నోబెల్ బహుమతి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి 106.197.30.85 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWBNew చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు. ట్యాగు: రోల్బ్యాక్ |
భాష సవరణ, వికీకరణ |
||
పంక్తి 26:
==నోబెల్ బహుమతి విలువ==
నోబెల్ బహుమతి ప్రదానోత్సవము ప్రతి సంవత్సరము [[ఆల్ఫ్రెడ్ నోబెల్]] వర్ధంతి అనగా [[డిసెంబరు 10]]వ తేదీ నాడు జరుపబడుతుంది. ఈ బహుమతి ప్రదానోత్సవం [[స్టాక్హోమ్|స్టాక్హోమ్]]<nowiki/>లోని సమావేశ మందిరంలో జరుగుతుంది. [[స్వీడన్|స్వీడన్]] రాజు చేత ప్రతీ బహుమతి గ్రహీతకు ఒక యోగ్యతాపత్రము, బంగారు పతకము, బహుమతి
==నోబెల్ బహుమతి పొందిన భారతీయులు==
==
ఆధునిక కాలంలో భారతీయ కవిత్వానికి ఒక మైలురాయిగా నిలిచి దేశ విదేశాలలో భారతీయ కీర్తి పతాకను ఎగురవేసిన మహా కవులలో ఆధునికుడు రవీంద్రనాథ్ టాగూర్. ప్రపంచంలో ఒకే కవి వ్రాసిన రెండు గీతాలను రెండు దేశాలు తమ జాతీయ గీతాలుగా చేసుకున్న ఘనత గల ఒక మహాకవి రవీంద్రనాధ్ టాగూర్. భారత, బంగ్లాదేశ్ రెండింటికి ఆయన వ్రాసిన గీతాలే జాతీయ గీతాలు ఇంతేగాకుండా తన కవితా సంపుటం ‘గీతాంజలి’కి 1913వ సంవత్సరపు సాహిత్యంలో నోబెల్ బహుమతి పొంది భారత కీర్తి బావుటాను ఎగురవేసిన భారత ముద్దుబిడ్డ నోబెల్ బహుమతి పొందిన మొదట ఆసియావాసి. సంపూర్తిగా సలలితమైన కొత్తవైన, సొగసైన పద్యాలతో ఆయనలో నిబిడీకృతమై ఉన్న నైపుణ్యంతో, కవితా చాతుర్యాన్ని పాశ్చాత్య సాహిత్యంలో కొంత భాగమైన ఇంగ్లీషు భాషలో తన స్వంత పదాలతో వ్యక్తపరచినందులకు నోబెల్ బహుమతి ఆయనకు ఇవ్వబడింది. గాంధీ, నెహ్రుల తరువాత భారతదేశంలో ప్రసిద్ధులైన వ్యక్తులలో రవీంద్రనాధ్ టాగూర్ ఒకరు.
==
భారతదేశానికి ప్రాచీనకాలం మంచి విజ్ఞాన శాస్త్రంలో కొంత కృషి చేసిన కీర్తి ఉంది. కానీ తురుష్కుల పరిపాలనలో దేశం వెయ్యి సంవత్సరాలకు పైగా అణగి మణగి ఉండటంతో మన విజ్ఞాన శాస్త్ర జ్ఞాన సంపద లుప్తం అయింది. ఆసక్తి అడుగంటి పోయింది. అలాంటి సమయంలో, దేశాన్ని ప్రపంచ విజ్ఞాన శాస్త్ర పటం మీదకు చేర్చ గలిగినవాడు, నేటికి నాటికి కూడా పూర్తి భారతీయుడై ఉండి తన విజ్ఞాన శాస్త్ర్త పరిశోధనలకు నోబెల్ బహుమతిని పొందిన మహామహుడు ఒక్కడు ఉన్నాడు. ఆయనే సర్ చంద్రశేఖర్ వెంకటరామన్. వాల్తేరులో ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాశాల శాస్త్ర సాంకేతిక శాఖ యొక్క సంపూర్ణ అభివృద్ధికి ఆయన చాలా గొప్ప నిర్మాణాత్మక పాత్రవహించాడు. 1954 లో భారత ప్రభుత్వం మొట్టమొదటిసారిగా దేశంలో అత్యుత్తమ బిరుదు ‘భారతరత్న’ను ప్రవేశపెట్టి సర్వేపల్లి రాధాకృష్ణన్, చక్రవర్తుల రాజగోపాలాచారి, సి.వి.రామన్కు ప్రధానం చేసింది.
