పి. భాస్కరయోగి: కూర్పుల మధ్య తేడాలు

చి +{{Authority control}}
మూలాల తీరు మార్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 54:
===పాలమూరు జిల్లా వాగ్గేయకారులు===
 
పాలమూరు సాహిత్య పరిమళాన్ని పదిమందికి పంచాలనే స దుద్దేశ్యంతో ఎంతో శ్రమించి ఎందరో అజ్ఞాత సంకీర్తన కవుల జీవితాలను వెలుగులోకి తెచ్చారు కవి, [[రచయిత]] భాస్కరయోగి. భాస్కరయోగి పేరుకు తగ్గట్టుగానే అపారమైన తపస్సు లాంటిది చేసి ఈ గ్రంథాన్ని రూపొందించారు. పల్లె జీవితంతో వాగ్గేయకారుల జీవితాలను తెలుసుకోగోరు వారంతా తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. పాలమూరు జిల్లా వాగ్గేయకారులు పుస్తకాన్ని పి.భాస్కరయోగి రచించాడు. 2011లో ముద్రించిన ఈ పుస్తకంలో భాస్కరయోగి [[పాలమూరు జిల్లా]] పరిశోధనలు చేసి వాగ్గేయకారుల జీవితచరిత్రలు, వారి కీర్తనలు పొందుపర్చారు. ప్రముఖ కవి [[కపిలవాయి లింగమూర్తి]] అభివీక్షణం పేరుతో దీనికి ముందుమాట రాశారు. జిల్లాలోని 160 వాగ్గేయకారుల జీవితచరిత్రలను సంక్షిప్తంగా వివరించడమే కాకుండా ప్రతి వ్యాసం చివరన వారి కీర్తనలు కూడా రచయిత ఇచ్చాడు<ref>[https://www.youtube.com/watch?v=O7f4bl04fuI]] పాలమూరు జిల్లా వాగ్గేయకారులు]</ref>. చాలామంది వాగ్గేయకారుల చిత్రాలను కూడాపొందుపర్చడం జరిగింది. తెలుగులో తొలి [[వాగ్గేయకారుడు]] 13వ శతాబ్దికి సంతాపూర్ గ్రామవాసి అయిన [[సింహగిరి కృష్ణమాచార్యులు]] అని ఇతనితోనే సంకీర్తనా సాహిత్యం ప్రారంభమైందని<ref>పాలమూరుజిల్లా వాగ్గేయకారులు, పేజీ 19</ref> రచయిత వివరించాడు. 13వ శతాబ్ది నుంచి నేటి వరకు జిల్లాలో నివసించిన 137 వాగ్గేయకారులే కాకుండా పూర్తి వివరాలు లభించని మరో 30 వాగ్గేయకారుల గురించి పుస్తకం చివరన సంక్షిప్తంగా వివరించబడింది. ఇందులో వందలాది కీర్తనలు చేసిన వారి నుంచి రెండు-మూడు [[కీర్తనలు]] చేసిన రచయితల గురించి కూడా సాధ్యమైనంత వరకు వివరాలు సేకరించడం జరిగింది. [[పాలమూరు జిల్లా]] వాగ్గేయకారుల చరిత్రను అక్షరబద్ధం చేయడం హర్షణీయమని ప్రముఖ సాహిత్య పరిశోధకుడు వైద్యం వేంకటేశ్వరాచార్యులు పదార్చన పేరుతో వ్రాసిన ముందుమాటలో పేర్కొన్నాడు.<ref>[[https://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=3714]] ఆన్లైన్ లో భాస్కరయోగి పుస్తకాలు,]</ref> ఈ మహత్తర గ్రంథానికి వీరికి బి.ఎన్ శాస్త్రి కల్చరల్ ఎక్స్లెన్స్ అవార్డ్ 2012లో ప్రకటించింది.
 
===ధర్మధ్వజం===
 
సమాజంలో అవినీతి పెరిగిపోయింది. విలువలు పతనమవుతున్నాయి. ఎక్కడ చూసినా సామాజిక అశాంతి పెరిగిపోయిం ది. మరోవైపు ఈ దేశ గాలి పీల్చి పరదేశీ పాటపాడుతున్న వారి సంఖ్య పెరిగిపోతున్నదని భాస్కరయోగి కలవరంతో చేసిన రచనలు ఇవి.<ref>[[http://www.logili.com/paatalu-geyalu/dharma-dhwajam-dr-p-bhaskarayogi/p-7488847-10615696070-cat.html#variant_id=7488847-10615696070]] ధర్మధ్వజం,]</ref>
 
===సమత్వ సాధనలొ సౌజన్య మూర్తులు===
పంక్తి 66:
===యాదాద్రి సంకీర్తనాచార్యుడు ఈగ బుచ్చిదాసు===
 
తిరుపతి శ్రీవేంకటేశ్వరునికి అన్నమయ్య పదసేవ చేసినట్టుగా, భద్రాచల రామునికి కంచర్ల గోపన్న దాసుడయినట్టుగా యాదాద్రి నృసింహస్వామిని ఈగ బుచ్చిదాసు సేవించారు. ఆయన కీర్తనలు, రెండు శతకాలు, మంగళహారతులు, స్తోత్రాలు భాస్కరయోగి సంకలనకర్తగా ఈగ బుచ్చిదాసు సమగ్ర సాహిత్యం రచనలను 2017 ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించింది.<ref>[[https://www.ntnews.com/EditPage/article.aspx?category=1&subCategory=7&ContentId=494360]] యాదగిరి సంకీర్తనాచార్యుడు : నమస్తే తెలంగాణ, దినపత్రిక : డిసెంబర్ 2 2017] </ref>
 
===సంపాదకత్వం & కాలమిస్ట్===
"https://te.wikipedia.org/wiki/పి._భాస్కరయోగి" నుండి వెలికితీశారు