జస్టిస్ పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1916 స్థాపితాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
'''జస్టిస్ పార్టీ''' (అధికారిక నామం '''సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్''') ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో [[మద్రాసు ప్రెసిడెన్సీ]] లో ఏర్పడ్డ ఒక రాజకీయ పార్టీ. దీనిని [[నవంబరు 20]], [[1916]]న [[టి. ఎం. నాయర్]], [[పి. త్యాగరాయ చెట్టి]] [[చెన్నై|మద్రాసు]]లోని [[విక్టోరియా మెమోరియల్ హాలు]]లో ప్రారంభించారు. ప్రెసిడెన్సీ లో వరుసగా చోటు చేసుకున్న బ్రాహ్మణేతర సమావేశాల ఫలితంగా ఈ పార్టీ ఆవిర్భవించింది. 19వ శతాబ్దం చివర్లోనూ, 20 వ శతాబ్దం మొదట్లో బ్రాహ్మణులు, మరియు బ్రాహ్మణేతరుల మధ్య సామాజిక అంతరాలు పొడచూపాయి. దీనికి ముఖ్య కారణం ఇతర కులాలపై ఉన్న దురభిప్రాయాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో బ్రాహ్మణులే అధిక సంఖ్యలో ఉండటం మొదలైనవి. జస్టిస్ పార్టీ స్థాపనతో బ్రాహ్మణేతరులందరినీ ఒక తాటిపైకి తీసుకురావడం వల్ల ఒక రకంగా [[ద్రవిడ ఉద్యమం|ద్రవిడ ఉద్యమానికి]] ప్రారంభం అని చెప్పవచ్చు.<ref name="FishmanGarcia2010">{{cite book|author1=Joshua Fishman|author2=Ofelia Garcia|title=Handbook of Language and Ethnic Identity:The Success-Failure Continuum in Language and Ethnic Identity Efforts (Volume 2): The Success-Failure Continuum in Language and Ethnic Identity Efforts|url=http://books.google.com/books?id=OBoSDAAAQBAJ&pg=PA230|accessdate=7 July 2016|year=2010|publisher=Oxford University Press, USA|isbn=978-0-19-539245-6|pages=230–}}</ref><ref>{{cite web | url=https://indianexpress.com/article/opinion/columns/tamil-nadu-politics-history-dravidian-movement-brahmins-lower-caste-casteism-madras-presidency-4388452/ | title=A century of reform The Dravidian movement has left its progressive imprint on Tamil Nadu| work=Manuraj Shunmugasundaram | publisher=The Indian Express | date=22 November 2016 | accessdate=8 August 2018}}</ref><ref>{{cite web | url=https://www.outlookindia.com/magazine/story/the-inner-grammar-of-dissent-lives/298224 | title=The Inner Grammar Of Dissent Lives | publisher=Outlook India | work=K.S. Chalam | date=12 December 2016 | accessdate=8 August 2018}}</ref>
 
ప్రారంభంలో ఈ పార్టీ ఆంగ్ల పరిపాలనా విభాగాల్లో బ్రాహ్మణేతరులకు ఎక్కువగా ప్రాతినిథ్యం కల్పించేలా బ్రిటిష్ నాయకత్వంపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు. 1919లో మాంటేగ్ చెమ్స్ ఫర్డ్ సంస్కరణల ఫలితంగా మద్రాసు ప్రెసిడెన్సీ లో ద్వంద్వ పరిపాలనా విధానం (Diarchy) అమల్లోకి వచ్చింది. అలా మొదటి సారిగా జస్టిస్ పార్టీ ఎన్నికల్లో పాల్గొనింది. 1920 లో జరిగిన ప్రెసిడెన్సీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తర్వాత 17 ఏళ్ళలో ఐదుసార్లు ప్రభుత్వాలు ఏర్పాటు అయితే అందులో నాలుగు సార్లు ఈ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేసి 13 ఏళ్ళు అధికారంలో ఉంది. మద్రాసు ప్రెసిడెన్సీ లో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ పార్టీ ఇదొక్కటే. 1937లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయిన తర్వాత ఈ పార్టీ మళ్ళీ నిలదొక్కుకోలేకపోయింది. తర్వాత ఇది ఆత్మగౌరవ నినాదంతో పెరియార్ రామస్వామి నాయకత్వం కిందకు వచ్చింది. 1944లో పెరియార్ ఈ పార్టీని ద్రవిడర్ కళగం అనే పేరుతో సామాజిక సంస్థగా మార్పు చేసి ఎన్నికల్లో పోటీ చేయడం విరమింపజేశాడు. 1952లో మేమే అసలైన జస్టిస్ పార్టీ అంటూ ఇందులోని కొంతమంది తిరుగుబాటు దారులు ఎన్నికల్లో పోటీ చేశారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/జస్టిస్_పార్టీ" నుండి వెలికితీశారు