వ్యాసుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraocbot (చర్చ | రచనలు) చి replacing dead dlilinks to archive.org links |
B.K.Viswanadh (చర్చ | రచనలు) ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 3:
==జన్మ వృత్తాంతం==
వేదవ్యాసుడు జన్మ
పూర్వకాలములో చేది రాజ్యాన్ని [[వసువు]] అనే మహారాజు పరిపాలన చేస్తుండేవాడు, ఒకరోజు వేటకు [[అడవి]]కి వెళ్ళిన రాజు ఆ అడవిలో [[మునులు]] [[తపస్సు]] చేయడము చూసి తాను తపస్సు చేయడం ఆరంభించాడు. అప్పుడు [[ఇంద్రుడు]] అది గ్రహించి ఆ మహారాజు వద్దకు వెళ్ళి దైవత్వము ప్రసాదిస్తున్నాని చెప్పి ఒక విమానాన్ని ఇచ్చి, భూలోకములో రాజ్యం చేస్తూ, అప్పుడప్పుడు స్వర్గానికి రమ్మని చెబుతాడు. ఇంద్రుడు '''వేణుదుస్టి''' అనే అతి పరాక్రమ వంతమైన ఆయుధాన్ని కుడా ప్రసాదిస్తాడు. వసువు నివసిస్తున్న నగరానికి ప్రక్కగా శుక్తిమతి అనే నది ఉంది. శుక్తిమతి అనే నది ప్రక్కన ఉన్న కోలహలుడు అనే పర్వతము శుక్తిమతి మీద మోజుపడి ఆ నదిలో పడతాడు. అప్పుడు ఆ నది మార్గములో వెళ్తున్న వసువు తన ఆయుధంతో కోలహలుడిని ప్రక్కన పాడేస్తాడు. శుక్తిమతికి మరియు కోలహలుడికి మధ్య జరిగిన సంపర్కము వలన [[గిరిక]] అనే కుమార్తె వసుపదుడు అనే కుమారుడు జన్మిస్తారు. శుక్తిమతి వారివురిని వసువుకి కానుకగా ఇస్తుంది. వసువు గిరికని వివాహం చేసుకొంటాడు. వసువు వసుపదుడుని సైన్యాధిపతిగా చేస్తాడు. ఒకరోజు వసువు వేటకు వెళ్తాడు అప్పుడు తన భార్య గిరిక గుర్తు రావడంతో [[రేతస్సు]] పడుతుంది. ఆ పడిన [[రేతస్సు]]ని ఒక దొన్నెలో చేర్చి, ఆ దొన్నెని [[డేగ]]కి ఇచ్చి తన భార్యకి ఇవ్వమంటాడు. ఆ డేగ ఆ దొన్నెను తీసుకొని పోవుతుండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థం అని ఆలోచించి, ఆ డేగతో పోట్లాడూతుంది అప్పుడు ఆ [[రేతస్సు]] యమునా నదిలో పడుతుంది. ఆ యమునా నదిలో ఉన్న ఒక [[చేప]] ఆ [[రేతస్సు]] అని భక్షిస్తుంది ఆ భక్షించడం వల్ల అది అండంతో కూడి పిండంగా మారుతుంది. ఒకరోజు [[బెస్త]]<nowiki/>వారు చేపలు పట్టు తుండగా ఈ [[చేప]] చిక్కుతుంది. ఆ చేపను బెస్తవారు వారి రాజైన దాశరాజు వద్దకు తీసుకొని పోతారు.
|