==
[[1968]]వ సంవత్సరపు శరీరధర్మ శాస్త్రం లేక [[వైద్యశాస్త్రము|వైద్య శాస్త్రానికి]] నోబెల్ బహుమతి గెలుచుకున్న ముగ్గురిలో [[హరగోవింద్ ఖొరానా|హర్గోవింద్ ఖొరానా]] ఒకరు. మిగిలిన ఇద్దరు [[అమెరికా]]కు చెందిన కార్నెల్ విశ్వవిద్యాలయ ఆచార్యులు రాబర్ల్ డబ్ల్యు. హాలీ, రెండవ వాడు [[హర్ గోవింద్ ఖురానా|హర్గోవింద్ ఖురానా]], మూడవ వ్యక్తి బెథెస్టాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్లో పనిచేస్తున్న పరిశోధకులు మార్షల్ డబ్ల్యు. నిరెన్బెర్గ్. అవిభక్త భారతదేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం వారు పరిపాలిస్తున్న కాలంలో పశ్చిమ [[పంజాబ్]] రాష్ట్రంలోని [[రాయ్పూర్|రాయ్పూర్]] గ్రామంలో హిందూ దంపతులకు జన్మించాడు. రాయ్పూర్ గ్రామం కేవలం వంద మంది జనాభా గల చిన్న గ్రామం. బాగా పేద కుటుంబం అయినా ఖురానా తండ్రి కొడుకును బాగా చదివించాడు. [[1945]]లో అప్పటి ప్రభుత్వ సహకారంతో [[ఇంగ్లాండు]]కు వెళ్ళి లివర్పూల్ విశ్వవిద్యాలయంలో పిహెచ్.డి చేసే అవకాశం లభించింది. [[విజ్ఞాన శాస్త్రం]]లో ‘[[మాలిక్యులర్ బయాలజీ]]’ అనే కొత్త శాఖకు పునాది వేసి ఇందులో విశేషమైన కృషి చేసారు. [[1958]] నుండి [[1968]] వరకు కేవలం 5 సార్లు మాత్రమే [[వైద్యశాస్త్రం]]లో అత్యుత్తమ కృషికి ఇవ్వబడిన నోబెల్ బహుమతి [[జన్యుశాస్త్రం]]లో జరిగిన పరిశోధనకు ఇవ్వటం [[మాలిక్యులర్ బయాలజీ]] యొక్క ప్రాముఖ్యాన్ని తెలుపుతుంది.
==
మానవ సేవ కన్నా మిన్న లేదని చాటిన మహిళామణి [[మదర్ థెరిస్సా|మదర్ థెరిస్సా]]. ఈ దేశంలో పుట్టకపోయినా, ఈ దేశంలోని ఆపన్నులు, ఆర్తులు, ఆపదలో ఉన్నవారిని ఆదుకొనుటలో ఆమెను మించిన వారు లేరు. ప్రపంచంలోని గొప్ప మహిళామణులలో ఎవరు అంటే ఆమె పేరు పేర్కొనకుండా వేరొకరి పేరు చెప్పటానికి కుదరదు. అందుకే ఆమె ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన వనిత అనటంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. [[1929]] [[జనవరి 6]]వ తేదిన [[భారతదేశం]]లోని [[కలకత్తా]] నగరం చేరుకున్నది. అప్పటినుండి విద్యాబోధన చేస్తూ... [[1947]]లో పేదరికాన్ని స్వీకరిస్తున్నట్లు ప్రమాణం చేసింది. ‘శాంతినగర్’ అనే పేరుతో అసన్సోల్ నగరం ఒక కాలనీ కట్టుకునేటట్లు [[కుష్టు]] రోగం గలవారిని ప్రోత్సహించింది. స్ర్తీ ధార్మిక సమాఖ్య, మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే ధార్మిక సంస్థను నెలకొల్పింది. [[పద్మశ్రీ]], [[భారతరత్న]] లాంటి అత్యున్నత పురస్కారాలు [[మదర్ థెరిస్సా|మదర్ థెరిస్సా]]కు అందించారు. ఆమె చేసిన సేవలు శాంతి బోధనకు ప్రపంచ అత్యున్నత పురస్కారం [[నోబెల్ శాంతి బహుమతి]] ఆమెను వరించింది.
