విశ్వనాధ నాయకుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
చి 106.212.251.101 (చర్చ) చేసిన మార్పులను స్వరలాసిక చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు. ట్యాగు: రోల్బ్యాక్ |
||
పంక్తి 22:
==సంక్షిప్త చిత్రకథ==
మధురనేలుతున్న పాండ్య రాజు, తంజావూరు పాలకుడు చోళ రాజు శ్రీకృష్ణదేవరాయల సామంతులు. చోళరాజు పాండ్యుని పై దండయాత్ర చేసి పాండ్యరాజుని రాజ్యభ్రష్టుని చేసేడు. పాండ్యరాజు శ్రీకృష్ణదేవరాయలితో మొర పెట్టుకున్నాడు. శ్రీకృష్ణదేవరాయలు చోళ రాజుని శిక్షించి, పాండ్యరాజుని తిరిగి సింహాసనం పై పునఃప్రతిష్ఠ వలిసిందిగా నాగమనాయకుని ఆదేశిస్తాడు. నాగమనాయకుడు చోళుని ఓడించి రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటాడు. కానీ రాజాజ్ఞను ధిక్కరించి తనను స్వతంత్ర రాజుగా ప్రకటించుకుంటాడు. ఊహించని ఈ పరిణామానికి శ్రీకృష్ణదేవరాయలు విస్తుపోతాడు. నాగమనాయకుని పట్టి బంధించగల వారెవరని నిండు సభలో ప్రశ్నిస్తాడు శ్రీకృష్ణదేవరాయలు.. ఎవరూ ముందుకు రారు. విశ్వనాధ నాయకుడు తండ్రి నెదుర్కొనడానికి ముందుకొస్తాడు. విశ్వనాధనాయకుడి తల్లి ఈ పరిణామానికి తల్లడిల్లుతుంది. ఎవరికి ఆపద జరిగినా తనకు తీరని దుఃఖం కలుగుతుందని కలవరపడుతుంది.. తండ్రి ద్వారా సంక్రమించిన కళంకాన్ని చెరపవలసిన బాధ్యత తనదే అని తల్లిని ఒప్పించి, శ్రీకృష్ణదేవరాయల, మహామంత్రి ఆశిస్సులతో దాడికి వెడలుతాడు విశ్వనాధనాయకుడు. నాగమనాయకుని కుమారుని తనతో కలవమంటాడు.. విశ్వనాధుని భవిష్యత్తు కై తానీ నిర్ణయం తీసుకున్నానని నచ్చచెప్ప బోతాడు. శ్రీకృష్ణదేవరాయల వారి మన్నింపు కోరి రాజాజ్ఞ పాటించమంటాడు విశ్వనాధనాయకుడు. తండ్రికొడుకుల మధ్య యుధ్దం అనివార్యమవుతుంది. యుధ్దంలో తండ్రిని ఎదిరించి, ఓడించి, బంధించి ప్రభువు ముందు నిలుపుతాడు విశ్వనాధనాయకుడు. నాగమనాయకుని మన్నించి విశ్వనాధనాయకుని పాండ్యరాజ్యానికి రాజుగా ప్రకటిస్తాడు శ్రీకృష్ణదేవరాయలు. పాండ్యరాజుకు విజయనగరంలో ఆశ్రయం కల్పిస్తాడు శ్రీకృష్ణదేవరాయలు.
|