నందమూరి తారక రామారావు: కూర్పుల మధ్య తేడాలు

చి Saitejabaru (చర్చ) చేసిన మార్పులను 2409:4070:2018:154A:1C41:4612:ADF5:6384 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
10
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 50:
రామారావు [[1947]]లో పట్టభద్రుడయ్యాడు. తదనంతరం ఆయన [[మద్రాసు]] సర్వీసు కమిషను పరీక్ష రాసాడు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడుగా నిలిచాడు. అప్పుడు ఆయనకు [[మంగళగిరి]]<nowiki/>లో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది. అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయాడు.
 
ప్రముఖ నిర్మాత [[బి.ఏ.సుబ్బారావు]] ఎన్టీఆర్ ఫొటోను [[ఎల్వీ ప్రసాదు]] దగ్గర చూసి, వెంటనే ఆయనను [[మద్రాసు]] పిలిపించి [[పల్లెటూరి పిల్ల]] సినిమాలో <!--ఎటువంటి పరీక్షలు లేకుండానే -->కథానాయకుడిగా ఎంపిక చేసాడు. దీనికి గాను రామారావుకు వెయ్యి నూటపదహార్ల పారితోషికం లభించింది. వెంటనే ఆయన తన సబ్-రిజిస్ట్రారు ఉద్యోగానికి రాజీనామా చేసేసాడు. కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు. ఈలోగా [[మనదేశం]] అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించాడు. అంచేత ఆయన మొదటిసారి కెమేరా ముందు నటించిన సినిమా [[మనదేశం]] అయింది. [[1949]]లో వచ్చిన ఆ సినిమాలో ఆయన ఒక పోలీసు ఇన్స్‌పెక్టర్‌ పాత్ర పోషించాడు. [[1950]]లో పల్లెటూరి పిల్ల విడుదలైంది. అదే సంవత్సరం [[ఎల్.వి.ప్రసాద్|ఎల్వీ ప్రసాదు]] [[షావుకారు]] కూడా విడుదలైంది. ఈ రెండు సినిమాల తరువాత ఎన్టీఆర్ తన నివాసం [[చెన్నై|మద్రాసు]]<nowiki/>కు మార్చివేశాడు. థౌజండ్‌ లైట్స్‌ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని అందులో ఉండేవాడు. ఆయనతో పాటు ఆ గదిలో యోగానంద్ (తరువాతి కాలంలో నిర్మాత అయ్యాడు) కూడా ఉండేవాడు. <!--ఆ సమయంలో రామారావు డబ్బుకు చాలా ఇబ్బంది పడ్డాడు. ఆఖరికి బస్సు చార్జీలకు కూడా డబ్బుండేది కాదు.-->
 
[[1951]]లో కె.వి.రెడ్డి [[పాతాళభైరవి]], దాని తరువాత అదే సంవత్సరం [[బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి|బి.ఎన్‌.రెడ్డి]] [[మల్లీశ్వరి]], [[1952]]లో ఎల్వీ ప్రసాదు [[పెళ్ళిచేసి చూడు]], ఆ తరువాత వచ్చిన [[కమలాకర కామేశ్వరరావు]] చిత్రం [[చంద్రహారం]] ఆయనకు నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి. ఈ సినిమాలన్నీ విజయావారివే. ప్రతీ సినిమాకు నెలకు 500 రూపాయిలు జీతం మరియు 5000 రూపాయిల పారితోషికమూ ఇచ్చారు. [[పాతాళభైరవి]] 3410 కేంద్రాలలో 100 రోజులు ఆడి అప్పట్లో సంచలనం సృష్టించింది. తన ఉంగరాల జుట్టుతో,ఆడింది స్ఫురద్రూపంతో, వెలుగులు విరజిమ్మే నవ్వుతో ఆంధ్రదేశ ప్రజలను ఆకట్టుకుని వారి మనసుల్లో నిలిచిపోయాడు.
 
[[1956]]లో విడుదలైన [[మాయాబజార్‌]]లో ఆయన తీసుకున్న 7500 రూపాయల పారితోషికం అపట్లో అత్యధికం అని భావిస్తారు. [[1959]]లో [[ఏ.వి.యం.ప్రొడక్షన్స్]] వారు నిర్మించి, విడుదల చేసిన [[భూకైలాస్]] చిత్రంలో [[రావణబ్రహ్మ]] పాత్రకు <!--నటించేందుకు ఆయన రావణుడి గూర్చి అధ్యయనం చేసి,--> రామారావు ప్రాణప్రతిష్ఠ చేసాడు. <!--మరెవ్వరూ ఆ పాత్రకు రామారావుగారిలా న్యాయం చేయలేరు. -->[[1960]]లో విడుదలయిన [[శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం]] భారీ విజయం సాధించింది. <!--ఆ సినిమా చూసి వెంకటేశ్వర స్వామి భక్తులు ఎన్.టీ.ఆర్. దర్శనం కోసం ఆయన ఇంటి ముందు వరుసలు కట్టారు.--> [[శ్రీమద్విరాటపర్వము]]లో ఆయన ఐదు పాత్రలు పోషించాడు. ఆ విధంగా 1950లలో ఎన్టీఆర్ ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగాడు. సంవత్సరానికి 10 సినిమాల చొప్పున నటిస్తూ ఉండేవాడు. [[1963]]లో విడుదలైన [[లవకుశ]] అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన 22 సంవత్సరముల వరకు ఆయన పారితోషికం 4 లేదా 5 అంకెల్లోనే ఉండేది. [[1972]]నుంచి ఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది.