శ్రీరంగం గోపాలరత్నం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి +{{Authority control}} |
||
పంక్తి 16:
ఈమె [[1939]] సంవత్సరంలో [[విజయనగరం]] జిల్లా [[పుష్పగిరి]]లో వరదాచార్యులు, సుభద్రమ్మ దంపతులకు జన్మించారు. తల్లికి మేనమామ అయిన అప్పకొండమాచార్యులు రాసిన రెండు [[హరికథ]]లను పాలకొల్లు సభలో తొమ్మిదేళ్ళ వయసులో గానం చేయడమే వీరి తొలి ప్రదర్శన. [[కవిరాయని జోగారావు]] గారు వీరి ప్రధాన సంగీత గురువు. [[ద్వారం వెంకటస్వామి నాయుడు]], [[శ్రీపాద పినాకపాణి]] వద్ద కూడా సంగీతాన్ని అభ్యసించారు.
తొలిసారిగా విజయవాడ ఆకాశవాణిలో 1957 సంవత్సరం నిలయ విద్వాంసురాలిగా చేరారు. అప్పటినుండి రెండు దశాబ్దాల పాటు శాస్త్రీయ, లలిత సంగీత బాణీలతో శ్రోతలకు విందు చేశారు. ఎందరో ప్రముఖ సంగీత సాహిత్య ప్రముఖులతో కలిసి ఆమె ఎన్నో కార్యక్రమాలను సమర్పించారు. అన్నమయ్య పదాలు, క్షేత్రయ్య పదాలు, మీరా భజన గీతాలు ఆమె కంఠం నుంచి జాలువారిన మధురరస పారిజాతాలు. భామా కలాపం యక్షగానం, నౌకా చరితం ఆమె ప్రతిభకు గీటురాళ్ళు. ఈమెకు అత్యంత కీర్తిని తెచ్చినది సంగీత ప్రధానమైన రేడియో నాటకం ''మీరాబాయి''.
[[శ్రీ వేంకటేశ్వర వైభవం]] చిత్రంలోని ''[[ఒక పిలుపులో పిలిచితే]] పలుకుతావటా'' పాట ఆంధ్ర దేశం అంతా వ్యాపించింది. [[బికారి రాముడు]] చిత్రంలో ఈమె పాడిన ''నిదురమ్మా నిదురమ్మా'' గీతం బహుళ పాచుర్యం పొందింది.
పంక్తి 29:
==బయటి లింకులు==
*[http://surasa.net/music/annamayya/ ఈ వెబ్ సైటు లో శ్రీరంగం గోపాలరత్నం పాడిన పాటలను వినవచ్చు]
{{Authority control}}
[[వర్గం:తెలుగు కళాకారులు]]
|