణె-విజయవాడ) జాతీయ రహదారి, జాతీయ రహదారి 63 [[నిజామాబాదు]]-[[జగదల్‌పూర్]] హైదరాబాదు-భూపాలపట్నం జాతీయ రహదారి 202, జాతీయ రహదారులు ఈ రాష్ట్రం గుండా వెళ్ళుచున్నవి. హైదరాబాదు-వాడి, సికింద్రాబాదు-కాజీపేట, [[సికింద్రాబాదు]]-విజయవాడ, కాచిగూడ-సికింద్రాబాద్-[[నిజామాబాదు]]-నాందేడ్-మన్ మాడ్, సికింద్రాబాదు-డోన్, [[వికారాబాదు]]-పర్బని, కాజీపేట-బల్హర్షా, గద్వాల-రాయచూరు రైలుమార్గాలు తెలంగాణలో విస్తరించియున్నాయి. సికింద్రాబాదు, కాజీపేట రైల్వే జంక్షన్లు [[దక్షిణ మధ్య రైల్వే]]లో ప్రముఖ కూడళ్ళుగా పేరెన్నికగన్నవి. తెలంగాణ రాష్ట్రం ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దు నుంచి దక్షిణాన ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం వరకు, పశ్చిమాన కర్ణాటక సరిహద్దు నుంచి తూర్పున ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర ప్రాంతం వరకు విస్తరించియుంది. తెలుగులో తొలి రామాయణ కర్త [[గోన బుద్ధారెడ్డి]], సహజకవి [[బమ్మెర పోతన]], దక్షిణ భారతదేశంలో తొలిమహిళా పాలకురాలు [[రుద్రమదేవి]], ప్రధానమంత్రిగా పనిచేసిన [[పి.వి.నరసింహారావు]] తెలంగాణకు చెందిన ప్రముఖులు. చరిత్రలో షోడశ మహాజనపదాలలో ఒకటైన [[అశ్మక జనపదం]] విలసిల్లిన ప్రాంతమిది. కాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందిన భూభాగమిది. రామాయణ-మహాభారత కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్ళున్న ప్రదేశమిది. తెలంగాణ రాష్ట్రపు మొత్తం వైశాల్యం 1,14,840 చ.కి.మీ, కాగా 2011 లెక్కలప్రకారం జనాభా 35,286,757గా ఉంది. 17లోకసభ స్థానాలు, 119 శాసనసభ స్థానాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా [[ఆలంపూర్]]లో 5వ శక్తిపీఠం, మల్దకల్‌లో శ్రీస్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవస్థానం, [[భద్రాచలం]]లో శ్రీసీతారామాలయం, [[బాసర]]లో జ్ఞానసరస్వతీ దేవాలయం, [[యాదగిరి గుట్ట]]లో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, [[వేములవాడ]]లో శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం, మెదక్‌లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి, ఉన్నాయి.<ref>సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము, మొదటి భాగము(1958), పేజీ 358</ref> దశాబ్దాలుగా సాగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ఉధృతరూపం దాల్చగా, 2011లో మరో సారి తీవ్రరూపం దాల్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా వందలాది మంది ఆత్మహత్యలు చేసుకొన్నారు. 2010లో తెలంగాణ అంశంపై [[శ్రీకృష్ణ కమిటీ]]ని నియమించగా ఆ కమిటి ఆరు ప్రతిపాదనలు చేసింది. 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేయగా, 2013 [[అక్టోబరు]] 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. 2014, ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు [[భారతీయ జనతా పార్టీ]] మద్దతుతో లోకసభ ఆమోదం లభించింది. ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది. [[2014]] [[మార్చి]] 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించింది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 05-03-2014</ref> 2014 జూన్ 2 నాడు తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది.<ref>ఈనాడు దినపత్రిక, తేది:03-06-2014</ref><ref>నమస్తే తెలంగాణ దినపత్రిక, తేది:03-06-2014</ref>
 
 
== భౌగోళిక స్వరూపం ==
"https://te.wikipedia.org/wiki/తెలంగాణ" నుండి వెలికితీశారు