మాలతీ చందూర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి +{{Authority control}}
పంక్తి 40:
 
==జీవిత విశేషాలు==
మాలతీ చందూర్ [[కృష్ణా జిల్లా]] లోని [[నూజివీడు]]లో 1930 లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు జ్ఞానాంబ, వెంకటేశ్వర్లు. వీరు ఆరుగురు సహోదరులు. అందరికంటే ఆమె చిన్నది. వాళ్ళు ఉండే ఊరికి, రైల్వేస్టేషనుకు దూరం 13 మైళ్ళు. హనుమాన్‌జంక్షన్‌ కూడా అంతే దూరం. ఆ ఊరు [[మామిడి]] పళ్ళకు ప్రసిద్ధి. నాటి ప్రధాని [[జవహర్‌లాల్‌ నెహ్రూ]] నూజివీడు రసాలను [[బెర్నార్డ్‌షా]]కు బహుమతిగా ఇచ్చారని ప్రతీతి. ఊరికి వెళ్ళే దారిలో ముందుగా అడివాంజనేయుల గుడి, తరువాత [[మొగళ్ళ చెరువు]], [[బైరాగుల సత్రం]] స్వాగతం పలుకుతాయి. ఊర్లో [[ఉయ్యూరు]] రాజావారి దివాణముండేది. దివాణం పక్కనే ఎస్‌ఆర్‌ఆర్‌ పాఠశాల ఉంది. 8వ తరగతి వరకు ఎస్‌ఎస్‌ఆర్‌ పాఠశాలలోనే చదివింది. ఆమె బాల్యంలో అధికభాగం నూజివీడులోనే గడిచింది.
 
ఆ ఊర్లో ఎనిమిదవ తరగతి పూర్తి కాగానే చదువుకోవడానికి [[ఏలూరు]] వెళ్ళింది. అక్కడ వారి మామయ్యగారి (చందూర్) ఇంట్లో ఉండి చదువుకున్నారు. [[ఏలూరు]] లోని వల్లూరు సెయింట్‌ థెరిస్సా స్కూల్లో [[ఇంగ్లీషు]] మీడియంలో చేరారు. అప్పుడు చందూర్‌ గారి ద్వారా డి.కామేశ్వరి, ఆనందారామం, అరవిందాచారి, సక్కుబాయి వంటి వారితో పరిచయం ఏర్పడింది. [[ఏలూరులో]] వారున్న ఇంటికి దగ్గరగా 'కథావీధి' అనే సాహిత్య పత్రిక ఉండేది. అక్కడికి [[శ్రీశ్రీ]], [[విశ్వనాథ సత్యనారాయణ]], [[కృష్ణశాస్]]తి, [[నండూరి సుబ్బారావు]], వెంకటచలం, కావలి లక్ష్మీనరసింగం మొదలైన వారు వచ్చేవారు. అప్పుడే వీరందరినీ ఆమె చూడడం జరిగింది. 1947లో ఆమె, చందూర్‌ గారు జిటి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి [[మద్రాసు]] చేరుకున్నారు. సెంట్రల్‌లో దిగి ఒంటెద్దు బండెక్కి జార్జిటాన్‌లో అద్దె ఇంటికి చేరుకున్నారు. 1947 చివర్లో ఆమె, చందూర్‌ గారు వివాహబంధంతో ఒక్కటయ్యారు. [[మద్రాసు]]కు వచ్చిన తరువాతే పైవేటుగా ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తి చేశారు. వారు ఇంతకు మించి పెద్ద చదువులేం చదవలేదు. 1949లో వారి రచనా వ్యాసంగం ప్రారంభమైంది. అప్పట్లో [[రేడియో]]లో ఆమె రచనలను చదివి వినిపించేవారు. ఆ రోజుల్లో [[ఎగ్మూర్‌]]లో ఉన్న రేడియో స్టేషన్‌కు వెళితే ఒక సాహితీ సభకు వెళ్ళినట్లుండేది. అక్కడే [[ఆచంట జానకిరాం]], [[బుచ్చిబాబు]], [[జనమంచి రామకృష్ణ]], [[పి.వి.రాజమన్నార్]], [[మునిమాణిక్యం నరసింహారావు]] వంటి వారిని దగ్గరగా గమనించే అవకాశం కలిగింది. 1952 నుంచి రచనా వ్యాసంగంలో తీరిక లేకుండా గడిపారు. 1948 నుండి 64 వరకు పురసవాక్కంలో అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ తరువాత ప్రస్తుతమున్న వారి ఇంట్లోకి మారారు. అప్పటి నుండి ఇక్కడే ఉంటున్నారు. [[మద్రాసు]]లో వారికి చాలా మంది మంచి స్నేహితులున్నారు.<ref>[http://dearnri.org/tenugu.com/te/telugu/malati_chandoor.html మాలతీ చందూర్ తో ఇంటర్వ్యూ విశేషాలు]</ref>
పంక్తి 97:
==మూలాలు==
{{reflist}}{{Authority control}}
{{Authority control}}
 
[[వర్గం:తెలుగు రచయిత్రులు]]
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/మాలతీ_చందూర్" నుండి వెలికితీశారు