వీధి నాటకం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) చి cite wikisource మూస ఎడిటర్ సహాయంతో చేర్చు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి భాషాదోషాల సవరణ, typos fixed: ె → ే (4), బాగ → బాగా using AWB |
||
పంక్తి 3:
==పల్లెవాసులే నటులు==
నాటకం లోని స్త్రీ పాతలను కూడా మగ
==నాటకం తీరు==
ఒక వేషధారి వేదికమీదికి రాగానే.... తన పాత్ర పేరు చెప్పుకుంటూ పాట పాడుతూ ఆ వేదికపై గుండ్రంగా తిరుగు తాడు. ఉదాహరణకు దుర్యోధనుని పాత్ర ధారి వేదికమీదికి తన సహోధరులతో వేదిక మీదికి రాగానే '' రాజు వెడలె రవి తేజములలరగ.... కుడి ఎడమల్ డాల్ కత్తులు మెరయగ..... అని పాడుతూ వస్తాడు. దాంతో ఆ వచ్చినది దుర్యోధనుడని ప్రేక్షకులకు తెలుస్తుంది. ఆ తర్వాత అతను ''ధుర్వోధన.....'' అంటూ చేతులు వూపుతూ తిరుగుతుంటే వెంట నున్న సోదరులు..'' రాజే... రాజే.... రాజే... '' అంటూ సుమారు పది నిముషాలు తిరుగుతారు. ఆతర్వాత దుర్వోధనుడు సింహాసనం పై ఆసీనుడై.. పాట రూపంలో..... ''సుఖమా మన రాజ్యామెల్లను జయమా.. '' అంటూ రాగాలు తీస్తూ పాడితే... దానికి వంతగా మిగతావారు సామూహికంగా వంత పాడతారు. ఈ వంత పాటలను వేదిక మీద వున్న వేష ధారులే కాక.... తెర వెనుక వున్న ఇతర వేష ధారులు కూడ కలిసి పాడుతారు. అసలు కథకన్నా ఇటువంటి వాటికే ఎక్కువ సమయం అయి పోతుంది. భీముడు- దుర్వోధను వాగ్వివాదము జరిగే సందర్భంలో..... వారి సంభాషణ చాల మొరటుగాను, అపహాస్యంగాను, వ్వక్తిగత నిందారోపణలు చేసుకున్నట్టు వుంటుంది. భాష కూడ అదే తీరులో వుంటుండి. పల్లెల్లో నిజంగా ఏదైన కొట్లాట జరిగితే ఆసందర్భంలో జరిగే మాటల లాంటివె... ఆ భాషనే సమయా సందర్భంగా వాడుతారు. కాని ప్రేక్షకులు దానిని కూడ స్వాగతిస్తారు. ఈ మధ్యలో ఏదేని మంచి పద్యం పొడుగ్గా రాగం తీస్తే.... దాన్ని మళ్ళీ పాడమని ''ఒన్ సు మోర్ '' అని అరుస్తారు. విధిగా ఆ పద్యాన్ని తిరిగి వారు పాడేవారు. సందర్బాను సారంగా మధ్య మధ్యలో ఒక మోస్తరు భూతు మాటలు కూడ పేలేవి. దానికి ప్రేక్షకులు కరతాళ ద్వనులతో ఈలలతో స్వాగతించేవారు. యుద్ధ సమయంలో ఎవరు ఎక్కువగా గంతులేస్తే వారు అంత బాగా నటించినట్లు లెక్క. ఆలా ఆవేశంతో రాత్రంతా గంతులేసి వళ్ళు హూనం చేసుకునేవారు నటులు. ఆవిధంగా ఆనాటి వీధి నాటకాలు సాగేవి...... పల్లెవాసులు కూడ బాగా ఆదరించేవారు.[[దస్త్రం:Bhima and duryodana.JPG|thumb|right|మహాభారత నాటకాల సందర్భంలో ధుర్యోధనుని వద ఘట్టం ప్రారంబానికి ముందుకు వస్తున్న భీమ, ధుర్యోధనుల వేష ధారులు. దామల చెరువులో తీసిన చిత్రం|174x174px]]
పంక్తి 20:
==ఆర్జునుడు తపస్సు మాను ఎక్కుట==
ఇది పగటి పూట జరిగే మరో ఘట్టం: ఒక పొడవైన మానును భారత మిట్టన పాతి వుంటారు. దాన్ని ఎక్కడానికి కర్ర మెట్లను ఏర్పాటు చేసి
==దుర్యోధనుని వద==
పగటి పూట జరిగే మహాభారత ఘట్టాలలో చివరిది.... అత్యంత ప్రజాదరణ కలిగినది ''ధుర్యోధన వధ:'' దీనికొరకు మైదాన మధ్యలో మట్టితో ధుర్యోధనుడు వెల్లకిలా పడుకొని వున్నట్లున్న అతి బారి విగ్రహాన్ని మట్టితో తయారు చేసి వుంచు తారు. దానికి తొడ భాగంలో ఎర్రని కుంకుమ కలిపిన కుండను గాని గుమ్మడి కాయను గాని పాతి వుంటారు. ధుర్యోధన పాత్ర దారి గదను చేత బూని ఆ విగ్రహంపై తిరుగుతూ పాట పాడు తుంటాడు. భీమ వేష దారి ఆ విగ్రహం చుట్టు తిరుగుతూ పాటలు పద్యాలు పాడు తుంటాడు. భీముడు..... ధుర్యోధనుని విగ్రహం పైకి ఎక్కరాదు. ధుర్యోధనుడు అప్పు డప్పుడు క్రిందికి దిగు తాడు. అప్పుడు ఇద్దరు కొంత సేపు యుద్ధం చేస్తారు. ఇలా సుమారు రెండు మూడు గంటల పాటు ప్రేక్షకులను అలరించి చివరి ఘట్టా నికొస్తారు. అప్పుడు భీమ వేష దారి ధుర్యోధనుని విగ్రహానికి తొడలో దాచిన గుమ్మడి కాయను పెద్ద కర్రతో పగల కొడతాడు. దుర్యోధన వేషదారి అ విగ్రహంపై పడి పోతాడు. నాటకం సమాప్తం. అంత వరకు ఏకాగ్రతో నాటకాన్ని వీక్షిస్తున్న వందలాది ప్రజలు ఒక్కసారిగా ధుర్యోధనుని విగ్రహం మీద పడి రక్తంతో తడిసిన ఆ మట్టిని, అందంగా అలంక రించిన తల భాగంలోని రంగు మట్టిని తలా కొంత పీక్కొని వెళ్లి పోతారు. ఆ మట్టిని తమ గాదెలలో
==యివికూడా చూడండి==
|