తెలంగాణ: కూర్పుల మధ్య తేడాలు

→‎చరిత్ర: చౌడవరం (వేంసూరు) గ్రామ వ్యాసంలో రాష్ట్రానికి సంబంధించిన చరిత్ర విభాగం గ్రామ వ్యాసంలో అవసరం లేనందున అక్కడ తొలగించి ఈ వ్యాసం చరిత్ర విభాగంలో కూర్పు చేసాను
పంక్తి 136:
 
<big>'''ఆసఫ్‌జాహీల కాలం''':</big> క్రీ.శ.1724 నుంచి తెలంగాణ ప్రాంతాన్ని ఆసఫ్‌జాహీలు పాలించారు. రాజభాషగా పర్షియన్ స్థానంలో [[ఉర్దూ భాష|ఉర్దూ]] ప్రవేశపెట్టారు.<ref>తెలంగాణ చరిత్ర, రచన: సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 196</ref> స్థానిక ప్రజలను అణకద్రొక్కి ఢిల్లీనుంచి ఉద్యోగస్తులను రప్పించడంతో ముల్కీ ఉద్యమం తలెత్తింది. క్రమక్రమంగా ప్రజలలో తలెత్తిన స్వేచ్ఛా భావనలతో 20వ శతాబ్ది ప్రారంభం నుంచి పలు రచయితల మూలంగా ప్రజలలో చైతన్యం వచ్చింది. [[సురవరం ప్రతాపరెడ్డి]] 1925లో [[గోలకొండ పత్రిక|గోల్కొండ పత్రికను]] స్థాపించడం, 1930 నుంచి నిజాం రాష్ట్ర ఆంధ్రమహాసభలు జరగడంతో ప్రజలలో చైతన్యం అధికమైంది. సురవరంతో పాటు [[బూర్గుల రామకృష్ణారావు]], [[పులిజాల వెంకటరావు]], [[కొండా వెంకట రంగారెడ్డి]], [[మాడపాటి హనుమంతరావు|మాడపాటి హన్మంతరావు]], [[మందుముల నరసింగరావు]], [[రావి నారాయణరెడ్డి]], [[జమలాపురం కేశవరావు]] తదితరులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు.
 
హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ [[నిజాం]] నవాబు [[ఉస్మాన్ ఆలీ ఖాన్]] నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు [[1946]] నుంచి [[1948]] మధ్య వీరోచిత పోరాటం చేశారు. దీన్నే '''తెలంగాణ విమోచనోద్యమం'''గా పిలుస్తారు. రెండు వందల సంవత్సరాల దోపిడి, అణిచివేతకు నలభై ఏడు సంవత్సరాల తిరుగుబాటు, సాయుధపోరాటం ఒక దశ మాత్రమే. వివిధ సంఘాల, పార్టీల, ప్రజాస్వామికవాదుల, రచయితల, ప్రజల సంఘటిత క్రమ-పరిణామపోరాటమది. హైదరాబాద్ సంస్థానంలో ప్రస్తుత తెలంగాణాతో పాటు మరాఠ్వాడ ([[మహారాష్ట్ర]]), బీదర్ ([[కర్ణాటక]]) ప్రాంతాలు ఉండేవి. 3 భాషా ప్రాంతాలకు చెందిన మొత్తం 16 జిల్లాలకు గాను 8 జిల్లాలు తెలంగాణా ప్రాంతానికి చెందినవి కాగా, మరాఠా, కన్నడ ప్రాంతాలకు చెందినవి 8 జిల్లాలుండేవి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిననూ నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం లేకపోవడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దేశమంతటా స్వాతంత్ర్యోత్సవాలతో ప్రజలు ఆనందంతో గడుపుచుండగా నిజాం సంస్థాన ప్రజలు మాత్రం నిరంకుశ బానిసత్వంలో కూరుకుపోయారు. హైదరాబాదు రాజ్యాన్ని పాలిస్తున్న ఏడవ నిజామ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ రజాకార్లను ఉసిగొల్పాడు. నిజాంకు అండగా ఖాసిం రజ్వీ నేతృత్వంలోని [[రజాకార్లు]] గ్రామాలపైబడి దోపిడిచేయడం, ఇండ్లు తగలబెట్టడం<ref>భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగు యోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ కమిటి, 2006 ప్రచురణ, పేజీ 176</ref> నానా అరాచకాలు సృష్టించారు.<ref>ఆంధ్రజ్యోతి దినపత్రిక, రంగారెడ్డి జిల్లా టాబ్లాయిడ్, తేది 17-09-209</ref> అతని మతోన్మాద చర్యలు కోరలాల్చి వెయ్యి నాల్కలతో విషంకక్కాయి.<ref>స్వాతంత్ర్య సమర నిర్మాతలు, స్వాతంత్ర్యోద్యమ చరిత్ర పరిశోధన సంస్థ ప్రచురణ, 1994, పేజీ 48</ref> హీనమైన బతుకులు వెళ్ళదీస్తున్న జనం గురించి అస్సలు పట్టించుకోకుండా ప్రజల నుండి బలవంతంగా వసూలుచేసుకున్న సొమ్ముతో విలాసాలు, జల్సాలు, భోగభాగ్యాలు చేసుకొనేవారు. దీనితో [[రామానందతీర్థ]] నేతృత్వంలో [[ఆర్యసమాజ్]] ఉద్యమాలు, కమ్యూనిష్టుల ఆధ్వర్యంలో సాయుధపోరాటాలు ఉధృతమయ్యాయి. మొదట నల్గొండ జిల్లాలో ప్రారంభమైన ఉద్యమం శరవేగంగా నైజాం సంస్థానం అంతటా విస్తరించింది. [[రావి నారాయణరెడ్డి]], [[చండ్ర రాజేశ్వరరావు]], [[మల్లు స్వరాజ్యం]], [[ఆరుట్ల కమలాదేవి]], [[బొమ్మగాని ధర్మభిక్షం]], [[మాడపాటి హనుమంతరావు]], [[దాశరథి రంగాచార్య]], [[కాళోజి నారాయణరావు]], [[షోయబుల్లాఖాన్]], [[సురవరం ప్రతాపరెడ్డి]] తదితర తెలంగాణ సాయుధ పోరాటయోధులు వారికి స్ఫూర్తినిచ్చే కవులు, రచయితలు మూలంగా 1948లో ఉధృతరూపం దాల్చి చివరికి భారత ప్రభుత్వం సైనిక చర్యతో [[నైజాం]] సంస్థానాన్ని 1948 సెప్టెంబరు 18న భారత్ యూనియన్‌లో విలీనం చేసుకుంది.
{{main|తెలంగాణ విమోచనోద్యమం}}
 
"https://te.wikipedia.org/wiki/తెలంగాణ" నుండి వెలికితీశారు