==
[[భౌతిక శాస్త్రం]]లో నోబెల్ బహుమతిని పొందిన భారత సంతతికి చెందిన రెండవ వ్యక్తి [[సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్|సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్]]. [[సి.వి.రామన్|సర్ సి.వి.రామన్]] లాగానే ఈయన కూడా దక్షిణ భారత దేశానికి చెందినవాడే. ఆయన [[చికాగో విశ్వవిద్యాలయం|చికాగో విశ్వవిద్యాలయ]] పరిశోధన సభ్యులలో ఒకరిగా [[1937]]వ సంవత్సరం [[జనవరి]] నెలలో చేరాడు. అప్పటినుంచి చివరివరకూ ఆయన సుదీర్ఘకాలం పాటు అంటే 60 సంవత్సరాలకు పై ఆ విశ్వవిద్యాలయంలోనే పనిచేసారు. చంద్రశేఖర్ ఇరవై వరకు గౌరవ పట్టాలు పొందారు. ఇరవై ఒక్క ప్రముఖ సంస్థలలో సభ్యుడిగా ఎన్నికయ్యారు. [[1983]]లో నోబెల్ బహుమతితో సహా ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు పొందారు. ఆయన గౌరవ స్మృతి చిహ్నంగా [[1999]]లో [[అమెరికా]] ప్రయోగించిన ‘ఎక్స్రే అంతరిక్ష ఖగోళ దర్శిని’కి ‘చంద్రా’ అని పేరుపెట్టడం ఆయనకు దక్కిన అరుదైన గౌరవం.
==
[[అర్థశాస్త్రం]]లో నోబెల్ బహుమతిని అందుకున్న వారిలో [[భారతదేశం]]లోనే కాదు, [[ఆసియా ఖండం]]లోనే ఏకైక వ్యక్తి ప్రొఫెసర్ [[అమర్త్యసేన్|అమర్త్యసేన్]]. మొత్తం ప్రపంచ దేశాలు, [[అర్థశాస్త్రం]] మీద నూతన దృష్టిసారించడానికి కారణం అయిన వ్యక్తి [[అమర్త్యసేన్|అమర్త్యసేన్]]. [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రంలోని శాంతినికేతన్లో పుట్టిన [[అమర్త్యసేన్|అమర్త్యసేన్]]కు పేరు పెట్టింది [[రవీంద్రనాథ్ టాగూర్|రవీంద్రనాథ్ టాగూర్]]. [[అమర్త్యసేన్|అమర్త్యసేన్]] ప్రపంచ [[ఆర్థిక శాస్త్రము|ఆర్థికశాస్త్రం]]లో దారిద్య్రం, కరువులకు అన్వ యించేటట్లుగా నైతిక, తాత్త్విక అసమానతలు వివరించాడు. ఆయన బహుముఖ ప్రజ్ఞకు [[1998]]లో ఆయనను [[ఆర్థిక శాస్త్రం]]లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నోబెల్ బహుమతి వరించింది. అదే సంవత్సరం భారతదేశపు అత్యంత ప్రతిష్ఠాత్మక ‘[[భారతరత్న]]’ బిరుదు ఇవ్వబడింది. ఇప్పటివరకు [[అర్థశాస్త్రం]]లో నోబెల్ బహుమతి పొందిన ఏకైక మేధావి.
==
[[విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్|విద్యాధర్ సూరజ్ నయిపాల్]] పూర్వీకుల రీత్యా భారత సంతతికి చెందినవాడు. ఆయన తాతలనాడే వెస్టిండీస్లోని [[ట్రినిడాడ్|ట్రినిడాడ్]] దీవికి వ్యవసాయక్షేత్రాలలో కూలీలుగా పనిచేయటానికి వెళ్ళారు. ఆయనకు [[బ్రిటన్|గ్రేట్ బ్రిటన్]] పౌరునిగా పరిగణనతో నోబెల్ బహుమతి ఇవ్వబడింది. కానీ, ఆయన పూర్వీకులు భారతీయ సంతతికి చెందిన వారు కావడం వలన మనం ప్రస్తావించడం జరుగుతుంది. మనోగోచారమైన, అర్థవంతమైన నిశితమైన పరిశీలనను తన రచనలలో ఏకం చేయ గలిగిన ప్రజ్ఞ, అణచివేయబడిన చరిత్రల ఉనికిని వాటితో ప్రతిఫలింపచేసినందుకు గాను [[సాహిత్యం]]లో వి.ఎస్.నయిపాల్కు నోబెల్ పురస్కారం లభ్యమైంది.
