'''ఎం.టి. ఖాన్''' - మహమ్మద్ తాజుద్దీన్ ఖాన్. [[పౌరహక్కుల సంఘం, తెలంగాణ|పౌరహక్కుల]] ఉద్యమనాయకుడు, [[విప్లవ రచయితల సంఘం|విప్లవ రచయిత]], అధ్యాపకుడు, పాత్రికేయుడు. మార్క్సిస్టు ముల్లా. ది హైదరాబాద్లో పురానాపుల్ వంతెన దగ్గర మియాపైసా దర్గా, అబూహాషిమ్ మదానీ దర్గా. వీరిద్దరూ నిజాంల కాలం నాటి సూఫీ సాధువులు. వీరి వారసుడే ఎం.టి. ఖాన్. ఈ సూఫీ ఫకీర్ల వలెనే ఖాన్ సాబ్ కూడా ఫకీర్ జీవితమే గడిపారు. దర్గాల ముత్తవలి (ధర్మకర్త) అయిన ఖాన్ సాబ్ [[మగ్దూం మొహియుద్దీన్]] తో ప్రభావితుడై కమ్యూనిస్టు అయినారు. [[దర్గా]] లకు, [[మసీదు]] లకు దూరమైనా మార్క్సిస్టు ముల్లాలాగా జీవించారు. ఖాన్ సాబ్ పూర్వీకులు 400 ఏండ్ల క్రితం గుల్బర్గా నుంచి వలస వచ్చారు. గుల్బర్గాలోని [[హజరత్ ఖ్వాజా బందా నవాజ్|బందే నవాజ్]] (భక్తుల పెన్నిధి) దర్గా ముత్తవలి హుసేన్ షా వలీని కుతుబ్షా నవాబు ఇబ్రహీం కులి [[గోల్కొండ]]<nowiki/> కు రప్పించి తన కూతురు ఖైరతున్నీసాను ఇచ్చి పెళ్ళి చేశారు. పసి వయసులోనే తల్లి చనిపోతే గొల్ల స్ర్తీ పోషణలో ఖాన్ సాబ్ పెరిగారు. ఫలితంగా ఇస్లామ్, [[హిందూమతము|హిందూ]] మతాల సంస్కృతుల పట్ల గౌరవం పెంచుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటం ప్రభావంతో మగ్దూం, రాజబహదూర్ గౌర్ల శిష్యరికంలో తెలంగాణ కామ్రేడ్స్ సంఘంలో చేరారు. [[మగ్దూం మొహియుద్దీన్|మగ్దూం]] ప్రభావంతో [[ఉర్దూ భాష|ఉర్దూ]], [[పర్షియన్ భాష|పార్శీ]] సాహిత్యం అధ్యయనం చేశారు. యాకుత్పురాలోని ధర్మవంత్ కాలేజీలో ఆయానఆయన [[ఆంగ్ల భాష|ఇంగ్లీష్]] టీచర్. ‘ఇంగ్లీషు ఏ గాడిదైనా నేర్పుతుంది. ముందు మీరు [[మానవత్వం]] నేర్చుకోండి. నీతి నేర్చుకోండి’ అని మార్క్సిస్టు పాఠాలు నేర్పేవారు. [[ఉర్దూ భాష|ఉర్దూ]], [[పర్షియన్ భాష|పార్శీ]], [[అరబ్బీ భాష|అరబ్బీ]], [[హిందీ భాష|హిందీ]], [[మరాఠీ భాష|మరాఠీ]], [[తెలుగు]], [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] భాషల్లో అపార ప్రావీణ్యం గల ఖాన్ సాబ్ న్యూస్ టైమ్లో సియాసత్లో సంపాదకీయాలు రాశారు. ఎం.టి. ఖాన్ గుండెపోటుతో హైదరాబాదులో [[ఆగష్టు 20.8.] , [[2014]] న మరణించారు.