==
[[సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్|సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్]], విద్యాధర్ సూరజ్ నయిపాల్ల తరువాత నోబెల్ పురస్కారం అందుకున్న, విదేశాల్లో స్థిరపడిన మరో భారత సంతతి శాస్తవ్రేత్త [[వెంకటరామన్ రామకృష్ణన్|వెంకట్రామన్ రామృష్ణన్]]. ఈయన [[జీవ రసాయన శాస్త్రవేత్త|జీవరసాయన శాస్తజ్ఞ్రుడు]]. [[తమిళనాడు]]లోని చిదంబరంలో [[1952]] సంవత్సరములో జన్మించాడు. తండ్రి ఉద్యో గరీత్యా గుజరాత్కు వెళ్ళడంతో బాల్యం, విద్యాభ్యాసమంతా [[బరోడా]]లో గడిచింది. మహారాజా శాయాజీరావు విశ్వవిద్యాలయంలో బీయస్సీ ఫిజిక్స్ చదివాడు. తర్వాత అమెరికా వెళ్ళి [[భౌతికశాస్త్రం]]లో పీహెచ్.డీ చేసి అక్కడే స్థిరపడ్డాడు. రైబోసోముల రూపము, ధర్మములపై చేసిన పరిశోధనలకు గాను [[రసాయన శాస్త్రం]]లో [[2009]] నోబెల్ పురస్కారం లభించింది.
==మహాత్మా
ఇది ప్రపంచంలోని అనేకులకు వచ్చే ఇంకొక సందేహం. [[1937]], [[1938]], [[1939]], [[1947]] సంవత్సరాలలో [[మహాత్మా గాంధీ]] పేరు నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రతిపాదించడం జరిగింది. [[1937]]లోను, అటు తరువాత కొంతకాలం పాటు ఆయన అనుచరులకే అర్థం కాని ఆయన సిద్ధాంతాలున్నాయని నోబెల్ కమిటీవారు ఆయన పేరును తుది జాబితాలో చేర్చలేదు. [[1947]]లో [[పాకిస్తాన్]] ఏర్పాటు విషయంలో వివాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆయనకు అవార్డు ఇవ్వకూడదని కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. [[1948]]లో [[నోబెల్ శాంతి బహుమతి]] కోసం [[మహాత్మా గాంధీ]]ని ఎంపిక చేశారు. అయితే ఆయన ఆ సంవత్సరం [[జనవరి 30]]వ తేదీన తుపాకీ గుండ్లకు బలి అయినారు. అప్పట్లో ఉన్న నియమం ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితులలోనే మరణించిన వ్యక్తులకు నోబెల్ బహుమతులు ప్రకటించాలనేది నిబంధన. గాంధీ ఒక సంస్థకు ప్రతినిధి కాదు. మరణ విల్లును ఆయన వ్రాయలేదు. బహుమతి ఎవరికి అందజేయాలో నోబెల్ సంస్థకు తెలియకపోవడంతో ప్రతిపాదన విరమించుకోబడింది. ఒక అర్హులు ఎవ్వరూ లేకపోవడంతో ఆ సంవత్సరం [[నోబెల్ శాంతి బహుమతి]] ఎవ్వరికీ ఇవ్వలేదు. అంతేగాని కొందరు ఊహించినట్లుగా ఆయన [[బ్రిటిషు|బ్రిటిష్]] వారికి వ్యతిరేకంగా ఉద్యమం నడపటం వలన, తెల్లవారికి వ్యతిరేకంగా నల్ల వారి తరపున ఉద్యమాలకు నాయకత్వం వహించటం వలనే [[మహాత్మా గాంధీ]]కి నోబెల్ బహుమతి ఇవ్వలేదనే వాదం సరియైనది కాదు. ఇలా ఈ బహుమతుల మీద ఎన్నో ప్రశంస లు, ఎన్నో విమర్శలు.
==మూలము==
Line 79 ⟶ 75:
* [[నోబెల్ కవిత్వం (పుస్తకం)]]
[[వర్గం:నోబెల్ బహుమతి]]
[[వర్గం:పురస్కారాలు]]
|